Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
చిరంజీవికి Covid-19 పాజిటివ్ : హోమ్ ఐసోలేషన్లో ఎన్ని రోజులుండాలి... ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి...
కరోనా వైరస్ తర్వాత హోమ్ ఐసోలేషన్లో ఉండే రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోందని.. అందరూ భావించారు. కానీ ఈ కరోనా భూతం చాప కింద నీరులా నెమ్మదిగా విస్తరిస్తోంది. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ కోవిద్-19 పాజిటివ్ వచ్చింది.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాను 'ఆచార్య' షూటింగ్ ప్రారంభించే ముందు కరోనా టెస్టులో భాగంగా పరీక్షలు చేసుకున్నానని.. అందులో పాజిటివ్ వచ్చినట్లు ఆయన ప్రకటించారు.
ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్ వచ్చింది కాబట్టి హోమ్ క్వారంటైన్ అయ్యాను. ఇటీవల సుమారు 4-5రోజులుగా నన్ను కలిసిన వారంతా కరోనా టెస్టు చేయించుకోవాలని కోరారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని కూడా తెలియజేస్తానంటూ చిరంజీవి చెప్పారు.

ఈ సందర్భంగా కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత హోమ్ ఐసోలేషన్లో ఉండేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ పద్ధతులు పాటిస్తే, మీరు కరోనా చైన్ లింకును బ్రేక్ చేయవచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రత్యేక గదిలో..
కరోనా పాజిటివ్ వచ్చిన రోగులంతా హోమ్ ఐసోలేషన్లో భాగంగా ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవాలి. ఎవరితోనూ నేరుగా సంబంధాలు పెట్టుకోరాదు. సుమారు నాలుగైదు రోజుల పాటు ఒంటరిగా గడపాలి.

ఒక సంరక్షకుడు..
కరోనా రోగి పర్యవేక్షణకు 24 గంటల పాటు ఒక సంరక్షకుడిని అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలను, సూచనలను పాటించాలి. వారు చెప్పిన విధంగా మందులను, ఆహారాన్ని తీసుకోవాలి.

మెడికల్ మాస్క్..
కరోనా సోకిన రోగులు ప్రత్యేక గదిలో ఉన్నప్పుడు ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్ ధరించాలి. ముఖ్యంగా సంరక్షకుల ముఖం, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండాలి. రోగులు ఉండే గది, ప్రాంతం పరిశుభ్రంగా ఉండా చూసుకోవాలి.

పరిశుభ్రత విషయంలో..
కరోనా రోగులు క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. మీరు తాగే నీటిని వేడి చేసుకుని.. అవి వెచ్చగా అయిన తర్వాతే తాగాలి. మీరు వాడే బట్టలు బాగా ఆరిన వాడాలి. ముఖ్యంగా తడిగా ఉండే టవ్వాళ్ల వంటి వాటిని ఉపయోగించకూడదు.

60 ఏళ్ల పైబడిన వారు..
60 ఏళ్ల వయసు దాటిన వారు రక్తపోటు(బిపి), డయాబెటిస్, గుండెజబ్బులు, శ్వాస, ఊపిరితిత్తులు, కాలేయం మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కరోనా బారినపడితే.. కచ్చితంగా డాక్టర్ల పర్మిషనత్ తోనే హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి.

ఆరోగ్యసేతు యాప్..
అయితే కరోనా రోగులంతా కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని.. అలాగే దాన్ని యాక్టివ్ గా ఉంచుకోవాలి. అలాగే, రోగితో సన్నిహితంగా ఉండేవారు ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ సలహ మేరకు హైడ్రోక్లోరోక్విన్ మెడిసిన్ ను అందుబాటులో ఉంచుకోవాలి.

ఈ లక్షణాలు కనిపిస్తే..
కరోనా రోగుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కేంద్రం సూచించింది. శ్వాస తీసుకోవడంలో ఏ మాత్రం ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలో తగ్గుదల, గుండెనొప్పి, మూర్ఛ, నీరసం, పెదవులు, ముఖంలో నీలి రంగు వంటి లక్షణాలు కనిపిస్తే, వారికి వెంటనే ట్రీట్మెంట్ అందించాలని తెలిపారు.

ఐసోలేషన్ తర్వాత..
ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉన్న కరోనా రోగులకు లక్షణాలు ఉన్నా, లేకున్నా.. సుమారు పది రోజులు గడిచిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం లేకుండా ఉంటే వారు డిశ్చార్జ్ చేసినట్లు భావించాలని తాజా మార్గదర్శకాల్లో వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే కరోనా రోగులకు హోం ఐసోలేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సిన లేదని స్పష్టం చేసింది.



Click it and Unblock the Notifications