Latest Updates
-
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.! -
అత్తకి మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.! -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.! -
అన్నీ ఇచ్చాక కూడా ప్రేమ మారిపోయిందా? దానికి కారణం మీరు కాదు -
మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ 4 ఫ్రూట్స్తో ప్రమాదాన్ని అరికట్టొచ్చా.? -
జూన్ 5, 2026: గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి అదృష్టం, ధనయోగం ఖాయం!
కేశ సంరక్షణకు ఉసిరి, నిమ్మ....!

నిత్యం నూనె రాస్తూ ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నా చుండ్ర సమస్య వేధిస్తుంటే దానికి జింక్ లోపం కూడా ఒక కారణమే. జింక్ పుష్కలంగా లభిస్తే తలలో చుండ్రు బాద తప్పుతుంది. దాంతో పాటు జుట్టు పొడిబారే సమస్యా తగ్గుతుంది. గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో వీటిని జోడించుకోవడం వల్ల పొడవైన ఆరోగ్యవంతమైన కేశాలు మీసొంతమవుతాయి. వీటితోపాటు తణధాన్యాలు, బాదం, సారడైన్ సముద్ర చేపలు నుంచి జింక్ లభిస్తుంది. రోజుకూ 8 నుండి 10 గ్లాసుల నీళ్ళు తాగి సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఫలితం ఉంటుంది.
1. రాత్రిళ్లు అరకప్పు వేప నూనెను వేడిచేసి అందులో నాలుగు చెంచాల కర్పూరం పొడిని కలపి తలకు మర్ధన చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. మర్నాడు గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గి వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
2. ఒక కప్పు గంధం పొడిలో తగినంత నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. తలస్నానం చేసిన మర్నాడు పూతలా వేసి రెండు గంటలయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు క్రమంగా దూరమవుతుంది.
3. వేపాకులను వెండబెట్టి పొడి చేసి అందులో తగినన్ని నీళ్లు కలిపి మరిగించాలి. చల్లారక వడపోసి వచ్చిన డికాషన్ మాడుకు రాయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
4. అర లీటర్ నీళ్లలో కప్పు ఉసిరిపొడి కలిపి రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. నీళ్లు బాగా ఇంకిపోయేవరకూ ఉంచి దింపుకొని చల్లరాక అందులో పెరుగు కలిపి శిరోజాలకు రాసి గంట తర్వాత కడిగితే సరిపోతుంది. ఇలా రెండు వారాకోసారి చేయడం వల్ల చుండ్రు సమస్య నియంత్రణలో ఉంటుండి.
5. వాడేసిన నిమ్మచెక్కలను ఎండబెట్టి పొడిచేసి కొన్ని నీళ్లు కలిపి మాడుకు పూతలా వేయాలి. కడిగిన తర్వాత తలకు ఆవిరి పడితే కుదుళ్లు బలంగా పెరుగుతాయి. నెలలో రెండు సార్లైనా ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితం కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications