Latest Updates
-
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
కేశ సంరక్షణకు ఉసిరి, నిమ్మ....!

నిత్యం నూనె రాస్తూ ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నా చుండ్ర సమస్య వేధిస్తుంటే దానికి జింక్ లోపం కూడా ఒక కారణమే. జింక్ పుష్కలంగా లభిస్తే తలలో చుండ్రు బాద తప్పుతుంది. దాంతో పాటు జుట్టు పొడిబారే సమస్యా తగ్గుతుంది. గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో వీటిని జోడించుకోవడం వల్ల పొడవైన ఆరోగ్యవంతమైన కేశాలు మీసొంతమవుతాయి. వీటితోపాటు తణధాన్యాలు, బాదం, సారడైన్ సముద్ర చేపలు నుంచి జింక్ లభిస్తుంది. రోజుకూ 8 నుండి 10 గ్లాసుల నీళ్ళు తాగి సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఫలితం ఉంటుంది.
1. రాత్రిళ్లు అరకప్పు వేప నూనెను వేడిచేసి అందులో నాలుగు చెంచాల కర్పూరం పొడిని కలపి తలకు మర్ధన చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. మర్నాడు గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గి వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
2. ఒక కప్పు గంధం పొడిలో తగినంత నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. తలస్నానం చేసిన మర్నాడు పూతలా వేసి రెండు గంటలయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు క్రమంగా దూరమవుతుంది.
3. వేపాకులను వెండబెట్టి పొడి చేసి అందులో తగినన్ని నీళ్లు కలిపి మరిగించాలి. చల్లారక వడపోసి వచ్చిన డికాషన్ మాడుకు రాయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
4. అర లీటర్ నీళ్లలో కప్పు ఉసిరిపొడి కలిపి రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. నీళ్లు బాగా ఇంకిపోయేవరకూ ఉంచి దింపుకొని చల్లరాక అందులో పెరుగు కలిపి శిరోజాలకు రాసి గంట తర్వాత కడిగితే సరిపోతుంది. ఇలా రెండు వారాకోసారి చేయడం వల్ల చుండ్రు సమస్య నియంత్రణలో ఉంటుండి.
5. వాడేసిన నిమ్మచెక్కలను ఎండబెట్టి పొడిచేసి కొన్ని నీళ్లు కలిపి మాడుకు పూతలా వేయాలి. కడిగిన తర్వాత తలకు ఆవిరి పడితే కుదుళ్లు బలంగా పెరుగుతాయి. నెలలో రెండు సార్లైనా ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితం కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications