Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Varalakshmi Vratam 2022: పరమ పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేయాలో తెలుసా..?
పరమ పవిత్రంగా భావించే వరలక్ష్మీ దేవిని ఎందుకు ఆరాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేయడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది.

తమ ఇంటికి సకల భోగాలు, సంపదలు అందాలని కోరుకుంటూ శ్రీమతిగా ఉండే మహిళలు చేసే వ్రతమే వరలక్ష్మీ వ్రతమే ఇది.

వర అంటే వరాలిచ్చే లక్ష్మీ.. అంటే దేవత అని అర్థం. సిరులిచ్చే దేవతను పూజించే పండుగ కాబట్టే దీనిని వరలక్ష్మీ వ్రతం అని పండితులు చెబుతారు. అయితే శ్రావణ మాసంలోని తొలి శుక్రవారమే ఈ వ్రతం ఎందుకు చేయాలి.. లక్ష్మీదేవి ఈ మాసంలోనే ఎందుకు ఆరాధించాలి.. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అష్టలక్ష్ముల రూపం..
వరలక్ష్మీ వ్రతం రోజున చాలా మంది ఉదయం నుండి ఉపవాసం ఉంటారు. ఈ సందర్భంగా అష్టలక్ష్ములందరూ కలిసిన రూపమైన వరలక్ష్మీ దేవతను పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల కుటుంబం మొత్తానికి ఆరోగ్యం, ప్రేమ, చదువు, తెలివి, ఐశ్వర్యం, సంతోషం వంటివన్నీ లభిస్తాయని భక్తులందరూ నమ్ముతారు.

వ్రతం చేస్తే ఏం జరుగుతుంది..
ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఏం జరుగుతుందని అనుకుంటున్నారా? అయితే దీని కంటే ముందు వరలక్ష్మీ కథ గురించి తెలుసుకోవాలి. దీని గురించి మనం ఇంతకుముందు ఆర్టికల్ లోనే తెలుసుకున్నాం కదా..

కరుణా కటాక్షలను పొందండి..
అమ్మవారి అలంకరణను విభిన్నంగా చేస్తూ... విశేష పూజలు చేయాలనుకునే వారు ప్రస్తుతం కరోనా కారణంగా అలా చేయలేకపోవచ్చు.

అలా పూజించినా..
ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అమ్మవారికి కేవలం కలశం పెట్టుకుని పూజించినా కూడా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వంటి వాటితో పాటు సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ప్రస్తుత కరోనా కాలంలో పెద్దగా నియమనిష్టలు పాటించాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. అలా లక్ష్మీదేవిని పూజించి మాత కరుణా కటాక్షలను పొందండి.

ముక్తి లభిస్తుందని..
వరలక్ష్మీ దేవి వ్రతాన్ని శ్రావణ మాసంలో తొలి శుక్రవారమే చేస్తే సకల సౌభాగ్యాలతో పాటు సిరి సంపదలు కలిగి, సుఖజీవనం గడిని ముక్తిని పొందుతారని పండితులు చెబుతున్నారు. అయితే ఈ వ్రతం చేయలేని వారు.. కనీసం ఈ వ్రతం యొక్క కథను విన్నా కూడా ఆయురారోగ్యాలు కూడా సిద్ధిస్తాయని చాలా మంది నమ్ముతారు.



Click it and Unblock the Notifications











