Just In
- 12 hrs ago
మామిడి పండ్లను తిన్న వెంటనే ఇవి తినడం శరీరానికి ప్రమాదకరం; వీటిని అస్సలు తినకండి
- 13 hrs ago
18 సంవత్సరాల తరువాత, ఐదు గ్రహాలు సరళ రేఖలో కనిపిస్తాయి, ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు మిస్ చేయకుండా చూడండి
- 15 hrs ago
మీకు చాలా జుట్టు ఊడుతుందా? ఐతే ఈ ఆకులను వాడండి...తిరిగి జుట్టు పెరుగుతుంది!
- 17 hrs ago
పంటి నొప్పిని త్వరగా తగ్గించుకోవడానికి ఉల్లిపాయ ముక్క
Don't Miss
- News
ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ: జర్మనీలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- Travel
విజయవాడ టు కొండపల్లి.. ప్రయాణపు ముచ్చట్లు! రెండవ భాగం
- Sports
Rain Stopped Ind vs Ire 1st T20: ఈ ఐర్లాండ్ వెదర్ ఉందే.. ఎప్పుడు ఎలా ఉంటదో ఎవడికీ తెలీదు.. నెటిజన్లు ఫైర్
- Finance
భారీగా పతనమైన క్రిప్టో మార్కెట్, 27% ఉద్యోగుల్ని తొలగించిన ఈ ఎక్స్చేంజ్
- Movies
మెగాస్టార్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్.. తమిళ నటుడు హ్యాండ్ ఇవ్వడంతో?
- Technology
Noise నుంచి బడ్జెట్ ధరలో సరికొత్త వైర్లెస్ ఇయర్ఫోన్స్ విడుదల!
- Automobiles
వరుణ్ ధావన్ గ్యారేజిలో చేరిన మరో కొత్త లగ్జరీ కార్.. ఇదే: మీరూ చూడండి
Shani Amavasya Upay 2022 :శని అమావాస్య రోజున ఇలా చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట...!
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి క్రిష్ణ పక్షం చివరి తేదీ రోజున అమవాస్య వస్తుంది. అమావాస్య రోజున జాబిల్లి ఆకాశంలో కనిపించకుండా పూర్తిగా మాయమవుతాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం శనివారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. 2022లో ఏప్రిల్ 30వ తేదీన వైశాఖ అమావాస్య వచ్చింది.
దీనినే శని అమావాస్య అని కూడా అంటారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శని దేవుని అనుగ్రహం పొందడానికి ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ శని అమావాస్య రోజునే సూర్య గ్రహణం, త్రిగ్రాహి కలయిక వంటి అరుదైన సంఘటనలు జరగనున్నాయి.
ఇదిలా ఉండగా.. హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ బహుళ అమావాస్య 2022 సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీన అంటే శనివారం నాడు అర్ధరాత్రి 12:57 గంటలకు ప్రారంభమవుతుంది. హిందూ పురాణాల ప్రకారం, ఆరోజు నుండే వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30వ తేదీ అర్థరాత్రి 1:57 గంటలకు పూర్తవుతుంది. ఈ సందర్భంగా శని అమావాస్య రోజున ఏర్పడే త్రిగ్రాహి యోగ ప్రభావం మనపై ఎలా ఉంటుంది. ఈ సమయంలో మనం శని దేవుని అనుగ్రహం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Shani
Amavasya
2022
:శని
దోష
నివారణకు
ఈ
పరిహారాలు
పాటించండి...

త్రిగ్రాహి కలయిక..
ఈ ఏడాది శని అమావాస్య సూర్య గ్రహణం రోజున అరుదైన సంఘటనలు ఏర్పడనున్నాయి. ఏప్రిల్ 30న ఏర్పడే సూర్య గ్రహణ ప్రభావం మన దేశంపై అంతగా ఉండదు. ఇది పాక్షిక గ్రహణం కాబట్టి సూతక కాలం కూడా చెల్లదు. అదే విధంగా ఈ శని అమావాస్య రోజున మేషరాశిలో సూర్యుడు, చంద్రుడు, రాహువు కలయిక వల్ల తిగ్రాహి కలయిక ఏర్పడుతుంది. ఇది చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుందని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు.

శని అనుగ్రహం కోసం..
* శని అమావాస్య రోజున శని దేవుని అనుగ్రహం కోసం ఆవాల నూనె, నల్ల నువ్వులు, నీలి రంగు పువ్వులు సమర్పించాలి.
* శని దోషం నుండి విముక్తి పొందడానికి, శని ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి శని అమావాస్య రోజున శని దేవుని మంత్రాలను పఠించాలి.
*పేదలకు ఆహారం అందించడం, మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయడం వల్ల శని దేవుని అనుగ్రహం పొందొచ్చు.

శని ఆరాధనతో..
* శని అమావాస్య రోజున శని దేవుని ఆరాధించడం వల్ల వ్యాపారులకు వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు ఉన్నత స్థానం లభిస్తుంది.
* శని అమావాస్య రోజున కుటుంబ సభ్యులందరూ ఆవనూనెతో దీపారాధన చేసి, హనుమాన్ చాలీసా పఠించాలి.
* ఇలా చేయడం వల్ల అన్ని ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు
Shani
Amavasya
2022:
శని
అమావాస్య
ఎప్పుడు?
పూజా
విధానాలేంటో
చూడండి...

పూర్వీకుల బాధ..
వైశాఖ మాసంలోని శని అమావాస్య రోజున ఉపవాసం ఉంటే.. అనేక ప్రయోజనాలు చేకూరతాయని చాలా మంది నమ్మకం. ఈరోజున ఉపవాసం ఉంటే.. మన పూర్వీకుల బాధలను తీర్చడమే కాక.. రాహువు బలహీనత మరియు ఇతర సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు. అలాగే శని దేవుని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతారు.

ఆవ నూనెతో స్వీట్లను..
శని అమావాస్య రోజున శని మంత్రాన్ని 5, 7, 11 లేదా 21 సార్లు జపించండి మరియు శని చాలీసాను కచ్చితంగా పఠించాలి. చివరగా శని దేవునికి హారతి ఇవ్వడం మరచిపోవద్దు. ఈ పవిత్రమైన రోజున ఆవనూనెతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి.

దాన ధర్మాలు..
శని అమావాస్య రోజున నల్ల నువ్వులు, నల్ల ఉసిరి, నల్లని గుడ్డలు, ఏదైనా ఇనుము వస్తువులు మరియు ఆవనూనె మొదలైన వాటిని అవసరాన్ని బట్టి లేదా పేదవారికి దానం చేయాలి. అనంతరం శని స్తోత్రాన్ని మూడుసార్లు పఠించండి. ఇలా చేయడం వల్ల మీకు శని మహాదశ బాధలు తగ్గడంతో పాటు శని దేవుని అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ బహుళ అమావాస్య 2022 సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీన అంటే శనివారం నాడు అర్ధరాత్రి 12:57 గంటలకు ప్రారంభమవుతుంది. హిందూ పురాణాల ప్రకారం, ఆరోజు నుండే వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30వ తేదీ అర్థరాత్రి 1:57 గంటలకు పూర్తవుతుంది. ఈరోజున దేవుళ్లకు పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జీవితంలో సుఖ సంతోషాలొస్తాయని భక్తుల విశ్వాసం.