Just In
- 35 min ago Kendra Trikon Rajyog 2024 కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ 4 రాశుల వారు ధనవంతులు అవుతారు, లక్ష్మికటాక్షం వీరికే?
- 3 hrs ago Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- 4 hrs ago మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- 5 hrs ago సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
Pitru Paksha 2022: ఈ షరతులపై మాత్రమే, కుమార్తె తన తండ్రి పక్షాన పిండ ప్రదానం చేయొచ్చు, నియమాలేంటో తెలుసుకోండి
Pitru Paksha 2022: ఈ షరతులపై మాత్రమే, కుమార్తె తన తండ్రి పక్షాన పిండ ప్రదానం చేయగలదు, గ్రంథ నియమాలేంటో తెలుసుకోండి..
Pitru Paksha 2022 Shradh: తమ తండ్రికి లేదా తండ్రి వైపు కొడకులు, మగపిల్లలు లేకుంటే కుమార్తెలు కూడా ఈ పరిస్థితులలో పితురులకు(చనిపోయిన వారికి) పిండాన్ని దానం చేయవచ్చు. దీనిపై హిందూ గ్రంధాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
Pitru Paksha 2022 Pinda Daan నియమాలు: సనాతన ధర్మంలో పితృ పక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పితృ పక్షంలో పూర్వీకులు కాకులు లేదా పక్షుల రూపంలో భూమిపైకి వచ్చి తమ బంధువులను కలుస్తారని చెబుతారు. పితృ పక్షం నాడు, కుటుంబం వారి పూర్వీకులను పూర్తి భక్తితో స్మరించుకుంటుంది మరియు వారి పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తుంది మరియు వారు మరణించిన తేదీన తర్పణం, పిండ ప్రదానం మరియు శ్రాద్ధాలను నిర్వహిస్తారు. శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెందుతారని మరియు వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్మకం. ఇలా చేయడం ద్వారా మన పూర్వీకులు లేదా పితురులు సంతోషిస్తారు మరియు వారి వారసులకు ఆనందం మరియు శ్రేయస్సు కలగాలని దీవిస్తారని నమ్మకం.
పితృ పక్షం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ప్రతి సంవత్సరం పితృ పక్షం భాద్రపద మాసం శుక్ల పక్ష పౌర్ణమి నాడు ప్రారంభమై దాదాపు 15 రోజుల తర్వాత అమావాస్యతో ముగుస్తుంది. ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబర్ 10న ప్రారంభమై సెప్టెంబర్ 25న ముగుస్తుంది.
పిండ్ దానం అంటే ఏమిటి?
పూర్వీకుల ఆత్మలకు శాంతి మరియు విముక్తి లభించాలని పిండ ప్రదానంలో దానం-దక్షిణ చేస్తారు. పిండం అనేది అన్నం, బార్లీ పిండి, నల్ల నువ్వులు మరియు నెయ్యితో చేసిన గుండ్రని ఆకారం గల ఆహారం, దీనిని దానం చేస్తారు. దీనినే పిండ ప్రదానం అంటారు. ఈ పిండాలను శ్రాద్ధ సమయంలో పూర్వీకులకు సమర్పిస్తారు. శ్రాధ్ పక్షంలో ఈ దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పిండ్ దాన్లో, దక్షిణం వైపుగా, కుడి భుజంపై దారాన్ని ఉంచి, పూర్వీకులకు భక్తితో ఈ పిండం సమర్పించడాన్ని పిండ్ దాన్ అంటారు.
కుమార్తెలు కూడా పిండ్ దానం చేయవచ్చా?
గ్రంధాల ప్రకారం, ప్రధానంగా ఇంట్లో కొడుకులు లేదా మగపిల్లలు లేదా ఆ ఇంటి వారసలు పూర్వీకులకు పిండదానం చేసే పనిని చేస్తారు, కానీ ఏ ఇంట్లోనైనా కొడుకు లేకపోతే కుమార్తెలు కూడా పిండప్రదానం చేయవచ్చు. గ్రంథ నియమం ఏమిటో తెలుసుకుందాం?
తండ్రి మరణానంతరం ఆత్మశాంతి కోసం, బంధన బంధాల నుండి విముక్తి కోసం, కొడుకులు లేదా మనుమలు మొదలైన వారిచే పిండదానం మరియు తర్పణం చేయాలని గ్రంధాలలో చెప్పబడింది. పిండదానం, తర్పణం మరియు శ్రద్ధ లేకుండా పూర్వీకుల ఆత్మకు మోక్షం లభించదని మత విశ్వాసం. పిండదానాన్ని పుత్రులు చేస్తే తప్ప, పూర్వీకుల ఋణం నుండి విముక్తి పొందలేరని హిందూ మతం నమ్ముతుంది. హిందూమతంలో, పిండ్ దాన్ మరియు తర్పణం యొక్క పని కొడుకుల విధిగా పరిగణించబడుతుంది, అయితే కుమారులు లేని వారు, వారి కుమార్తెలు కూడా పిండ్ దాన్ మరియు తర్పణం చేయవచ్చు.
పిండ ప్రధాన పద్ధతి
పిండ్ దాన్ లేదా శ్రాధ్ధం తెల్లని బట్టలు ధరించి చేయాలి. అన్నం, పచ్చి దూది, పూలు, గంధం, స్వీట్లు, పండ్లు, అగరుబత్తీలు, నువ్వులు, బార్లీ మరియు పెరుగుతో బార్లీ పిండి లేదా కోవాతో పిండంని తయారు చేసి పూజించండి. పిండదానం చేసిన తరువాత, పితృదేవతలను పూజించాలి. దీని తరువాత, నదిలో స్నానం చేయాలి. శ్రాద్ధాన్ని మధ్యాహ్నం పూట మాత్రమే చేయడం ఉత్తమం.