Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
మోహినితో పరమశివుని ప్రేమవ్యవహారం గురించి పార్వతీ దేవికి తెలుసా? తర్వాత ఏం చేసింది?
పరమశివుడు తన అర్థాంగికి తన శరీరంలోని అర్ధభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడిలా ప్రఖ్యాతి చెందాడు. తన భార్య పట్ల అమితమైన ప్రేమను చూపించాడు. శక్తిపీఠాల ఉద్భవం వారిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తాయి.
అయితే, శివుడికి వేరొక ప్రేమ వ్యవహారం ఉందన్న విషయం మీరు నమ్ముతారా. తన దారిలో వచ్చిన దేన్నైనా కరిగించే శక్తి అందానికి ఉందన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే, అందానికి దేవుళ్ళు కూడా దాసులేనా? వారిలో కూడా అందానికి బానిసయ్యే బలహీనత ఉందా?
ఈ వ్యాసాన్ని చదివి తెలుసుకోండి.

అసలీ మోహిని ఎవరు. ఆమె ఎలా వచ్చింది?
భస్మాసురుడనే రాక్షసుడు ఎవరి తలపై చేతులు పెడతాడో వారు భస్మం అయిపోతారు. దాంతో, భస్మాసురుడిని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. స్వయంగా భోళాశంకరుడే భస్మాసురుడికి ఈ వరాన్ని అందించాడు. భస్మాసురుడు ఈ వరంతో సాక్షాత్తూ పరమశివుడినే అంతం చేయాలని ప్రయత్నిస్తాడు. అప్పుడే, మహావిష్ణువు మోహినీ అవతారమెత్తి భస్మాసురుడిని వలలో వేసుకుంటాడు. మోహినీ రూపంలోనున్న విష్ణుమూర్తి తన అందానికి బానిసైన భస్మాసురుడి చేత నాట్యం చేయించి అందులో భాగంగా భస్మాసురుడు తన చేతిని తన తలపైనే పెట్టుకునేలా చేసి ఆ రాక్షసుడిని అంతం చేస్తాడు.

Image Source: detechter.com
ఇలా జరిగిన వెంటనే, దేవుళ్లందరూ విష్ణుమూర్తిని అలాగే మోహినీ అందాన్ని స్తుతించడం మొదలుపెడతారు. విష్ణుమూర్తి సహకారానికి సంతోషించిన శివుడు పార్వతితో సహా అక్కడకు విచ్చేసి మరొకసారి మోహిని రూపాన్ని ధరించమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు. మోహినిని చూడగానే ఆమెకు ఆకర్షితుడవుతాడు పరమశివుడు. ఇప్పుడే, ఎవ్వరూ ఊహించనిది చోటుచేసుకుంది.

శివుడిలో రేగిన యాదృచ్చికమైన కోరిక వలన మోహినిని శివుడు వెంటాడి తన కౌగిలిలో బంధించాడు. ఈ సంఘటనను చూస్తున్న పార్వతీదేవి శివుడి ప్రవర్తనకు కలత చెంది సిగ్గుతో తలవంచుకుంది. అలా మోహిని, శివుని కలయికలో మహా సాష్టుడు జన్మిస్తాడు.

ఈ కథలోని ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం పార్వతీ దేవి కళ్ళముందరే జరిగింది. తాను చూసిన దాని గురించి పార్వతిదేవి నమ్మలేకపోయింది. అప్పటి నుంచి తన భర్తను అదుపులో ఉంచేందుకు నియంత్రణ రేఖను గీసింది.

ఈ సంఘటన ద్వారా ప్రేమ అనేది అనంతమని అలాగే శాశ్వతమని తెలుస్తోంది. అలాగే, కామానికి దేవుళ్ళను కూడా దారిమార్చే శక్తి ఉందని అర్థం అవుతోంది.



Click it and Unblock the Notifications