Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
కేశ సంరక్షణకు ఉసిరి, నిమ్మ....!

నిత్యం నూనె రాస్తూ ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నా చుండ్ర సమస్య వేధిస్తుంటే దానికి జింక్ లోపం కూడా ఒక కారణమే. జింక్ పుష్కలంగా లభిస్తే తలలో చుండ్రు బాద తప్పుతుంది. దాంతో పాటు జుట్టు పొడిబారే సమస్యా తగ్గుతుంది. గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో వీటిని జోడించుకోవడం వల్ల పొడవైన ఆరోగ్యవంతమైన కేశాలు మీసొంతమవుతాయి. వీటితోపాటు తణధాన్యాలు, బాదం, సారడైన్ సముద్ర చేపలు నుంచి జింక్ లభిస్తుంది. రోజుకూ 8 నుండి 10 గ్లాసుల నీళ్ళు తాగి సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఫలితం ఉంటుంది.
1. రాత్రిళ్లు అరకప్పు వేప నూనెను వేడిచేసి అందులో నాలుగు చెంచాల కర్పూరం పొడిని కలపి తలకు మర్ధన చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. మర్నాడు గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గి వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
2. ఒక కప్పు గంధం పొడిలో తగినంత నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. తలస్నానం చేసిన మర్నాడు పూతలా వేసి రెండు గంటలయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు క్రమంగా దూరమవుతుంది.
3. వేపాకులను వెండబెట్టి పొడి చేసి అందులో తగినన్ని నీళ్లు కలిపి మరిగించాలి. చల్లారక వడపోసి వచ్చిన డికాషన్ మాడుకు రాయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
4. అర లీటర్ నీళ్లలో కప్పు ఉసిరిపొడి కలిపి రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. నీళ్లు బాగా ఇంకిపోయేవరకూ ఉంచి దింపుకొని చల్లరాక అందులో పెరుగు కలిపి శిరోజాలకు రాసి గంట తర్వాత కడిగితే సరిపోతుంది. ఇలా రెండు వారాకోసారి చేయడం వల్ల చుండ్రు సమస్య నియంత్రణలో ఉంటుండి.
5. వాడేసిన నిమ్మచెక్కలను ఎండబెట్టి పొడిచేసి కొన్ని నీళ్లు కలిపి మాడుకు పూతలా వేయాలి. కడిగిన తర్వాత తలకు ఆవిరి పడితే కుదుళ్లు బలంగా పెరుగుతాయి. నెలలో రెండు సార్లైనా ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితం కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications











