లాక్ డౌన్ ఎఫెక్ట్ : కరోనా వల్ల మరికొన్ని రోజులు కోవెలలో దైవ దర్శనాలు లేనట్టే...!

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలోని అన్ని దేవాలయాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ దాదాపు మూతపడ్డాయి.

మన దేశంలో ఏ దేవాలయం అయినా కేవలం గ్రహణం సమయంలో మూసివేస్తుంటారు. అంతే తప్ప ఎలాంటి విపత్కర సమయాల్లో అయినా తెరిచే ఉంచుతారు. భక్తులందరినీ అనుమతించి ఆలయంలో అన్ని రకాల పూజలు నిర్వహిస్తుంటారు. అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలోని అన్ని దేవాలయాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ దాదాపు మూతపడ్డాయి.

Tirupati Temple will be closed until april 30th due to lockdown extension

కరోనా వైరస్ ప్రభావంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుమల వెంకన్న ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జున ఆలయంతో పాటు అనేక దేవాలయాలన్నీ భక్తులు లేక నిర్మానుష్యంగా మారిపోయాయి.

Tirupati Temple will be closed until april 30th due to lockdown extension

పురాణాలు, గ్రంథాల ప్రకారం బ్రహ్మం గారు ఒక నాలుగు రోజులు శ్రీవారి ఆలయం మూతపడుతుందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అంతకన్నా ఎక్కువ రోజులే భక్తులందరికీ శ్రీవారి దర్శనాలు దక్కడం లేదు.

Tirupati Temple will be closed until april 30th due to lockdown extension

ఈ కరోనా వైరస్ ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో.. తమకు దైవ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందోనని యాత్రికులు ఎంతో ఆశగా నిర్వహిస్తున్నారు.

తొలిసారిగా భక్తులు లేకుండా..

తొలిసారిగా భక్తులు లేకుండా..

కరోనా వైరస్ దెబ్బకు దేశంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులు లేకుండా బోసిపోతున్నాయి. భక్తుల సమక్షంలో జరగాల్సిన పూజలు, మంగళహారతులు, అర్జిత సేవలు అన్నింటికీ బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం కొందరు ప్రధాన అర్చకులు మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు.

ఉగాది పండుగను కూడా

ఉగాది పండుగను కూడా

తిరుమలలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్త సందోహం మధ్య జరిగే ఉగాది వేడుకలు కాస్త ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు కేవలం పూజారులు, కొందరు అధికారుల సమక్షంలో మాత్రమే జరిగింది.

శ్రీరామ నవమిని ఏకాంతంగానే..

శ్రీరామ నవమిని ఏకాంతంగానే..

ఇటీవల శ్రీరామ నవమి పండుగను సైతం తిరుమల, కడప జిల్లా ఒంటిమిట్టలో భక్తులను ఆంక్షలు ఉండటంతో పూజారులందరూ కలిసి శ్రీరామ నవమి వేడుకలను ఏకాంతంగానే నిర్వహించారు. భద్రాచలంలో అతి కొద్ది మంది భక్తులను అనుమతించినప్పటికీ సాదాసీదాగానే వేడుకలు జరిగాయి.

తిరుపతి సమీప గ్రామాల్లో..

తిరుపతి సమీప గ్రామాల్లో..

తిరుమలలో భక్తులను అనుమతించని అధికారులు, అక్కడి భోజన కేంద్రంలో ఆహారాన్ని తయారు చేసి ప్యాకెట్ల రూపంలో తిరుపతి సమీప గ్రామాలకు సరఫరా చేస్తున్నారు.

ముందు జాగ్రత్త చర్యగా..

ముందు జాగ్రత్త చర్యగా..

సాధారణంగా దేవాలయాలను గ్రహణ సమయాల్లోనే మూసివేస్తారు. అయితే మన దేశ చరిత్రలో ఇన్నిరోజులు ఆలయాలను మూసివేయటం ఇదే తొలిసారి. అయితే కరోనా వైరస్ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా దేవాలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు.

నిర్మానుష్యంగా ఆలయ ప్రాంగణాలు..

నిర్మానుష్యంగా ఆలయ ప్రాంగణాలు..

కరోనా వైరస్ వల్ల భక్తులను దేవాలయ దర్శనాలకు అనుమతించకపోవడంతో ఆలయ ప్రాంగణాలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో ఆలయాల సన్నిధిలో అంతా ప్రశాంతత కనిపిస్తోంది.

జంతువుల హడావుడి..

జంతువుల హడావుడి..

ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే తిరుమల ఘాట్ రోడ్ లో, నడక దారిలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉండటంతో జింకలు, పులులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇంకా కొన్ని జంతువులు కూడా రోడ్ల మీదే సేద తీరుతున్నాయి.

Story first published: Tuesday, April 14, 2020, 14:44 [IST]
Desktop Bottom Promotion