Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
Varalakshmi Vratam 2022: పరమ పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేయాలో తెలుసా..?
పరమ పవిత్రంగా భావించే వరలక్ష్మీ దేవిని ఎందుకు ఆరాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేయడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది.

తమ ఇంటికి సకల భోగాలు, సంపదలు అందాలని కోరుకుంటూ శ్రీమతిగా ఉండే మహిళలు చేసే వ్రతమే వరలక్ష్మీ వ్రతమే ఇది.

వర అంటే వరాలిచ్చే లక్ష్మీ.. అంటే దేవత అని అర్థం. సిరులిచ్చే దేవతను పూజించే పండుగ కాబట్టే దీనిని వరలక్ష్మీ వ్రతం అని పండితులు చెబుతారు. అయితే శ్రావణ మాసంలోని తొలి శుక్రవారమే ఈ వ్రతం ఎందుకు చేయాలి.. లక్ష్మీదేవి ఈ మాసంలోనే ఎందుకు ఆరాధించాలి.. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అష్టలక్ష్ముల రూపం..
వరలక్ష్మీ వ్రతం రోజున చాలా మంది ఉదయం నుండి ఉపవాసం ఉంటారు. ఈ సందర్భంగా అష్టలక్ష్ములందరూ కలిసిన రూపమైన వరలక్ష్మీ దేవతను పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల కుటుంబం మొత్తానికి ఆరోగ్యం, ప్రేమ, చదువు, తెలివి, ఐశ్వర్యం, సంతోషం వంటివన్నీ లభిస్తాయని భక్తులందరూ నమ్ముతారు.

వ్రతం చేస్తే ఏం జరుగుతుంది..
ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఏం జరుగుతుందని అనుకుంటున్నారా? అయితే దీని కంటే ముందు వరలక్ష్మీ కథ గురించి తెలుసుకోవాలి. దీని గురించి మనం ఇంతకుముందు ఆర్టికల్ లోనే తెలుసుకున్నాం కదా..

కరుణా కటాక్షలను పొందండి..
అమ్మవారి అలంకరణను విభిన్నంగా చేస్తూ... విశేష పూజలు చేయాలనుకునే వారు ప్రస్తుతం కరోనా కారణంగా అలా చేయలేకపోవచ్చు.

అలా పూజించినా..
ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అమ్మవారికి కేవలం కలశం పెట్టుకుని పూజించినా కూడా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వంటి వాటితో పాటు సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ప్రస్తుత కరోనా కాలంలో పెద్దగా నియమనిష్టలు పాటించాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. అలా లక్ష్మీదేవిని పూజించి మాత కరుణా కటాక్షలను పొందండి.

ముక్తి లభిస్తుందని..
వరలక్ష్మీ దేవి వ్రతాన్ని శ్రావణ మాసంలో తొలి శుక్రవారమే చేస్తే సకల సౌభాగ్యాలతో పాటు సిరి సంపదలు కలిగి, సుఖజీవనం గడిని ముక్తిని పొందుతారని పండితులు చెబుతున్నారు. అయితే ఈ వ్రతం చేయలేని వారు.. కనీసం ఈ వ్రతం యొక్క కథను విన్నా కూడా ఆయురారోగ్యాలు కూడా సిద్ధిస్తాయని చాలా మంది నమ్ముతారు.



Click it and Unblock the Notifications