Just In
- 7 hrs ago మేషరాశిలో ఏర్పడే గజలక్ష్మీ యోగం వల్ల ఏప్రిల్ 25 నుండి ఈ 3 రాశులకి పట్టిందల్లా బంగారమే..
- 7 hrs ago ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- 8 hrs ago చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- 11 hrs ago గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
సంతులిత ఆహారం శరీరానికి అందాలంటే?
మధ్యాహ్న భోజనం తరువాత కూడ ఇదే చేయాలి. మొలకెత్తిన విత్తనాలు, ఫ్యాట్ తక్కువగా ఉండే మజ్జిగ, ఇతర మిల్క్షేక్స్, ఫ్లేవర్ మిల్క్లాంటివి తీసుకోవాలి. సాధారణంగా మహిళలు 30 ఏళ్లు, పురుషులు 35 ఏళ్లు దాటిన తరువాత బరువు పెరగడం మొదలవుతుంది. అది ఊబకాయానికి దారి తీయవచ్చు. క్రమేణా రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి సమయంలోనే తినే ఆహార పదార్ధాలను నియంత్రించుకోవాలి. బ్యాలెన్స్ తప్పితే అధిక బరువుతో బాధపడాల్సి వస్తుంది. బరువులేని వారు తగినంత బరువు పెరగాలంటే, మధ్యాహ్న భోజనంతో పాటు పాప్కార్న్, మరమరాలు, కొవ్వు పరిమాణం తక్కువగా ఉండే స్నాక్స్ తీసుకోవాలి. బేకరీ ఐటమ్స్లో మైదా ఎక్కువగా ఉంటుంది. వీటిని పిల్లలకు ఇచ్చేటాపుడు చాలా జాగ్రత్తగా వుండాలి.
వయసుపెరిగే కొద్దీ శారీరక శ్రమ తగ్గుతుంది. రక్తపోటు, షుగర్ వ్యాధి వంటివి వచ్చే అవకాశం వుంటుంది. దీంతో జీర్ణశక్తి గణనీయంగా పడిపోతుంది. ఇటువంటి సమయంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ సాయంకాలాలు తీసుకోవాలి స్నాక్స్ రూపంలో బొప్పాయి, దానిమ్మ పండ్లు, కీర దోస, క్యారెట్లు వంటివి తీసుకోవడం మేలు. ఆహారంలో విటమిన్-ఎ, మరియు సి ఉండేటట్లు చూసుకోవాలి.
ఈ రకమైన ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు. స్నాక్స్ సరైన సమయంలో తీసుకోవాలి. ఉదయం టిఫిన్ తిన్న రెండు మూడు గంటల తరువాత స్నాక్స్ తీసుకోవాలి. లంచ్ మధ్యాహ్నం పెందలకడే ముగిస్తే, 4 గంటల సమయంలో మళ్లీ స్నాక్స్ తీసుకోవచ్చు. రాత్రి 7 నుండి 8 గంటల్లోగా రాత్రిభోజనం తప్పకుండా ముగించాలి. ఈ విధంగా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది.