Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
యుద్ధనీతి విడిచి భీముడు దుర్యోధనుడి తొడలపై ఎందుకు కొట్టి చంపాడు, బలరాముడు భీమున్ని చంపాలనుకున్నాడు
కానీ దుర్యోధనుడు మాత్రం ప్రాణాలతోనే ఉన్నాడు. కౌరవసేన అలా నేలకొరగడంతో రగిలిపోయాడు. గుర్రం మీద ద్వైపాయన సరస్సు వైపుకు బయలుదేరి వెళ్లాడు. దుర్యోధనుడు నీటిలో మునిగి లేచాడు. అంతలో భీముడు వచ్చాడు. కోపంతో
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత చాలా సంఘటనలు జరిగాయి. యుద్ధం పూర్తయ్యాక ఆ రణరంగం నిండా సైనికుల శవాలు, మృతి చెందిన వేలాది ఏనుగులు, గుర్రాలు గుట్టలుగుట్టలుగా పడ్డాయి. ఇక కౌరవ సైన్యంలో ఒక్కరు కూడా మిగలకుండా అందరూ తుడిచిపెట్టుకు పోయారు.

కానీ దుర్యోధనుడు మాత్రం ప్రాణాలతోనే ఉన్నాడు. కౌరవసేన అలా నేలకొరగడంతో రగిలిపోయాడు. గుర్రం మీద ద్వైపాయన సరస్సు వైపుకు బయలుదేరి వెళ్లాడు. దుర్యోధనుడు నీటిలో మునిగి లేచాడు. అంతలో భీముడు వచ్చాడు.

కోపంతో రగిపోతాడు
దుర్యోధనుడు భీముడిని చూడగానే కోపంతో రగిలిపోయాడు. వారిద్దరి మధ్య యుద్ధం మొదలయ్యింది. దుర్యోధనుడు భీముడు బీకరంగా తలపడుతున్నారు. దుర్యోధనుడిని ఎక్కడ కొడితే చనిపోతాడో శ్రీకృష్ణుడికి తెలుస. ఆ విషయాన్ని కృష్ణుడు భీముడికి ఒక సంకేతం ద్వారా తెలుపుతాడు.

తొడలపై కొడితే
తొడలపై కొట్టు చస్తాడు అన్నట్లుగా సైగ చేస్తాడు. వెంటనే భీముడు
దుర్యోధనుడి తొడల మీద గట్టిగా కొట్టాడు. దుర్యోధనుడి తొడలు విరిగి నేల మీద పడిపోయాడు. కానీ యుద్దనీతినిబంధనలకు ఇది విరుద్ధం. దీంతో అక్కడే ఉన్న బలరాముడు కోపంతో భీమున్ని చంపడానికి వెళ్తాడు.

యుద్దనీతి
భీమ, దుర్యోధనుల గదాయుద్ధంలో భీముడు యుద్దనీతి పాటించలేదంటాడు బలరాముడు. ఇది అన్యాయం అంటాడు. దుర్యోధనుడిని అంత నీచంగా చంపిన భీముడిని చంపేస్తానంటూ బలరాముడు నాగలి, రోకలితో భీముని మీదకు వెళ్తాడు.

తప్పులేదు
కానీ కృష్ణుడు అడ్డుకుంటాడు. భీముడు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదంటాడు. భీముడి ప్రతిజ్ఞ చేసిన ప్రకారం చంపాడంటాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సుక్షత్రియుడి లక్షణం అని క్రిష్ణుడు చెబుతాడు.

శాపం ఉంది
ఇక దుర్యోధనుడికి తొడలు విరిగిపోయే శాపం ఒకటి ఉందని గుర్తు చేస్తాడు. మైత్రేయి అనే మహర్షి శాపం వల్లే దుర్యోధనుడు ఇలా తొడలు కోల్పొయాడంటాడు. అందువల్లే ఇలా జరిగిందని కృష్ణుడు చెప్పడంతో బలరాముడు శాంతంగా మారుతాడు.



Click it and Unblock the Notifications











