Latest Updates
-
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.! -
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్!
మోహినితో పరమశివుని ప్రేమవ్యవహారం గురించి పార్వతీ దేవికి తెలుసా? తర్వాత ఏం చేసింది?
పరమశివుడు తన అర్థాంగికి తన శరీరంలోని అర్ధభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడిలా ప్రఖ్యాతి చెందాడు. తన భార్య పట్ల అమితమైన ప్రేమను చూపించాడు. శక్తిపీఠాల ఉద్భవం వారిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తాయి.
అయితే, శివుడికి వేరొక ప్రేమ వ్యవహారం ఉందన్న విషయం మీరు నమ్ముతారా. తన దారిలో వచ్చిన దేన్నైనా కరిగించే శక్తి అందానికి ఉందన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే, అందానికి దేవుళ్ళు కూడా దాసులేనా? వారిలో కూడా అందానికి బానిసయ్యే బలహీనత ఉందా?
ఈ వ్యాసాన్ని చదివి తెలుసుకోండి.

అసలీ మోహిని ఎవరు. ఆమె ఎలా వచ్చింది?
భస్మాసురుడనే రాక్షసుడు ఎవరి తలపై చేతులు పెడతాడో వారు భస్మం అయిపోతారు. దాంతో, భస్మాసురుడిని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. స్వయంగా భోళాశంకరుడే భస్మాసురుడికి ఈ వరాన్ని అందించాడు. భస్మాసురుడు ఈ వరంతో సాక్షాత్తూ పరమశివుడినే అంతం చేయాలని ప్రయత్నిస్తాడు. అప్పుడే, మహావిష్ణువు మోహినీ అవతారమెత్తి భస్మాసురుడిని వలలో వేసుకుంటాడు. మోహినీ రూపంలోనున్న విష్ణుమూర్తి తన అందానికి బానిసైన భస్మాసురుడి చేత నాట్యం చేయించి అందులో భాగంగా భస్మాసురుడు తన చేతిని తన తలపైనే పెట్టుకునేలా చేసి ఆ రాక్షసుడిని అంతం చేస్తాడు.

Image Source: detechter.com
ఇలా జరిగిన వెంటనే, దేవుళ్లందరూ విష్ణుమూర్తిని అలాగే మోహినీ అందాన్ని స్తుతించడం మొదలుపెడతారు. విష్ణుమూర్తి సహకారానికి సంతోషించిన శివుడు పార్వతితో సహా అక్కడకు విచ్చేసి మరొకసారి మోహిని రూపాన్ని ధరించమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు. మోహినిని చూడగానే ఆమెకు ఆకర్షితుడవుతాడు పరమశివుడు. ఇప్పుడే, ఎవ్వరూ ఊహించనిది చోటుచేసుకుంది.

శివుడిలో రేగిన యాదృచ్చికమైన కోరిక వలన మోహినిని శివుడు వెంటాడి తన కౌగిలిలో బంధించాడు. ఈ సంఘటనను చూస్తున్న పార్వతీదేవి శివుడి ప్రవర్తనకు కలత చెంది సిగ్గుతో తలవంచుకుంది. అలా మోహిని, శివుని కలయికలో మహా సాష్టుడు జన్మిస్తాడు.

ఈ కథలోని ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం పార్వతీ దేవి కళ్ళముందరే జరిగింది. తాను చూసిన దాని గురించి పార్వతిదేవి నమ్మలేకపోయింది. అప్పటి నుంచి తన భర్తను అదుపులో ఉంచేందుకు నియంత్రణ రేఖను గీసింది.

ఈ సంఘటన ద్వారా ప్రేమ అనేది అనంతమని అలాగే శాశ్వతమని తెలుస్తోంది. అలాగే, కామానికి దేవుళ్ళను కూడా దారిమార్చే శక్తి ఉందని అర్థం అవుతోంది.



Click it and Unblock the Notifications