Latest Updates
-
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
Pausha Putrada Ekadashi 2021: పుత్రదా ఏకాదశి ఎప్పుడు? ఈరోజున అలాంటి పనులు అస్సలు చేయకూడదు..
పుత్రదా ఏకాదశి ఎప్పుడు? ఈరోజున ఎలాంటి పనులు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు.

ఈ పుష్య పుత్రదా ఏకాదశి ఈ నెల 24వ తేదీన వచ్చింది. దీనిని పవిత్ర ఏకాదశి అని కూడా అంటారు. ఇది జనవరి 23వ తేదీ రాత్రి 8:08 గంటలకు ప్రారంభమవుతుంది.

తిరిగి మరుసటి రోజు అంటే జనవరి 24వ తేదీన పది గంటల 58 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సందర్భంగా ఈ పవిత్రమైన రోజున విష్ణు మూర్తిని ఎలా ఆరాధించాలి.. పుత్రదా ఏకాదశి రోజున ఎలాంటి పనులు అస్సలు చేయకూడదు.. ఈ పవిత్రమైన రోజున పాటించాల్సిన పద్ధతులు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పుత్రదా ఏకాదశి రోజున..
ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. ఆ తర్వాత విష్ణుమూర్తిని పూజించాలి. ఈ సమయంలో లక్ఝ్మీ విగ్రహాన్ని పూజ గదిలో లేదా ఆలయంలో ఉండేలా చూసుకోండి. ఒక ప్రమిదను తీసుకుని అందులో స్వచ్ఛమైన నెయ్యి వేసి ఒక దీపం వెలిగించాలి. పూజ తర్వాత గంగా(నీటిని) జలం తీసుకుని మీ ఆత్మను శుద్ధి చేయండి. ఇక ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రంతా మేల్కొని విష్ణువును కీర్తించండి.
‘ఓం గోవింద, మాధవయ నారాయాణయ నమః' అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూజ ముగిసిన తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టాలి.

బియ్యం వినియోగించకూడదు..
పుష్య ఏకాదశి రోజున బియ్యం వినియోగించకూడదంట. దీని వెనుక ఒక పెద్ద కారణం ఉందట. ఈ పవిత్రమైన రోజున బియ్యం తినడం ద్వారా, మనకు కొంత గందరగోళంగా ఉంటుంది.

కోపాన్ని నివారించాలి..
ఈ పవిత్రమైన రోజున విష్ణువును ఆరాధించడం ఎంత ముఖ్యమో.. అదే విధంగా ఈరోజున కోపం రాకుండా ఉండాలి. ముఖ్యంగా ఎవరితోనూ వాదనకు దిగకూడదు. అలాగే ముఖ్యమైన చర్చలకు దూరంగా ఉండాలి.

బ్రహ్మచార్యం పాటించాలి..
ఈ పవిత్రమైన రోజున ఎవరితోనూ శారీరక సంబంధాలను పెట్టుకోకూడదు. ఈరోజంతా బ్రహ్మచార్యాన్ని అనుసరించాలి. ఏకాదశిన మనస్ఫూర్తిగా విష్ణుదేవుడిని ఆరాధించడం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి.

వీటిని తీసుకోవద్దు..
ఈ పవిత్రమైన రోజున మాంసాహారం, మద్యపానం, పొగతాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సాధారణ ఆహారాన్నే తినాలి, పెరుగన్నం లేదా ఏదైనా శాఖాహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

అమ్మాయిలను అవమానించొద్దు..
పుష్య పుత్రదా ఏకాదశి రోజున ప్రతి ఒక్క అమ్మాయిని మనం గౌరవించాలి. ఈరోజున ఎలాంటి సందర్భాల్లోనైనా మహిళలను అవమానించడం మరియు అగౌరపరచడం వంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా, ఉపవాసాలు ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. అంతేకాదు మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications