పరశురాముడు కన్న తల్లినే ఎందుకు కడతేర్చాడో తెలుసా...

పరశురాముడు కన్న తల్లినే ఎందుకు కడతేర్చాడో ఇప్పుడు తెలుసుకుందాం.

By Staff

ప్రపంచంలో తల్లిని మించిన వారు ఉండరు. దైవం తర్వాత మరో దైవం అంటే అది ఖచ్చితంగా కన్నతల్లే.. ఇంకా చెప్పాలంటే, దైవం కంటే ఎక్కువ. జన్మనివ్వడంతో ఆమె బాధ్యత పూర్తవదు. ఎన్నెన్నో త్యాగాలు చేసి పెంచి పెద్ద చేస్తుంది. అందుకే ఏమిచ్చినా తల్లి రుణం తీర్చుకోలేం అంటారు. అలాంటిది, పరశురాముడు కన్నతల్లిని గొడ్డలితో అడ్డంగా నరికేశాడు.

పరశురాముడికి మానవత్వం లేదా? కసాయివాడా? తల్లిని ఎందుకు చంపాడు? దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రేణుక మరియు మట్టి కుండ

రేణుక మరియు మట్టి కుండ

పరశురాముడు మహర్షి జమదగ్నిమరియు రేణుక యొక్క కుమారుడు. రేణుక ఆమె భర్త పవిత్రత మరియు పతిభక్తికి ప్రసిద్ది చెందింది. ఆమెకు అటువంటి విశ్వాసం కూడా ఉంది.ఆమె కాల్చని మట్టి కుండలో నది నుండి నీరు తేవటానికి వెళ్ళినది. ఆమెకు కాల్చని మట్టి కుండలో నీరు తెచ్చే ప్రాతివత్యం కలిగి ఉంది.

 ఒక దురదృష్టకరమైన రోజు

ఒక దురదృష్టకరమైన రోజు

ఒక రోజు నది వద్ద ఉండగా,ఆమెకు ఆకాశంలో గందర్వ సముహంతో కూడిన రథం కనిపించెను. ఆమె వారిని అలా చూస్తూ ఉండగా,నీటితో ఉన్న కాల్చని మట్టి కుండ కరిగిపోయెను. ఆమె తిరిగి వచ్చేసరికి భర్త చాలా కోపంగా ఉండెను. ఆమె, నది ఒడ్డున అనిశ్చితంగా ఎందుకు వేచి ఉన్నది. ఇదిలా ఉండగా,జమదగ్ని తన భార్య తిరిగి రాలేదని గమనించేను. తన యోగ శక్తి ద్వారా, నది దగ్గర జరిగిన విషయాన్నీ తెలుసుకొనెను.

జమదగ్ని చంపమని ఆజ్ఞాపించాడు

జమదగ్ని చంపమని ఆజ్ఞాపించాడు

ఋషి తన పెద్ద కుమారునికి గొడ్డలి ఇచ్చి తల్లిని చంపమని ఆదేశించేను. ఆ బాలుడు భయంతో నిరాకరించెను. అప్పుడు జమదగ్ని అతనిని రాయిగా మార్చెను. అప్పుడు జమదగ్ని మిగతా కుమారులను కూడా అడిగెను. వారు కూడా నిరాకరించెను. అప్పుడు వారిని కూడా జమదగ్ని రాయిలుగా మార్చివేసెను. చివరగా తన చిన్న కుమారుడు పరశురాముడు మిగిలేను. అతను తన తండ్రి అజ్ఞ ప్రకారం తన తల్లి తలను నరికేను.

రెండు వరాలు

రెండు వరాలు

జమదగ్ని సంతోషంతో పరశురామునికి రెండు వరాలు ఇచ్చెను. అప్పుడు పరశురాముడు తన తల్లిని బతికించుట మరియు రాయిలుగా మార్చిన తన సోదరులను బతికించమని రెండు వరాలను కోరుకొనెను. తన కుమారుని ఆప్యాయత మరియు భక్తికి మెచ్చి జమదగ్ని తన అభ్యర్థనను మన్నించెను.

దేవత ఎల్లమ్మ పురాణం

దేవత ఎల్లమ్మ పురాణం

భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతాలలో ఎల్లమ్మ దేవత ప్రముఖ దేవతగా ఉంది. ఆమె పేద మరియు అణగద్రొక్కబడినవారికి దేవతగా ఉంది. ఎల్లమ్మ దేవత యొక్క మూల కథ ప్రత్యేకంగా పరశురాముడు తల్లి రేణుకతో సంబంధం కలిగి ఉంది. తన తల్లిని చంపడానికి పరశురాముడు గొడ్డలి ఎత్తినప్పుడు, ఆమె పరుగెత్తి తక్కువ కులం కలిగిన పేద మహిళ ఇంట్లో తలదాచుకొనెను.

దైవిక మిక్స్ అప్

దైవిక మిక్స్ అప్

పరశురాముడు తన తల్లిని నరకటానికి అనుసరించిన సమయంలో, తక్కువ కులం కలిగిన పేద మహిళ మాతృ హత్యను నిరోదించే ప్రయత్నంలో అడ్డు వెళ్ళెను. అప్పుడు అనుకోకుండా ఆమె తల పగిలెను. తన తల్లిని బతికించమని పరశురాముడు తన తండ్రి జమదగ్నిని వరం కోరినప్పుడు, అనుకోకుండా తన తల్లి శరీరంలో తక్కువ కులం కలిగిన స్త్రీ యొక్క తల పెట్టబడుతుంది. ఆ తరువాత నుంచి రేణుక అసలు తలను ఎల్లమ్మగా పూజిస్తున్నారు. అందుచేత రేణుక దేవతను ఎల్లమ్మగా సూచిస్తారు.

 కామధేను పురాణం

కామధేను పురాణం

ఈ సంఘటన తరువాత, ఒకసారి హైహయ రాజు కార్తవీర్య జమదగ్ని ఆశ్రమం దగ్గరకు వచ్చెను. ఆ సమయంలో పరశురాముడు దూరంగా అడవిలో ఉండెను. రాజుకి భారీ పరివారం ఉన్నప్పటికీ, సప్తర్షి రాజుకు గొప్ప విందును ఏర్పాటు చేసెను. జమదగ్నిని కార్తవీర్య ఇది ఎలా సంభవం అయిందని అడిగెను. జమదగ్ని అతనికి దీవెనలతో కూడిన కామధేను దూడను చూపించేను. దీనిని జమదగ్నికి ఇంద్రుడు ఇచ్చెను. ఇది కోరిన కోరికలను తీర్చుతుంది. అందువల్ల కార్తవీర్య ఆ దూడను ఇవ్వమని జమదగ్నిని కోరెను.

కార్తవీర్య పవిత్రమైన జంతువును దొంగిలించేను

కార్తవీర్య పవిత్రమైన జంతువును దొంగిలించేను

ఇంటికి తిరిగి వచ్చిన పరశురాముడు మండిపడి రాజ ప్రసాదానికి వెళ్ళెను. తన గొడ్డలిని ఝళిపించి, రాజు యొక్క దళాలను చంపి, చావిడి నుంచి దూడను తీసుకువచ్చిన రాజు కార్తవీర్యను చంపెను. అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తన తండ్రి గర్వంగా ఉండెను. కాని పరశురాముడు దగ్గర ఉన్న రక్తముతో తడిసిన గొడ్డలిని చూసి ఆందోళన చెందెను. ఆయన కోపం మరియు అహంకారం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని కుమారుడుని హెచ్చరించారు. పరశురాముడు తన తండ్రి మందలింపును అంగీకరించి, తపస్సు, మరియు శుద్ధి కోసం తీర్థయాత్రకు వెళ్ళెను.

కార్తవీర్య కుమారులు

కార్తవీర్య కుమారులు

ఇదిలా ఉండగా, కార్తవీర్య కుమారులు భవనంలో వారి తండ్రిని కనుగొన్నారు. అలాగే పరశురాముడు తమ తండ్రిని హత్య చేశారని తెలుసుకొనెను. వారు ప్రతీకారంతో ఆశ్రమానికి వచ్చి జమదగ్నిని హత్య చేసెను. ఋషి పరిసర ప్రాంతంలో, బాణాలతో జింకలను చంపెను. ఆ తర్వాత వారు,జమదగ్ని శరీరం నుండి తలను వేరుచేసి తీసుకువెళ్ళెను. పరశురాముడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు,అతను తన తండ్రి యొక్క శరీరం పక్కన ఉన్న తల్లిని చూసేను. ఆమె జమదగ్ని చాతిపై 21 సార్లు కొట్టుకుంటూ రోడించెను.

 క్షత్రియలను 21 సార్లు హతమార్చేను

క్షత్రియలను 21 సార్లు హతమార్చేను

ఆగ్రహంతో అతను రాజమందిరం వద్ద కార్తవీర్య కుమారులను వేటాడేను. అతను వారందరిని చంపి, దహనం నిర్వహించడం కోసం తన తండ్రి యొక్క తలను తిరిగి తీసుకువచ్చెను. ఆ తర్వాత పరశురాముడు క్షత్రియ జాతిపై ఆగ్రహించి క్షత్రియలపై ఇరవై ఒక్క సార్లు యుద్ధం చేస్తానని ప్రతిజ్ఞ చేసెను. ప్రతి సారి అతని తల్లి చాతిపై కొట్టుకొనెను.

క్షత్రియులకు వ్యతిరేకంగా ప్రతీకారం

క్షత్రియులకు వ్యతిరేకంగా ప్రతీకారం

పరశురాముడు భూమండలం అంతా ప్రయాణించి అమాయకుల అయిన క్షత్రియ కులంలో ఉన్న మొత్తం పురుషులను హతమార్చెను. మొదటి పుస్తకం మహాభారతంలో ఇలా రాసారు: త్రేతా మరియు ద్వాపర యుగాల విరామాల మధ్య పరశురాముడు అసహనంతో అనేక తప్పులను చేసెను. పదేపదే క్షత్రియులను గాయపరిచే వాడు. ఆవేశపూరిత ఉల్కాపాతం మరియు తన సొంత శౌర్యం ద్వారా క్షత్రియులను పూర్తిగా నాశనం చేసెను. అతను క్షత్రియుల రక్తంను సామంత-పంచక అనే ఐదు సరస్సులు వద్ద ఏర్పాటు చేసెను.

 పరశురాముని పౌరాణిక కథలు

పరశురాముని పౌరాణిక కథలు

వివిధ పురాణాల్లో పరశురాముడు యొక్క కధలు ఉన్నాయి. హిందూ మత సకల దేవగణాలలో వివిధ దేవతలతో తన పరస్పర చర్యలను వివరించే విధంగా ఉంటాయి. దాని కారణంగా వివిధ యుగాల సమయంలో అయన అమరుడుగా ఉన్నారు.

ఏకదంత

ఏకదంత

పురాణాల ప్రకారం, పరశురాముడు తన గురువు అయిన శివుని వద్దకు హిమాలయాలకు ప్రయాణించారు. ఆ విధంగా ప్రయాణిస్తుండగా, తన మార్గంను వినాయకుడు నిరోదించెను. పరశురాముడు ఏనుగు-దేవుడు అయిన వినాయకుడు మీదకు తన గొడ్డలిని విసిరెను. వినాయకుడు, ఆ ఆయుధంను తన తండ్రి పరశురాముడికి ఇచ్చినదని తెలుసుకొని, అది తన ఎడమ దంతంను తెంచుకోవడానికి అనుమతించేను. అప్పుడు అతని తల్లి పార్వతి మండిపడి, పరశురాముడు యొక్క చేతులను నరికేయమని ఆదేశించేను.

పరశురాముడు కోసం క్షమించడం

పరశురాముడు కోసం క్షమించడం

ఆమె దేవత దుర్గ రూపంలో సర్వశక్తివంతంగా మారుతుంది. కానీ చివరి క్షణంలో, శివుడు ఆమె సొంత కొడుకు అవతారంను చూపించి, ఆమెకు తృప్తి కలిగించెను. పరశురాముడు కూడా ఆమెను క్షమాపణలు కోరెను. ఆమె చివరకు మనసు మార్చుకొని, యోధుడు సాధువు తరపున మాట్లాడేను. అప్పుడు వినాయకుడు పరశురామునికి తన దివ్య గొడ్డలి ఇచ్చి మరియు అతనిని దీవించేను. ఎందుకంటే ఈ కలయిక వినాయకుడు మరో పేరు 'ఎకదంత' లేదా 'వన్ టూత్' కొరకు జరిగింది.

అరేబియా సముద్రం తిరిగి పొందుట

అరేబియా సముద్రం తిరిగి పొందుట

పురాణాల ప్రకారం భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో అల్లకల్లోలమైన తరంగాలు మరియు గాలి వానల నుండి ప్రమాదం ఎదురవుతుంది. దీనివల్ల సముద్రం భూమిని ఆక్రమిస్తుంది. పరశురాముడు పురోగమిస్తున్న జలాలతో పోరాటం చేసి, కొంకణ్,మలబార్ భూములను విడుదల చేయమని వరుణుడిని డిమాండ్ చేసెను. వారి పోరాట సమయంలో, పరశురాముడు సముద్రంలోకి తన గొడ్డలిని విసిరారు. భూమి యొక్క ద్రవ్యరాశి పెరిగింది. కానీ వరుణుడి ఆ సముద్ర ప్రాంతం అంతా ఉప్పుతో నిండి ఉండుట వలన ఆ భూమి అంతా బీడుగా ఉంటుందని చెప్పెను.

 ఆధునిక కేరళను నిర్మించారు

ఆధునిక కేరళను నిర్మించారు

పరశురాముడు పాముల రాజు అయిన నాగరాజు కోసం తపస్సు చేసెను. పరశురాముడు ఉప్పుతో నిండిన భూమిని తటస్తం చేయటానికి వారి విషం కోసం దేశమంతట సర్పాలను వ్యాప్తి చేయమని కోరెను. నాగరాజా అంగీకరించేను. అప్పుడు సారవంతమైన భూమి పెరిగింది. అందువలన,పరశురాముడు పశ్చిమ కనుమల పర్వత మరియు అరేబియా సముద్రం మధ్య తీరంలో ముందుకు ఆధునిక కేరళను సృష్టించడం జరిగింది.

పరశురాముడు మరియు సూర్య

పరశురాముడు మరియు సూర్య

పరశురాముడికి ఒకసారి చాలా వేడి కలిగించినందుకు సూర్య దేవుడు మీద కోపం వచ్చెను. యోధుడు అయిన మహర్షి సూర్య దేవుని మీదకు ఆకాశంలోకి అనేక బాణాలను వేసెను. అప్పుడు సూర్య దేవుడు భయపడెను. పరశురాముడు బాణాలు అన్ని అయిపొయెను. అప్పుడు అతని భార్య ధరణి మరిన్ని బాణాలు తెచ్చి ఇచ్చెను. అప్పుడు సూర్య దేవుడు ఆమె మీదకు తన కిరణాలను కేంద్రీకరించేను. దాని వలన ఆమె కూలిపోయింది. అప్పుడు సూర్యుడు పరశురామునికి దర్శనమిచ్చి,ఈ అవతారంలో చెప్పులు మరియు ఒక గొడుగు ఇచ్చెను.

అతనికి మోక్షంను దత్తాత్రేయుడు ఇచ్చారు

అతనికి మోక్షంను దత్తాత్రేయుడు ఇచ్చారు

నాథ్ సంప్రదాయంను పరశురాముడు కలిగి ఉన్నారు. అతని ప్రతీకారంను అమలు చేసిన తర్వాత, గంధమాదన పర్వతం పైన దత్తాత్రేయుడిని ఆధ్యాత్మికం మార్గదర్శకత్వం చేయమని పరశురాముడు కోరెను. వారి సంభాషణలు త్రిపుర-రహస్యం, అద్వైత వేదాంత గ్రంథములకు ఊతం ఇచ్చాయి. ఈ దేవత గ్రంథాలలో పరిజ్ఞానం మీద యోధుడు మహర్షి ఆదేశాలు, ప్రాపంచిక కార్యకలాపాల పునరుద్ధరణ, ద్వంద్వ ప్రవృత్తి లేకుండా ఉండటం అనేవి ఉన్నాయి. ఆ విధంగా మరణం మరియు పునరుత్థానం యొక్క కర్మ సంబంధ చక్రం నుండి అతనికి విముక్తి కలిగింది.

సన్యాసి మరియు ముగింపు సమయం

సన్యాసి మరియు ముగింపు సమయం

వేద కాలం ముగిసిన తర్వాత, పరశురాముడు రక్తపాతంతో అలసిపోయి సన్యాసిగా మారెను. అతను అనుభవంతో తపస్సు సాధన ప్రారంభించెను. మొదటి పుస్తకం మహాభారతంలో ఇలా రాశారు - జమదగ్ని కుమారుడు,ఇరవై ఒక్క సార్లు క్షత్రియుల మీద దండయాత్ర చేసిన తర్వాత,మహేంద్ర పర్వతం మీదకు వెళ్లి పరశురాముడు సన్యాసిగా తపస్సును ప్రారంభించేను.

Desktop Bottom Promotion