Latest Updates
-
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం!
యుద్ధనీతి విడిచి భీముడు దుర్యోధనుడి తొడలపై ఎందుకు కొట్టి చంపాడు, బలరాముడు భీమున్ని చంపాలనుకున్నాడు
కానీ దుర్యోధనుడు మాత్రం ప్రాణాలతోనే ఉన్నాడు. కౌరవసేన అలా నేలకొరగడంతో రగిలిపోయాడు. గుర్రం మీద ద్వైపాయన సరస్సు వైపుకు బయలుదేరి వెళ్లాడు. దుర్యోధనుడు నీటిలో మునిగి లేచాడు. అంతలో భీముడు వచ్చాడు. కోపంతో
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత చాలా సంఘటనలు జరిగాయి. యుద్ధం పూర్తయ్యాక ఆ రణరంగం నిండా సైనికుల శవాలు, మృతి చెందిన వేలాది ఏనుగులు, గుర్రాలు గుట్టలుగుట్టలుగా పడ్డాయి. ఇక కౌరవ సైన్యంలో ఒక్కరు కూడా మిగలకుండా అందరూ తుడిచిపెట్టుకు పోయారు.

కానీ దుర్యోధనుడు మాత్రం ప్రాణాలతోనే ఉన్నాడు. కౌరవసేన అలా నేలకొరగడంతో రగిలిపోయాడు. గుర్రం మీద ద్వైపాయన సరస్సు వైపుకు బయలుదేరి వెళ్లాడు. దుర్యోధనుడు నీటిలో మునిగి లేచాడు. అంతలో భీముడు వచ్చాడు.

కోపంతో రగిపోతాడు
దుర్యోధనుడు భీముడిని చూడగానే కోపంతో రగిలిపోయాడు. వారిద్దరి మధ్య యుద్ధం మొదలయ్యింది. దుర్యోధనుడు భీముడు బీకరంగా తలపడుతున్నారు. దుర్యోధనుడిని ఎక్కడ కొడితే చనిపోతాడో శ్రీకృష్ణుడికి తెలుస. ఆ విషయాన్ని కృష్ణుడు భీముడికి ఒక సంకేతం ద్వారా తెలుపుతాడు.

తొడలపై కొడితే
తొడలపై కొట్టు చస్తాడు అన్నట్లుగా సైగ చేస్తాడు. వెంటనే భీముడు
దుర్యోధనుడి తొడల మీద గట్టిగా కొట్టాడు. దుర్యోధనుడి తొడలు విరిగి నేల మీద పడిపోయాడు. కానీ యుద్దనీతినిబంధనలకు ఇది విరుద్ధం. దీంతో అక్కడే ఉన్న బలరాముడు కోపంతో భీమున్ని చంపడానికి వెళ్తాడు.

యుద్దనీతి
భీమ, దుర్యోధనుల గదాయుద్ధంలో భీముడు యుద్దనీతి పాటించలేదంటాడు బలరాముడు. ఇది అన్యాయం అంటాడు. దుర్యోధనుడిని అంత నీచంగా చంపిన భీముడిని చంపేస్తానంటూ బలరాముడు నాగలి, రోకలితో భీముని మీదకు వెళ్తాడు.

తప్పులేదు
కానీ కృష్ణుడు అడ్డుకుంటాడు. భీముడు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదంటాడు. భీముడి ప్రతిజ్ఞ చేసిన ప్రకారం చంపాడంటాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సుక్షత్రియుడి లక్షణం అని క్రిష్ణుడు చెబుతాడు.

శాపం ఉంది
ఇక దుర్యోధనుడికి తొడలు విరిగిపోయే శాపం ఒకటి ఉందని గుర్తు చేస్తాడు. మైత్రేయి అనే మహర్షి శాపం వల్లే దుర్యోధనుడు ఇలా తొడలు కోల్పొయాడంటాడు. అందువల్లే ఇలా జరిగిందని కృష్ణుడు చెప్పడంతో బలరాముడు శాంతంగా మారుతాడు.



Click it and Unblock the Notifications