Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
కేశ సంరక్షణకు ఉసిరి, నిమ్మ....!

నిత్యం నూనె రాస్తూ ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నా చుండ్ర సమస్య వేధిస్తుంటే దానికి జింక్ లోపం కూడా ఒక కారణమే. జింక్ పుష్కలంగా లభిస్తే తలలో చుండ్రు బాద తప్పుతుంది. దాంతో పాటు జుట్టు పొడిబారే సమస్యా తగ్గుతుంది. గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో వీటిని జోడించుకోవడం వల్ల పొడవైన ఆరోగ్యవంతమైన కేశాలు మీసొంతమవుతాయి. వీటితోపాటు తణధాన్యాలు, బాదం, సారడైన్ సముద్ర చేపలు నుంచి జింక్ లభిస్తుంది. రోజుకూ 8 నుండి 10 గ్లాసుల నీళ్ళు తాగి సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఫలితం ఉంటుంది.
1. రాత్రిళ్లు అరకప్పు వేప నూనెను వేడిచేసి అందులో నాలుగు చెంచాల కర్పూరం పొడిని కలపి తలకు మర్ధన చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. మర్నాడు గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గి వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
2. ఒక కప్పు గంధం పొడిలో తగినంత నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. తలస్నానం చేసిన మర్నాడు పూతలా వేసి రెండు గంటలయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు క్రమంగా దూరమవుతుంది.
3. వేపాకులను వెండబెట్టి పొడి చేసి అందులో తగినన్ని నీళ్లు కలిపి మరిగించాలి. చల్లారక వడపోసి వచ్చిన డికాషన్ మాడుకు రాయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
4. అర లీటర్ నీళ్లలో కప్పు ఉసిరిపొడి కలిపి రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. నీళ్లు బాగా ఇంకిపోయేవరకూ ఉంచి దింపుకొని చల్లరాక అందులో పెరుగు కలిపి శిరోజాలకు రాసి గంట తర్వాత కడిగితే సరిపోతుంది. ఇలా రెండు వారాకోసారి చేయడం వల్ల చుండ్రు సమస్య నియంత్రణలో ఉంటుండి.
5. వాడేసిన నిమ్మచెక్కలను ఎండబెట్టి పొడిచేసి కొన్ని నీళ్లు కలిపి మాడుకు పూతలా వేయాలి. కడిగిన తర్వాత తలకు ఆవిరి పడితే కుదుళ్లు బలంగా పెరుగుతాయి. నెలలో రెండు సార్లైనా ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితం కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications