Just In
- 11 hrs ago
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- 13 hrs ago
ఆదివారం దినఫలాలు : ఓ రాశి వారికి ఆన్ లైన్ బిజినెస్ లో కలిసొస్తుంది...!
- 22 hrs ago
లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఈ ఘోరమైన క్యాన్సర్ గురించి మీకు తెలుసా?
- 24 hrs ago
మార్చి మాసంలో మహా శివరాత్రి, హోలీతో పాటు వచ్చే ముఖ్యమైన పండుగలు, శుభముహుర్తాలివే...
Don't Miss
- News
రాహుల్ భయ్యా! మీరు వెకేషన్లో ఉన్నారు: ‘మత్స్యశాఖ’ కామెంట్లపై అమిత్ షా సెటైర్లు
- Sports
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరితే.. ఆసియాకప్ వాయిదా తప్పదు!
- Movies
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Ratha Saptami 2021 :రథసప్తమి నాడు స్నానం చేసే వేళ ఈ శ్లోకాలను పఠిస్తే సమస్త పాపాలు నశిస్తాయి...!
మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే.. అందులో తొలి స్థానం సూర్యభగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయన్ను 'ప్రత్యక్ష నారాయణుడు' అని సంభోదిస్తుంటారు.
హిందూ పురాణాలు, పంచాంగం ప్రకారం, మాఘ మాసంలోని శుద్ధ సప్తమి నాడు వేయి కిరణాలు గల సూర్యభగవానుడు జన్మించాడని.. ఆరోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆరోజు రథసప్తమిగా భారతీయులంతా భావిస్తారు. సకల జీవకోటి రాశులందరికీ వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈరోజేనని నమ్ముతారు.
అలాంటి రథసప్తమి 2021 సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన వచ్చింది. ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున కొన్ని పనులు చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాదు.. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. కాబట్టి రథసప్తమి ముందు రోజు అంటే గురువారం నాడు రాత్రి ఉపవాసం ఉండి శుక్రవారం రోజున ఉదయం అనగా సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి.
ఇలా చేసే సమయంలో కొన్ని మంత్రాలను జపిస్తూ స్నానం చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఆ ముఖ్యమైన మంత్రాలేవి.. సూర్యోదయానికి ముందు స్నానం చేసేటప్పుడు ఏయే పనులు చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
రథ సప్తమి 2021 : ఈరోజున ఇలా చేస్తే ఏడు జన్మల పాపం పోతుందట...!

ఇలా చేయాలి..
రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందు తలస్నానం చేయాలి. అలా చేయడానికి ముందు మగవారు ఏడు జిల్లేడు ఆకులు, మహిళలు ఏడు చిక్కుడు ఆకులు తల, భుజాలపై ఉంచుకుని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి.

ఈ మంత్రం చదువుతూ..
‘జననీ త్వం హి లోకానం
సప్తమీ సప్తసప్తికే, సప్తవ్యాహృతికే దేవి!
సమస్తే సూర్యమాతృకే'
‘సప్తాశ్యముల గల ఓ సప్తమీ!
నీవు సకల లోకాలకు, భూతాలకు, జననివి.
సూర్యుడికి తల్లివైన నీకు వందనాలు' అని ఈ మంత్రం యొక్క అర్థం.

ఏడు జన్మల పాపం..
రథ సప్తమి రోజున ఇలా జిల్లేడు, చిక్కుడు ఆకులను తల, భుజాలపై ఉంచుకుని స్నానం చేస్తూ.. అదే సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తూ తలస్నానం చేయడం వల్ల మీకు ఏడు జన్మల నుండి వస్తున్న పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
Ratha Saptami 2021 :రథసప్తమి రోజున ఈ మంత్రాలతో సూర్యుడిని ఆరాధిస్తే..ఎన్ని శుభఫలితాలో తెలుసా...

మరో మంత్రం..
యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు
తస్య రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్ఛ జనమంతరార్జితం మనోవాక్కాయజం యచ్ఛ జ్ఞాతాజ్ఞాతేచ యే పున:
సప్త విధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి

ఎర్రని పువ్వులతో..
రథసప్తమి రోజున మంత్రాలు చదువుతూ స్నానం చేసిన తర్వాత ఎర్రని రంగులో ఉండే పువ్వులతో సూర్యభగవానుడికి ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. సూర్యదేవుని చిత్రపటానికి ఎర్రని కుంకుమ, గంధంతో పూజలు చేయాలి. అలాగే ఆవు నేతితో చేసిన దీపాన్ని వెలిగించాలి.

సూర్యుడిని పూజిస్తే..
రథసప్తమి రోజున ఆదిత్యుడిని ఇలా పూజించడం వల్ల అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయని చాలా మంది నమ్మకం. అంతేకాదు ఈరోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. మీకు చర్మ రోగాల నుండి విముక్తి లభిస్తుంది. పురాణాల ప్రకారం, శ్రీరాములు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించి రావణ వథకు బయలుదేరారట. సూర్యునికి ఇష్టమైన ఈ పండుగ రోజున ఈ మంత్రాలను పటించి. సూర్యుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు రానున్నాయి.