Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఇదేమిటిది, బ్రహ్మచారియైన దేవదేవుడు గణపతికి ఇరువురు భార్యలా?
కొన్ని హిందూ మతం సంస్కృతుల్లో, హిందూ మత దేవుడు అయిన వినాయకుడుని బ్రహ్మచారిగా పరిగణిస్తున్నారు. కానీ కొన్ని సంస్కృతులలో అయన వివాహం చేసుకున్నారని చెప్పుతారు. హిందూ మత దేవుడు అయిన వినాయకుడుకి సిద్ది మరియు రిద్ది అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. వినాయకుడు పెళ్లి ఎలా చేసుకున్నాడో చెప్పటానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటంటే...

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
1. శివ మరియు పార్వతులు వారి కుమారుడు వినాయకుడు చేసే సేవలకు చాలా సంతోషంగా ఉన్నారు. తారకాసురుడు నాశనం అయ్యాక,వారికీ రెండోవ కుమారుడు జన్మించెను. అతనికి కార్తికేయ అని పేరు పెట్టెను. అతను బ్రాహ్మణ జ్ఞానంతో తన భక్తులకు దీవించుట వలన మొత్తం విశ్వం అంతా'సుబ్రహ్మణ్య' అనే పేరుతో ఆయనకు పూజలు చేస్తున్నారు.

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
2. యూనివర్సల్ తల్లిదండ్రులు అయిన శివ మరియు పార్వతులు వారి ఇద్దరు కుమారులు అయిన వినాయకుడు మరియు సుబ్రమణ్యలకు వివాహ ఆలోచన చేసారు. వారి వివాహం కోసం సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు.

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
3. వారి తల్లిదండ్రులు వారి వివాహం గురించి నిర్ణయం వెల్లడి చేసినప్పుడు, ఇద్దరు కుమారులు పోట్లాడుకోవటం ఆరంభించారు. వినాయకుడు యొక్క వివాహ మొదటి కథను తెలుసుకుందాం.

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
4. వారిని తృప్తి పరిచేందుకు,శివ మరియు పార్వతులు,ఒక ప్రణాళికను రూపొందించారు. వారిని దగ్గరికి పిలిచి మాట్లాడారు. మీరు మంచి కుమారులు. అలాగే మేమిద్దరం మీ ఇద్దరికి సమానంగా ప్రేమను పంచామని తెలిపెను.

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
5. మీ వైరం పరిష్కరించడానికి,మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ ఇద్దరి మధ్య ఒక పోటి పెడుతున్నాం. మీ ఇద్దరిలో ఎవరు మొదట భూమి చుట్టూ తిరిగి వస్తారో వారికి మొదట వివాహం అవుతుందని చెప్పెను.

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
6. ఈ మాటలను విన్న, లార్డ్ సుబ్రమణ్య వెంటనే త్వరగా భూమి చుట్టూ వినాయకుడు కంటే ముందుగా తిరిగి రావాలని గొప్ప వేగంతో తన నెమలితో బయలుదేరేను. లార్డ్ గణేశ ఎటువంటి సన్నాహాలు లేకుండా లార్డ్ శివ మరియు శక్తి పార్వతి సమీపంలోనే ఉండెను.

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
7. దానికి బదులుగా,వారి తల్లితండ్రులను కూర్చోమని చెప్పి, తన ఆరాధనా సేవను అంగీకరించమని ప్రార్ధించేను. శివ మరియు శక్తి తక్షణమే దానికి అంగీకరించి తమ స్థానంలో కుర్చోనేను.

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
8. గణేశ గొప్ప భక్తి తో వారిద్దరికి పూజ చేసి ఏడు సార్లు ప్రదక్షణ చేసి ఏడు సార్లు నమస్కారం చేసెను. లార్డ్ సుబ్రమణ్య మొత్తం భూమి చుట్టూ తన ప్రయాణంను పూర్తి చేసి వచ్చెను. అతను ఏడో వందనం పూర్తి చేసెను.

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
9. లార్డ్ సుబ్రహ్మణ్య తాను భూమి చుట్టూ తిరిగి మొదట వచ్చాను. కాబట్టి మీ ఆదేశం మేరకు మొదట నా వివాహం చేయమని డిమాండ్ చేసెను.వినాయకుడు మొత్తం భూమి చుట్టూ తిరగలేదు.

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
10. ఓ దివ్య మాతా, యూనివర్సల్ తండ్రి, ఎవరైతే తల్లితండ్రుల చుట్టూ ప్రదక్షణలు చేస్తారో వారు భూమి చుట్టూ తిరిగిన పలితం వస్తుందని వేదాలలో ఉందని వినాయకుడు చెప్పెను. ఈ వరం భూమిపై తల్లిదండ్రుల చుట్టూ తిరిగిన వర్తిస్తుంది.

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
11. మీరు మీ దివ్య తల్లితండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి ఉండాలి. కానీ నేను ఏడూ సార్లు తిరగటం అనేది భూమి చుట్టూ తిరగటం కాదు. మొత్తం విశ్వం చుట్టూ తిరిగినట్టు అవుతుంది. కాబట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా నా వివాహం జరిపించండి.
వినాయకుడు యొక్క తెలివైన మాటలను విని శివ మరియు పార్వతులు ఆస్వాదించారు. అలాగే మొదట వినాయకుని వివాహం జరపాలని నిర్ణయించుకున్నారు.

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
12. ప్రజాపతి విశ్వరూపకు రిద్ది మరియు సిద్ది అని పిలవబడే అందమైన ఇద్దరు కుమార్తెలు ఉండెను. వారిని లార్డ్ గణేశ వివాహం కొరకు ఎంపిక చేసెను. దైవ శిల్పి విశ్వకర్మ ఒక అందమైన వివాహ వేదిక నిర్మించడం ద్వారా వివాహానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసెను. శివుడు మరియు పార్వతి వినాయకుడికి రిద్ది,సిద్ది లతో వివాహం జరిపించెను. వారికీ లాభం,క్షేమం అనే ఇద్దరు అందమైన కుమారులు కలిగెను.

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
13. లార్డ్ సుబ్రహ్మణ్య, దీనిని నిశ్శబ్దంగా గమనించెను. తన తల్లిదండ్రులు మరియు సోదరుడుకు వీడ్కోలు పలికి, క్రౌంచ పర్వత సమీపంలో ఉన్న మానస సరోవరంలోని కైలాశ పర్వతంనకు వెళ్ళెను. (అయితే వినాయకుడు వివాహం తర్వాత,సుబ్రహ్మణ్యకు కూడా వల్లీ మరియు దేవసేన అనే ఇద్దరు అందమైన భార్యలతో వివాహం జరిగిందని స్కంధ పురాణంలో, సుబ్రహ్మణ్య కథలో చెప్పబడింది)

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
14. వినాయకుడి వివాహంనకు సంబందించి మరొక కథను తెలుసుకుందాం.
వినాయకుడికి ఏనుగు తల కారణంగా ఏ అమ్మాయి అతన్ని వివాహం చేసుకోవటానికి సిద్ధపడలేదు. అందరు దేవతలకు భార్యలు లభించగా,తనకు మాత్రం భార్య లేకపోవుట వలన ఆగ్రహం కలిగింది. అందువలన అతను దేవతలు యొక్క వివాహాల్లో సమస్యలను సృష్టించడం ప్రారంభించెను. అతను దేవ వివాహ ఊరేగింపులో వధువు ఇంటికి వెళ్లి, మార్గంలో రంధ్రాలు తీయమని ఎలుకలకు చెప్పేవారు.

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
15. దేవతలు వారి వివాహాలలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. వినాయకుడి కార్యకలాపాలకు విసుగుచెందిన దేవతలు బ్రహ్మకు ఫిర్యాదు చేసారు. ఎవరు ఈ సమస్యను పరిష్కరించడానికి అంగీకరిస్తారు.

బ్రహ్మఛారియైన గణపతికి ఇరువురు భార్యలా....!?
16. బ్రహ్మ రిద్ది(సంపద మరియు శ్రేయస్సు) మరియు సిద్ధి(మేధస్సు మరియు ఆధ్యాత్మిక శక్తులు) అనే ఇద్దరు అందమైన మహిళలను సృష్టించారు. బ్రహ్మ వారిని వివాహం చేసుకోమని వినాయకుడుకి చెప్పెను. ఆ రోజు నుండి ఇప్పటి వరకు సంతోషంగా వినాయకుడు కూడా సిద్ధి మరియు రిద్ది యొక్క దీవెనలను పొందుతున్నాడు. వినాయకుడికి సిద్ది,రిద్ది ద్వారా శుభ, లాభ అనే కుమారులు, సంతోషి అనే కుమార్తె జన్మించెను.



Click it and Unblock the Notifications











