ఓనం 2019, ప్రాముఖ్యత, విశేషాలు మరియు ఓనం వేడుకలను ఎలా జరుపుకుంటారో తెలుసా..

ఈ ఓనం పండుగను ఒకప్పుడు నెలరోజుల పాటు జరుపుకునేవారు. ప్రస్తుతం పది రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. మలయాళీలందరూ కొల్ల వర్షంలో చింగం నెల సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు.

ఓనం కేరళ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన అతిపెద్ద పండుగ. ఈ పండుగలో అన్ని వయసుల వారు ఎంతో ఆనందం, ఉత్సాహంతో పాల్గొంటారు. ఈ ఓనం పండుగ ప్రతి ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలో వస్తుంది. ఈ పండుగను మలయాళం క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు. ఓనం పండుగను కొల్లా వరణం అని కూడా పిలుస్తారు. ఈ ఓనం పండుగను ఒకప్పుడు నెలరోజుల పాటు జరుపుకునేవారు. ప్రస్తుతం పది రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు.

Onam

మలయాళీలందరూ కొల్ల వర్షంలో చింగం నెల సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ కొద్దిరోజుల్లో కేరళ ప్రజలు సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలను ఉత్తమమైన రూపంలోకి తెస్తారు. అందంగా అలంకరించబడిన పుక్కలం, ఆంబ్రోసియల్ ఒనసపడియ, ఉత్తేజకరమైన బోట్ రేస్, అందమైన మరియు సొగసైన నృత్యరూపం - కైకొట్టికాలి-ఓనం యొక్క బెస్ట్ ఫీచర్స్

అడపాయసం ఓనం ప్రత్యేకం..

అడపాయసం ఓనం ప్రత్యేకం..

కేరళ స్వీట్ రెసిపి ఒనకలికల్, అయ్యంకాళి, అటకాళం మొదలైన వాటిలో ఓనం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. వారి ప్రియమైన రాజు మహాబలి తిరిగి వస్తారని నమ్మి కేరళలో ఓనం పండుగను జరుపుకుంటారు. కేరళ ప్రజలు మహాబలిని ఆకట్టుకోవటానికి గొప్ప విజయాన్ని సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అంతకుముందు కేరళ ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు. ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులను వేస్తారు.

ఓనం పండుగ చరిత్ర..

ఓనం పండుగ చరిత్ర..

పురాణాల ప్రకారం.. కేరళను శక్తివంతమైన మహాబలి చక్రవర్తి పాలించారు. ఆయన పరిపాలనలో ఏ ఒక్కరూ అన్యాయానికి గురికాలేదని నమ్ముతారు. ఆయన పాలనలో దాదాపు అందరూ సుసంపన్నం మరియు సుఖ సంతోషాలతో ఉణ్నారు. అందుకే ఆయనను అందరూ గొప్పరాజుగా అభివర్ణిస్తారు. అంతేకాదు అందరికంటే ఎక్కువగా గౌరవించారు. ప్రేమించారు. వారు అంతలా ప్రేమించిన మహాబలి మాత్రం తన ప్రజలను ప్రేమించలేదు. కానీ అక్కడి వారంతా అతన్ని గౌరవించారు. మహాబలికి మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. ఒకటి ఒనతప్పన్, రెండోది మావెలి.

మహాబలి చక్రవర్తి పాలన..

మహాబలి చక్రవర్తి పాలన..

ఈ కథ ప్రకారం కేరళ మహాబలి అనే రాక్షసుడిచే పాలించబడింది. ఒక దయ్యం అయినప్పటికీ అతడు కేవలం అల్పమైనవాడు. అతని దయా గుణంతో ప్రజలందరిచేత ప్రేమించబడ్డాడు. గౌరవింపబడ్డాడు. మహాబలి చక్రవర్తి పాలించినప్పుడు కేరళ కీర్తి ప్రతిష్టలతో పాటు ఎన్నో విజయాలను చూసింది. రాష్ట్రమంతటా పేద, ధనిక అనే తేడాలు లేవు. ఎవ్వరూ కూడా నిరాశగా, విచారంగా లేరు. ప్రతి ఒక్కరూ ఆయన పాలనలో సమానంగా చూడబడ్డారు. ఎవరూ ఏ నేరం, అవినీతి వంటివి చేయలేదు. దొంగతనాలకు సైతం ఆస్కారం లేకుండా ఉండేది. ఎందుకంటే చీకటి పడ్డాక కూడా అందరూ తలుపులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. పేదరికం, వ్యాధులు, కష్టాలు అనేవి ఈ రాజు పాలనలో ప్రజలకు తెలియనే లేదు.

దేవతల కోసం ఛాలెంజ్..

దేవతల కోసం ఛాలెంజ్..

ప్రజలలో మహా బలి చక్రవర్తి చాలా ప్రాచుర్యం పొందాడు. అతని గౌరవించకుండా ఒక్క వ్యక్తి కూడా లేడు. మహా బలి చక్రవర్తి కీర్తి మరియు ప్రజాదరణను చూసి దేవుళ్లు చాలా ఆందోళన చెందారు. వారి ఆధిపత్యం ప్రమాదంలో ఉందని భావించారు. వారి ఆధిపత్యాన్ని చెక్కు చెదరకుండా ఉంచడానికి గొప్పరాజును వదిలించుకోవాలని వారు కోకున్నారు. దీంతో అందరూ కలిసి విష్ణువును ఆశ్రయిస్తారు. దీంతో వామన అవతారంలో విష్ణువు వెళతాడు. అవియల్ కేరళ స్పెషల్ - మనకు కొత్త రుచి విష్ణువు వామనుడి అవతారంలో నిస్సహాయ బ్రాహ్మాణుడిగా మారువేషంలో వెళతాడు. ఈ కథ చాలా మందికి తెలిసిందే. ఆ బ్రాహ్మాణుడు మూడే మూడు అడుగులు కావాలని మహా బలి చక్రవర్తిని అడుగుతాడు. మహా బలి చక్రవర్తి సైతం ఆ బ్రహ్మాణునికి కావాల్సిన భూమిని మంజూరు చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపాడు. అంతే మహా బలి చక్రవర్తి భూమిని మంజూరు చేసిన వెంటనే ఒక అడుగు భూమండలమంతా పెట్టేస్తాడు. రెండో అడుగు ఆకాశమంతటా కవర్ చేస్తాడు. ఇక మూడో అడుగు బలి చక్రవర్తి తల మీద పెట్టి పాతాళంలోకి తొక్కేస్తాడు. అయినా కూడా మహా బలి చక్రవర్తి విష్ణువును చూసినందుకు సంతోషపడ్డాడు. అప్పుడే విష్ణువు ఆ మహా బలి చక్రవర్తికి ఒక వరం ఇచ్చాడు. తన ప్రజలను చూసేందుకు ప్రతి సంవత్సరం తన రాష్ట్రానికి రావడానికి అనుమతి ఇచ్చాడు. ప్రతి సంవత్సరం కేరళను మహా బలి చక్రవర్తి సందర్శించే రోజునే ఓనం పండుగగా జరుపుకుంటారు.

తమ చక్రవర్తిని తలచుకుంటూ..

తమ చక్రవర్తిని తలచుకుంటూ..

మరోవైపు ద్రవిడ రాజులను, రాక్షసులుగా, చిత్రీకరిస్తూ ఆర్యులు అనేక పురాణాలు రాసినట్లు తెలుస్తోంది. పురాణాలు రాయటం మాత్రమే కాదు. ద్రవిడులలో గొప్ప గొప్ప నాయకులను తమ మోసపూరిత విధానాలతో హత్య చేశారు. వారు చేసిన హత్యలను సమర్థించుకోటానికి వారికి దుష్ట స్వభావాలను అంటగట్టారు. అలా హత్య గావింపబడిన రాజుల్లో బలి చక్రవర్తి ఒకరు. అందుకే కేరళ ప్రజలు తరతరాలుగా, యుగయుగాలుగా ఆర్య సిద్ధాంతాన్ని నిరసిస్తూ, తమ చక్రవర్తిని తలచుకుంటూ ఓనం పండుగను జరుపుకుంటారు. ఈ మహాబలి చక్రవర్తి గురించి పూర్తి వివరాలు పురాణాలు సుచింద్రం అనే ఆలయంలో కళాత్మకంగా చిత్రీకరించబడింది. ప్రస్తుతం అది తమిళనాడు రాష్ట్రంలో ఉంది.

Story first published: Tuesday, August 27, 2019, 11:43 [IST]
Desktop Bottom Promotion