Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
Ramakrishna Jayanti 2022:రామక్రిష్ణ జయంతి ఎప్పుడు? వివేకానందుని గురువు గురించి ఈ విషయాలు తెలుసా...
రామక్రిష్ణ జయంతి వార్షికోత్సవం మార్చి 4వ తేదీ సందర్భంగా రామక్రిష్ణ పరమహంస ప్రాముఖ్యత, విశిష్టత గురించి తెలుసుకుందాం.
భారతదేశంలోని గొప్ప గురువులలో రామక్రిష్ణ పరమహంస ఒకరు. ఈయన 19వ శతాబ్దంలో జీవించారు. అంతేకాదు ఈయన స్వామి వివేకానందకు గురువు కూడా. ఈయన ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు.

రామక్రిష్ణ పరమహంస ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షంలో రెండో రోజున జన్మించారు. 2022 సంవత్సరంలో మార్చి 4వ తేదీన అంటే శుక్రవారం నాడు రామక్రిష్ణ పరమహంస జయంతి వచ్చింది. గొప్ప ఆధ్యాత్మిక గురువు అయిన రామక్రిష్ణ జయంతిని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. 186వ జయంతి సందర్భంగా వివేకానందుని గురువు రామక్రిష్ణ పరమహంస గురించి కొన్ని ఆసక్తిరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రామక్రిష్ణ జననం..
రామక్రిష్ణ పరమహంస 1836వ సంవత్సరంలో ఫిబ్రవరి 18వ తేదీన హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే చారిత్రక రికార్డుల ప్రకారం, రామక్రిష్ణ పరమహంస హిందూ మాసంలో ఫాల్గుణంలో శుక్ల పక్షం ద్వితీయ రోజున జన్మించాడు. ఈ సంవత్సరం 2022లో మార్చి 4వ తేదీన వస్తుంది. శుక్ల పక్షం ద్వితీయ తిథి 3 మార్చి 2022న రాత్రి 9:36 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 4వ తేదీ మార్చి 2022న రాత్రి 8:45 గంటలకు ముగుస్తుంది.

రామక్రిష్ణ జయంతి చరిత్ర..
* రామక్రిష్ణ పరమహంస పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
* ఆయన జన్మకు సంబంధించి కొన్ని విషయాలు ప్రాచుర్యం పొందాయి. అందులో ఒకటి విష్ణువు తన తండ్రికి కలలో కనిపించి కొడుకుగా పుట్టమని చెప్పాడు. అందుకే తనకు గదాధరుడనే పేరు వచ్చింది. ఆయన తల్లి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

కాళీ మాత భక్తుడిగా..
* ఈయన కాళీ దేవి భక్తుడు. పశ్చిమ బెంగాల్ లోని ప్రసిద్ధ దక్షిణేశ్వర్ కాళీ దేవాలయానికి పూజారిగా పని చేశారు.
* తన సోదరుడు మరణించిన తర్వాత రామక్రిష్ణుడు కాళీ దేవిపై విశ్వాసం మరింత పెంచుకున్నాడు.
* కాళీ దేవిని తన తల్లిగా విశ్వసించేందుకు అనేక సందర్భాలు ఆయనను ప్రభావితం చేశాయి.
* శారద దేవికి కేవలం ఐదేళ్ల వయసులోనే తనకు వివాహం జరిగింది. 17 సంవత్సరాల తర్వాత ఆమె కోల్ కతాలో తనతో పాటు ఆశ్రమంలో చేరింది.
* రామక్రిష్ణుడు శారదా దేవిని కాళీ మాత అవతారంగా భావించి ‘శ్రీ మా'గా పరిచయం చేశాడు.
* ఆయన తన శిష్యులకు నిజమైన భగవంతుని విశ్వాసం ఉంచాలని మరియు మూఢనమ్మకాలన్నింటినీ విస్మరించాలని బోధించాడు.

రామక్రిష్ణ పరమహంస సందేశాలు..
* ‘‘ భక్తి కోసం భగవంతుని ప్రార్థించినట్లే, మీరు ఎవరిలోనూ తప్పులు కనుగొనకుండా ప్రార్థించాలి''
* ‘‘ అవసరమైనప్పుడు భగవంతుడే మనకు ఇతర విషయాలను ఇతర మార్గాలను వివరించును''
* ‘‘ఎదుగుదల కనపడటం లేదనే చింతన వద్దు.. మహా వృక్షమైనా సరే మౌనంగానే ఎదుగుతుంది.. నీ ప్రయత్నం నీవు చేయి.. ఫలితం మాత్రం భగవంతువునికి వదిలేయ్''
* ‘‘ఎవరికి సహాయం చేసినా నేను నిమిత్తమాత్రుడిని, ఈ మంచి పని భగవంతుడు నా చేత చేయిస్తున్నాడనే తలంపుతో చేయి''
* ‘‘అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే, మనలోనూ మంచి పెరుగుతుంది''
* ‘‘నిజాలను మాట్లాడండి.. మాట్లాడే ముందు ఆలోచించండి.. ఆ తర్వాత లిఖించండి''
* ‘‘ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు.. అలాగే సేవ అలవరచుకో.. పెత్తనం కాదు''
రామక్రిష్ణ పరమహంస ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షంలో రెండో రోజున జన్మించారు. 2022 సంవత్సరంలో మార్చి 4వ తేదీన అంటే శుక్రవారం నాడు రామక్రిష్ణ పరమహంస జయంతి వచ్చింది. గొప్ప ఆధ్యాత్మిక గురువు అయిన రామక్రిష్ణ జయంతిని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. 186వ జయంతి సందర్భంగా వివేకానందుని గురువు రామక్రిష్ణ పరమహంస గురించి కొన్ని ఆసక్తిరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...



Click it and Unblock the Notifications