Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
నవరాత్రి స్పెషల్ : ఎట్టిపరిస్థితిలో చేయకూడని, చేయదగ్గవి
దసరా లేదా నవరాత్రి ఉత్సవాలు ఇండియాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ పర్వదినాల్లో షాకం, మోక్షం మరియ విముక్తి సాధనకై దుర్గాదేవిని ఎక్కువగా పూజిస్తుంటారు.
హిందూ పురాణాల ప్రకారం 6 సీజన్ల లేదా బుతువులు. ప్రతి బుతువు ఒక స్త్రీ యొక్క రూపం. అందుకే కాలానికి చాలా గొప్ప ప్రాముఖ్యత మరియు శుభప్రదమైన భావనను కలిగి ఉంది.
ప్రతి సీజన్లో ఒక నిర్ధిష్టమైన నవరాత్రి ఉంటుంది. 6శాస్త్ర్రాలలో నాలుగింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ నాలుగింటిలో రెండింటిని మాత్రం విస్తృతంగా అనుసరించబడ్డాయి. ఈ రెండింటి మద్యలో కూడా, శరద్ నవరాత్రిని ఎక్కువగా అనుసరిస్తుంటారు. శరద్ నవరాత్రికి చేసే పూజలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇండియాలో శరద్ నవరాత్రిని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో దేవీ దుర్గా మాతను ఎక్కువగా కొలుస్తూ , పూజిస్తూ ఆమె క్రుపక దీవెనలు పొందడానికి పూజలు చేస్తార.
వేసవి మరియు శీతాకాలం మద్యవచ్చే ఈ సమయం చాలా కీలకమైనది. కనుక మదర్ నేచర్ చాలా ప్రత్యేకపమైనది. ఈ సమయంలో ప్రకృతిలో వివిధ రకాల మార్పూలను తీసుకొస్తుంది. మార్పులను సూచిస్తుంది.

అందువల్ల ఈ సీజన్ లో ఆరోగ్యంగా జీవించడానికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో దుర్గా మాతకు జరిపే పూజలు కూడా మనలో వ్యాధినిరోధకత శక్తిని పెంచేవిధంగా సహాయపడతుంది.
అందువల్ల ఈ సీజన్ లో శాస్త్రీయంగా మరియు ఆధ్యాత్మికంగా కొన్ని ప్రత్యేకమైన నియమాలను అనుసరించాల్సి ఉంటుంది. అప్పుడే ఆరోగ్యంగా మరియు ఆనందంగా జీవించగలుగుతారు. దేవీ దుర్గా మాత కూడా ఆరోగ్యంగా, జీవించడానికి ఆశీర్వాదం అందిస్తుంది. దుర్గా మాతకు ప్రత్యేక పూజలు, వైష్ణోదేవీకి ప్రత్యేకమైన పూజలు, అష్టమి రోజున ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి ప్రత్యేకమైన పూజలు జరుపుకుంటారు.
ఈ నవరాత్రులు, దుర్గా దేవీ పూజ సమయంలో కొన్ని ప్ర్యతేకమైన నియమాలన పాటించాలి. అలాగే కొన్ని విషయాల్లో ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఈ నియమాలను కనుక పాటించకపోతే నెగటి ఎఫెక్ట్ కలుగుతుంది. అయితే ఈ సమయంలో ఏవి పాటించాలి, ఏవి పాటించకూడదు అని తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని తప్పక చదవాలి..

చేయాల్సినవి: ఫాస్టింగ్ రూల్స్ నవరాత్రి 217
1. రోజూ ఉదయం 9 లోపు స్నానాలు ఆచరించాలి.
2. శాఖాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అది కూడా రోజుక ఒక్క పూట మాత్రమేజ
3. ఇంట్లో తయారుచేసిన ఫలహారాన్ని దేవుడికి నైవేద్యంగా రోజూ సమర్పించాలి. అవసరం అయితే పాలు, పండ్లు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు.
4. రోజూ దుర్గా మాత గుడికి వెళ్లాలి. అలాగే ఉదయం , సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగించాలి. పువ్వులతో దుర్గా మాతను అలంకరించాలి. రోజూ హారతి ఇవ్వాలి.
5. కనీసం 2 చిన్నపిల్లలకు ముఖ్యంగా అమ్మాయిలకు రోజూ సాయంత్రంలోపు ఏదైన బహుమతిని ఇవ్వాలి.
6. రోజూ స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు, ఫ్రెష్ గా ఉన్నవి మాత్రమే ధరించాలి. పాతవి ఎట్టి పరిస్థితిలో వేసుకోకూడదు.
7. నవరాత్రుల్లో రోజూ సమయం ఉన్పప్పుడల్లా దేవీ మంత్రాలు, స్త్రోత్రాలు పఠించాలి.
8. గత జన్మ పాపాలను తొలగించి , జీతితంలో ఆనందం, శ్రేయస్సుని అందవ్వమని వేడుకోవాలి.

ఖచ్చితంగా చేయకూడనవి:
1. ఏకాదశి వరకూ గోళ్ళు కట్ చేయకూడదు.
2. ఈ నవరాత్రుల్లో హెయిర్ కట్ కానీ, గుడ్డు చేయించుకోవడం కానీ చేయకూడుదు.
3. ఈ నవరాత్రి సమయంలో చిరిగిన బట్టలు కుట్టడం లేదా కట్ చేయడం వంటివి చేయకూడదు.
4. చాడీలు చెప్పుకోవడం, అబద్దాలడట లేదా చెడుగా మాట్లాడటం లేదా ఇతరు మీద కోప్పడటం వంటి చర్యలు చేయకూడదు.
5. ఇంట్లో 9 రోజులు వెలిగే అఖండ జోతి ఆరిపోకుండా చూసుకోవాలి. పూజ చేసిన తర్వాత కొన్ని పువ్వులను దేవుడికి, అగ్నికి సమర్పించాలి.
6. ఇంట్లో దుమ్ము, ధూలి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పూజగది, వంటగది రోజూ శుభ్రంగా ఉంచుకోవాలి.
7. ఎట్టి పరిస్థితిలో ఇంట్లో ముఖ్యంగా పూజగది, వంటగదిలో చెప్పులు వేసుకోకుండా ఉండాలి.
8. 9వరోజు ఏం చదవకూడదు, దేవీ దుర్గా మాత ముందు పుస్తకాలు, గ్యాడ్జెట్స్ మరియు ఇతర వస్తువులను ఉంచి పూజించాలి. తర్వాత విజయదశమి రోజున వాటిని తీసి అమ్మముందు కూర్చొని చదువుకోవాలి.

ఈ సింపుల్ నియమాలను అనుసరించినట్లైతే తప్పకుండా అమ్మదుర్గాదేవీ అనుగ్రహం పొందుతారు. దుర్గ సప్తశతి లేదా దేవి మహాత్మియాం పరాయనం ఏ రోజున అయినా చేయటం వల్ల మీ జీవితంలో మంచి పురోగతి, శ్రేయస్సు మరియు విజయాన్ని పొందవచ్చు. మీరు ఏ కారణం వల్లనైనా నియమాలను అనుసరించి చేయలేక పోతే, 9 రోజులలో దేవ దుర్గ సప్తశతి పరాయణము మీ పేరుతో చేసిన ప్రార్థించటం వల్ల మంచి ఆనందం మరియు పురోగతిని పొందుతారు.



Click it and Unblock the Notifications











