Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మోహినితో పరమశివుని ప్రేమవ్యవహారం గురించి పార్వతీ దేవికి తెలుసా? తర్వాత ఏం చేసింది?
పరమశివుడు తన అర్థాంగికి తన శరీరంలోని అర్ధభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడిలా ప్రఖ్యాతి చెందాడు. తన భార్య పట్ల అమితమైన ప్రేమను చూపించాడు. శక్తిపీఠాల ఉద్భవం వారిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తాయి.
అయితే, శివుడికి వేరొక ప్రేమ వ్యవహారం ఉందన్న విషయం మీరు నమ్ముతారా. తన దారిలో వచ్చిన దేన్నైనా కరిగించే శక్తి అందానికి ఉందన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే, అందానికి దేవుళ్ళు కూడా దాసులేనా? వారిలో కూడా అందానికి బానిసయ్యే బలహీనత ఉందా?
ఈ వ్యాసాన్ని చదివి తెలుసుకోండి.

అసలీ మోహిని ఎవరు. ఆమె ఎలా వచ్చింది?
భస్మాసురుడనే రాక్షసుడు ఎవరి తలపై చేతులు పెడతాడో వారు భస్మం అయిపోతారు. దాంతో, భస్మాసురుడిని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. స్వయంగా భోళాశంకరుడే భస్మాసురుడికి ఈ వరాన్ని అందించాడు. భస్మాసురుడు ఈ వరంతో సాక్షాత్తూ పరమశివుడినే అంతం చేయాలని ప్రయత్నిస్తాడు. అప్పుడే, మహావిష్ణువు మోహినీ అవతారమెత్తి భస్మాసురుడిని వలలో వేసుకుంటాడు. మోహినీ రూపంలోనున్న విష్ణుమూర్తి తన అందానికి బానిసైన భస్మాసురుడి చేత నాట్యం చేయించి అందులో భాగంగా భస్మాసురుడు తన చేతిని తన తలపైనే పెట్టుకునేలా చేసి ఆ రాక్షసుడిని అంతం చేస్తాడు.

Image Source: detechter.com
ఇలా జరిగిన వెంటనే, దేవుళ్లందరూ విష్ణుమూర్తిని అలాగే మోహినీ అందాన్ని స్తుతించడం మొదలుపెడతారు. విష్ణుమూర్తి సహకారానికి సంతోషించిన శివుడు పార్వతితో సహా అక్కడకు విచ్చేసి మరొకసారి మోహిని రూపాన్ని ధరించమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు. మోహినిని చూడగానే ఆమెకు ఆకర్షితుడవుతాడు పరమశివుడు. ఇప్పుడే, ఎవ్వరూ ఊహించనిది చోటుచేసుకుంది.

శివుడిలో రేగిన యాదృచ్చికమైన కోరిక వలన మోహినిని శివుడు వెంటాడి తన కౌగిలిలో బంధించాడు. ఈ సంఘటనను చూస్తున్న పార్వతీదేవి శివుడి ప్రవర్తనకు కలత చెంది సిగ్గుతో తలవంచుకుంది. అలా మోహిని, శివుని కలయికలో మహా సాష్టుడు జన్మిస్తాడు.

ఈ కథలోని ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం పార్వతీ దేవి కళ్ళముందరే జరిగింది. తాను చూసిన దాని గురించి పార్వతిదేవి నమ్మలేకపోయింది. అప్పటి నుంచి తన భర్తను అదుపులో ఉంచేందుకు నియంత్రణ రేఖను గీసింది.

ఈ సంఘటన ద్వారా ప్రేమ అనేది అనంతమని అలాగే శాశ్వతమని తెలుస్తోంది. అలాగే, కామానికి దేవుళ్ళను కూడా దారిమార్చే శక్తి ఉందని అర్థం అవుతోంది.



Click it and Unblock the Notifications











