Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
పనసపండుతో అతిసార (డయేరియా)కు చెక్ పెడదాం..
పనసపండు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాని ఏ, సి విటమిన్లు మాత్రం కొంత మాత్రమే ఉంటాయి. అయితే పొటాషియం, మెగ్నీషియం, పుష్కలంగా లభిస్తాయి.
అతిసార (డయేరియా) వ్యాధితో ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్కసారి ఇది వస్తే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వ్యాధి ఎక్కువగా కలుషిత నీరు తాగడం ద్వారా, మనం తీసుకునే ఆహారం, బ్యాక్టీరియా, వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలోనే ఎక్కువగా వ్యాపిస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో వర్షాలు ఎక్కువగా కురిసి నదులు, చెరువులు, వాగులు, వంకలు, కాలువల్లో నీరంతా రంగు మారుతుంది. వీటినే మనం తీసుకోవడం వల్ల మానవ శరీరంలో పేగుల యొక్క కదలికలపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతాయి.

ఇంగ్లీష్ మందులను ఇగ్నోర్ చేద్దాం..
ఇలాంటప్పుడే కొంచెం కడుపునొప్పి, ఎక్కువ సార్లు విరేచనాలు అవుతుంటాయి. క్రమంగా మన శరీరంలో అసమతుల్యత, శారీరక బలహీనత వంటి లక్షణాలు ఏర్పడటానికి కారణాలుగా మారతాయి. అతిసార వ్యాధి తీవ్రమైన స్థితి కానప్పటికీ, మీకు అసౌకర్యంగా ఉండటమే కాకుండా శరీరం పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది. అవసరమైన దాని కన్నా ఎక్కువ ఆహారాన్ని తీసుకోవటం ద్వారా, కెఫీన్, ఆల్కహాల్ వంటి అసహనానని వ్యక్తపరిచే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల డయేరియా త్వరగా అటాక్ చేస్తుంది. ఇలాంటప్పుడే మనం ఇంగ్లీష్ మందుల వైపు చూస్తుంటాం. వాటినే ఎక్కువగా వాడుతుంటాం. కానీ అలా వాటిని అంత శ్రేయస్కరం కాదు. ఆ వ్యాధి నివారణ కోసం నేచర్ లో లభించే సహజమైన పదార్థాలను వాడటం చాలా ఉత్తమం. వాటిలో డయేరియాకు అత్యంత వేగంగా చెక్ చెప్పేందుకు పనసపండు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి పనసపండు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎక్కువ మోతాదులో ఈ పండును తినకూడదు..
పనసపండు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాని ఏ, సి విటమిన్లు మాత్రం కొంత మాత్రమే ఉంటాయి. అయితే పొటాషియం, మెగ్నీషియం, పుష్కలంగా లభిస్తాయి. అయితే ఎక్కువ మోతాదులో ఈ పండును తినకూడదు. మితంగా తింటేనే అనేక లాభాలు చేకూరతాయి. మిగిలిన పండ్లతో పోలిస్తే వీటిలో లవణాలు, విటమిన్లు తక్కువ కాబట్టి జీర్ణం కావడం కొంచెం కష్టం.చిన్నపిల్లల్లో జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది కాబట్టి వారికి ఈ గింజలను కాల్చి ఇవ్వవచ్చు.

మలబద్ధకాన్ని నివారిస్తుంది..
జ్వరం, అతిసారతో బాధపడేవారు పనసతొనలు తింటే చాలా ఉపశమనం పొందవచ్చు. ఇందులో జిగురు గుణం కూడా ఉన్నందు వల్ల మలబద్ధకాన్ని సైతం నివారించవచ్చు. ఈ పనసపండులో విటమిన్ సి ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని సైతం బాగా మెరుగుపరుచొచ్చు. ఆస్తమాతో బాధపడేవారికి కూడా ఈ పండు ఎంతో ఉపయోగపడుతుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

క్యాన్సర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది..
పనసపండులో ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ వ్యాధి నిరోధకానికి బాగా సహాయపడతాయి. అంతే కాదు ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల అజీర్తి, అల్సర్ల సమస్యను కూడా నయం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.

కంటిచూపును మెరుగుపరచడంలోనూ..
ఈ పనసపండును బాగా మగ్గిన తరువాత తింటే మనో ఉల్లాసాన్ని ఇస్తుంది. అలసటను సైతం తగ్గిస్తుంది. అంతే కాదు అన్నింటికంటే ముఖ్యంగా మన కంటిచూపు మెరుగుపడేందుకు కూడా దోహదం చేస్తుంది. చర్మ, కేశ, ఆరోగ్యానికి కూడా ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మెగ్నిషీయం, కాల్షియం ఎముకల్లో ఎనర్జీని పెంచుతుంది. వీటిలోని ఖనిజ లవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి. పనసపండులోని ఐరన్, రక్తహీనత సమస్యను నివారించడంలోనూ పనికొస్తుంది. రక్తం గడ్డకట్టే సమస్యను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications