పరమశివుడ్ని పసుపుతో ఎందుకు పూజించకూడదు?పరమ శివుడిని పసుపుతో అభిషేకించకూడదు ఎందుకు?

పరమశివుడ్ని పసుపుతో ఎందుకు పూజించకూడదు?పరమ శివుడిని పసుపుతో అభిషేకించకూడదు ఎందుకో తెలుసుకోవాలంటే.. దవండి.

ఇది వరకటి వ్యాసాల్లో మేము, ఇంట్లో లేదా ఎక్కడైతే రోజూ సరైన ఆచారాలతో పూజలు జరగవో అక్కడ శివలింగాన్ని పెట్టకూడదని సలహా ఇచ్చాం. అలా సరైన పూజాపునస్కారాలు లేకపోవటం పరమశివుణ్ణి అగౌరవంగా చూడటంతో సమానం.

పరమశివుడు చాలా సాదా జీవనం గడపటానికి ప్రసిద్ధుడు, అందుకని ఆయన్ని పూజించటం కూడా చాలా సాధారణంగానే ఉండాలి. అందంగా అలంకరణలు, పెద్ద పెద్ద నైవేద్యాలు,పళ్ళు ఇవేవీ శివుడ్ని పూజించటానికి అవసరం ఉండదు.

shiva temple

పురాణాలలో పరమశివుడు కేవలం దత్త పండు, బిల్వ ఆకులు, కల్లు, తాజా చల్లని ఆవుపాలు, గంధపు పేస్టు ,మరియు భస్మం వీటితోనే ఆనందపడతాడని రాసి ఉంది.

హిందూ మతంలో, పరమశివున్ని క్రమం తప్పకుండా పూజించటం, ధ్యానించటం వలన ఇతర దేవదేవతలు కూడా అనుగ్రహిస్తారని నమ్ముతారు.

shiva temple

శివుడు, పార్వతుల జీవితకథ అయిన శివపురాణంలోని ఒక అధ్యాయంలో వారిని ఎలా పూజించాలో, ఎలా పూజించకూడదో మొత్తం రాసి ఉంది.

ఈ రోజు, మేము పరమశివుడికి పసుపు(హల్దీ) ఎన్నటికీ ఎందుకు పెట్టకూడదో పంచుకుంటున్నాం.

shiva temple

పసుపు అన్ని మతాచారాలలో చాలా పవిత్రమైనదని గుర్తించినా, అందరు దేవతలను పూజించటానికి ఉపయోగించిన, పసుపును పరమశివుడికి లేదా ఆయన శివలింగానికి ఎన్నటికీ వినియోగించరు.
shiva temple

పురాణాల ప్రకారం శివలింగాన్ని పురుషయోనికి గుర్తుగా భావిస్తారు, ముఖ్యంగా శివునిది. అది ఆయన అపారమైన శక్తికి నిదర్శనం. ఈ కారణం వలన దాన్ని ఎప్పుడూ చల్లబర్చే పాలు, గంధం, బూడిద వంటి వాటితోనే పూజిస్తారు.

కానీ పసుపు స్త్రీ అందాన్ని పెంచే వస్తువు. ఈ భౌతిక అందాలకి దూరంగా ఉండే పరమశివుడు ఒక సన్యాసిగా జీవిస్తారు కాబట్టి పసుపుతో ఎన్నటికీ పూజించబడరు.

Desktop Bottom Promotion