Latest Updates
-
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు..
వసంత పంచమి 2020 : చిన్నారులకు ఆ సమయంలో అక్షరాభ్యాసం చేయించాలా?
ఈ పంచమి రోజు నుండి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పురాణాల ప్రకారం వసంతి పంచమి నాటి నుండి చలి అనేది బాగా తగ్గిపోతుంది.
సరస్వతీ మాత కటాక్షం కోసం వసంతి పంచమి నాడు ఆ దేవీ ఆలయాలను ఎందరో హిందువులు దర్శించుకుంటూ ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఈ ప్రత్యేకమైన రోజున అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చాలా మంది బాసరలోని సరస్వతి దేవి ఆలయానికి వెళ్తారు. అంతేకాకుండా మాటలు రాకపోయినా.. మాటలు నత్తిగా వస్తున్నా కూడా ఈ ఆలయానికి వెళ్తే అవన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.

ముఖ్యంగా సరస్వతీ ఆలయానికి సమీపంలోని గోదావరి నదిలో స్నానం చేసి.. అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయ ప్రాంగణంలో ఒకరోజు నిద్ర చేసి వెళ్తుంటారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని అష్టదశ పురాణాలలో బ్రహ్మవైవక్త పురాణంలో సరస్వతీ దేవి గురించి చెప్పబడింది. దీంతో ఇంకా అనేక వివరాలు చెప్పబడ్డాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ వసంత పంచమిని శుభప్రదంగా భావిస్తారు. ఇక ఉత్తర భారతంలో వసంత పంచమిని చాలా ఘనంగా జరుపుకుంటారు. అక్కడ అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలు ధరింపజేసి, చక్కగా పండుగలా చేస్తారు...

వసంత పంచమి 2020 తేదీలు..
2020, జనవరి 29వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈరోజున ఉదయం 10:45 గంటలకు ప్రారంభమై, జనవరి 30 తేదీ మధ్యాహ్నం 1:18 గంటలకు ముగుస్తుంది.
పూజా ముహుర్తం : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:35 గంటలకు ముగుస్తుంది.

సరస్వతీ మాత పూజ..
వసంత పంచమిరోజున సరస్వతీ దేవిని ముఖ్యంగా పాఠశాలలు మరియు కళాశాలలతో పాటు అనేక విద్యాసంస్థల్లో పూజిస్తారు. అంతేకాదు అనేక మంది హిందువులు తమ ఇళ్లలో కూడా సరస్వతీ దేవిని పూజిస్తారు. ఈ పూజలు చేయడానికి ముందే ఉదయాన్నే స్నానం చేసి, పసుపు బట్టలు ధరిస్తారు. ఈ పసుపు దుస్తులలో ఆ దేవిని ఆరాధించడం వల్ల తమకు శుభం కలుగుతుందని వారి నమ్మకం. అలాగే సరస్వతీ దేవికి పసుపు రంగులో ఉండే పూలను సమర్పిస్తారు.

సరస్వతీ దేవి మంత్రాలు..
ఓం సరస్వత్వై నమ:
ఓం మహాభద్రాయై నమ:
ఓం మహా మాయామై నమ:
ఓం వర ప్రదాయై నమ:
ఓం శ్రీప్రదాయై నమ:
ఓం పద్మనిలయాయై నమ:
ఓం పద్మాక్త్వై నమ:
ఓం పద్మవక్త్రగాయై నమ:
ఓం శివానుజాయై నమ:
ఓం పుస్తకథ్రుతే నమ:
ఓం రమాయై నమ:
ఓం పరాయై నమ:
ఓం కామ రూపాయై నమ:
ఓం మహా విద్యాయై నమ:
ఓం మహాపాతకనాశిన్వై నమ:

వివాహం కోసం..
వసంత పంచమిని అద్భుత ముహుర్తం అని జ్యోతిష్యశాస్త్రంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి, ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. అలాగే వివాహం కోసం కూడా ఈ వసంత పంచమిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఇంట్లో చేరేందుకు కూడా ఈరోజు చాలా పవిత్రంగా ఉంటుందట. ఈ ప్రత్యేకమైన రోజున పసుపు వంటకం తయారు చేసి, ఇతరులతో పంచుకుంటే మీ జీవితంలో ఆనందం వస్తుంది.

పిల్లల విద్యకు..
ఈ వసంత పంచమి నాడు తమ పిల్లలకు విద్య ప్రారంభానికి కూడా చాలా మంది శుభప్రదంగా భావిస్తారు. ఈరోజున చాలా చోట్ల నాలుకలో ఓం తయారు చేసే సంప్రదాయం ఉంటుందట. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున పిల్లల తెలివి ఎక్కువగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈరోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించాలని పండితులు చెబుతారు.



Click it and Unblock the Notifications