Just In
- 56 min ago Shani Purvabhadra Nakshatra Transit: శని పూర్వాభాద్ర నక్షత్ర సంచారం: ఏప్రిల్ నుండి ఈ 3 రాశుల జీవితాలు మారుతాయి
- 4 hrs ago చరిత్రలో తొలిసారిగా సౌదీ అరేబియా మిస్ యూనివర్స్ పోటీలో మెరవనున్న మోడల్ రూమి అల్ఖహ్తానీ?ఈ అందగత్తె ఎవరో తెలుసా
- 5 hrs ago భారతదేశంలో పురాతన కాలం నుండి సత్తా చాటుతున్నఅత్యంత శక్తివంతమైన 7 రాజకీయ కుటుంబాలు..!
- 9 hrs ago పిల్లల్ని పెంచేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!
కిడ్నీలో రాళ్ళు: వంటగదిలోని ఈ పదార్థాలు చాలు కరిగించడానికి
కిడ్నీలో రాళ్ళు: వంటగదిలోని ఈ పదార్థాలు చాలు కరిగించడానికి
మానవ శరీరం ఒక స్వయం చోదక యంత్రం లాంటిది. మానవ నిర్మిత యంత్రం ఎలా వివిధ భాగాల నుండి మిగిలిని అన్ని భాగాలను ఆధారంగా పనిచేస్తుంది. ఈ యంత్రం దాని స్వంత పనులను కలిగి ఉన్నట్లే ఇది ఎముకతో నిండిన మనిషి శరీరంమనే యంత్రాన్ని సమగ్రంగా మరియు విజయవంతంగా ఆపరేట్ చేయడానికి సహాయపడుతుంది. శ్వాస కోసం ఊపిరితిత్తులు, పని కోసం చేతులు, నడక కోసం కాళ్ళు, జ్ఝాపకశక్తికి కోసం మెదడు, రక్త కదలికకు గుండె, చూడటానికి కళ్ళు మొదలైనవి వాటికి మరిన్ని అవయవాలు తనలో చేర్చుకోబడినవి. మరియు ఆ అవయవాలు ఉండే వరకు వాటి పనితీరును చక్కగా నిర్వహిస్తాయి. ఒక అవయవం తన పనిని తాను చేయడానికి సంకోచించినప్పుడల్లా ప్రభావం మొత్తం శరీరంపై ఉంటుంది.
ఈ రోజు మనం మాట్లాడబోయేది ఏమిటంటే మూత్రపిండాలు. మూత్రపిండాలు శరీరంలో అతి ముఖ్యమైన అవయవం మరియు మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవంగా పిలిచే ఈ కిడ్నీలు శరీరంలోని ముఖ్యంగా రక్తంలోని మలినాలను శుద్ది చేయడానికి వాటిని బహిర్గతం చేయడం ద్వారా మొత్తం శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. మానవ నిర్మిత యంత్రాలు ఎప్పటికప్పుడు వాటి సామర్థ్యాన్ని కాపాడుకునే విధంగా మన శరీరం యొక్క అంతర్నిర్మిత అవయవాల రక్షణకు కూడా మనము బాధ్యత వహిస్తాము. మన అవయవాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో మనందరికీ తెలుసు. మన మొత్తం ఆరోగ్యం కోసం రోజుకు ఇరవై నాలుగు గంటలు మన శరీర అంతర్గత అవయవాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి? ఇది ఇబ్బందికరమైన ప్రశ్నే అయినా చింతించకండి . ఈ వ్యాసంలో మేము మీకు చెప్పబోయే విషయమేమిటంటే మీరు ఎల్లప్పుడూ ఆసుపత్రి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోలో ముఖ్యంగా మన వంటగదిలో మనకు లభించే పదార్థాలతోటే మన అంతర్గత అవయవాలను శుభ్రంగా ఉంచుకోవచ్చు.
కిడ్నీ స్టోన్స్ సమస్యను సాధారణ హోం రెమెడీస్తో ఎలా పరిష్కరించగలరు?
ఎల్లప్పుడూ సమర్థవంతంగా పనిచేస్తున్న మన మూత్రపిండాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? మొదటి మరియు అతి ముఖ్యమైన సమస్య మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటం. అవును మూత్రపిండాలలో రాళ్ళు ఉత్పత్తి అవుతాయి మరియు ఇవి చాలా సమస్యలకు దారితీస్తాయి. ఈ రకమైన సమస్యలు మనం అనుకున్నదానికంటే ఎక్కువగా కనిపిస్తాయి. నేషనల్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సెంటర్ (NCBI)అభిప్రాయం ప్రకారం మొత్తం భారతీయ జనాభాలో మూడింట ఒక వంతు సుమారు 12% మందికి ఈ సమస్య ఉంది మరియు వారిలో 50% మందికి ఈ సమస్య ఉందని ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే వీరికి అలాంటి ఏ చిన్న సూచనలు కనబడలేదు. కిడ్నీలో రాళ్ళు వీరికి పెద్ద సమస్యగా ఉంటాయి మరియు చికిత్స చేయకపోతే మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.
కిడ్నీ రాళ్ళు అంటే ఏమిటి?
కిడ్నీలో రాళ్ళు , మూత్రపిండాలలో ఏర్పడే ఒక రకమైన కఠినమైన పదార్థం. ఇవి బయట నుండి వచ్చి చేరిన పదార్థం కాదు. మన ప్రతి నిత్యం సేవించే లవణాలు మరియు ఖనిజాల యొక్క "కాల్షియం ఆక్సలేట్" అనే పదార్థమే ఇలా ఘన రూపంలోకి మార్చబడతాయి. ఈ ఖనిజ లవణాలు మూత్ర నాళాల్లో చేరి మలినాలను మూత్రపిండాల నుండి విడుదల చేయకుండా అడ్డుకుంటాయి. ఇది మన శరీరానికి చాలా బాధను కలిగిస్తుంది మరియు అనారోగ్యాలు మొదలవుతాయి. మూత్రపిండాళ్లోని రాళ్ళు మూత్రాశయం గుండా వెళ్ళాలి మరియు బయటకు వెళ్ళేటప్పుడు చాలా బాధాకరంగా ఉంటాయి. మూత్రపిండంలో కనిపించే ఈ రకమైన రాళ్లను వైద్య భాషలో "కాల్సీ" లేదా "యురోలిథియాసిస్" పిలవబడుతుంది.
మూత్రపిండంలో రాళ్ల ఉత్పత్తికి ప్రధాన కారణం ఏమిటో మీకు తెలుసా?
మన శరీరం రక్తం మరియు నీటితో నిండి ఉంటుంది. రెండూ ద్రవ రూపం కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఉప్పు మరియు ఖనిజాల సమ్మేళనాలు త్వరగా జీర్ణమవుతాయి మరియు మిగిలిన మలినాలు మూత్ర మార్గము గుండా వెళతాయి. అందరిలోనూ ఇదే ప్రక్రియ జరుగుతుంది. మనిషి నీటి తీసుకోవడం తగ్గించినప్పుడు ఉప్పు మరియు ఖనిజాల సమ్మేళనాలు దగ్గరకు వచ్చి కొన్నిసార్లు కలిసి ఉండి మూత్రపిండాలలో (కిడ్నీలలో)ఘనరూపంగా ఏర్పడతాయి. వీటిని కిడ్నీ స్టోన్స్ అని పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో చిన్న రాళ్ళు ఎటువంటి లక్షణాలను చూపించకుండా శరీరం నుండి బయటకు వచ్చేస్తాయి. అయితే కొన్నిసార్లు పెద్ద రాళ్ళు మూత్రపిండాలను వదలకుండా బాధాకరంగా ఉంటాయి.
కాబట్టి మూత్రపిండాల్లో రాళ్లకు ఎలాంటి చికిత్స ఇస్తారు?
మూత్రపిండాలలో రాళ్ళు ఉన్నాయని మీకు తెలిసిన వెంటనే ఒక్కసారిగా గుండె జల్లు మంటది. ఎందుకంటే మీరు ఎప్పుడూ విననటువంటి ఒక భయంకరమైన విషయం కాబట్టి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మనిషి ఎంత ధైర్యంగా అంటాడో అంతే వీలైనంత త్వరగా సమస్యను నయం చేసుకోవచ్చని వైద్యులు చెబుతుాన్నారు. మొదట ఈ విషయం గురించి వైద్యులు మీతో చెప్పినప్పుడు భయపడకూడదు. ముఖ్యంగా నేటి ఆధునిక యుగంలో చికిత్సకు కొరతేముంది? మూత్రపిండాల్లో రాళ్లను సులభంగా కరిగించే ద్రవరూపంలోని మందులు ఇప్పటికే కనుగొనబడ్డాయి. ఈ విషయంలో హోమియోపతి నివారణలు కూడా బాగా పనిచేస్తాయి. మీరు ఆహారం మార్పులు చేసుకుంటే ఈ సమస్య ఏర్పడకుండా నిరోధించవచ్చు.
మీరు ప్రతి రోజూ తాగే నీరు మీ మూత్రపిండాల(కిడ్నీల)ఆరోగ్యాన్నికాపాడుతుంది..
మనిషి జీవితానికి అవసరమైన పదార్థాలలో నీరు ఒకటి మరియు అందరికీ సులభంగా లభిస్తుంది. అందుకే మనిషి ఎంత ఎక్కువ నీరు సేవిస్తే అంత మంచిది. శరీరం లోపలి జీర్ణక్రియ సరిగా పనిచేస్తుంది మరియు మన ఆహారంలో తీసుకునే విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు మన శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటాయి. 12 గ్లాసుల నీరు తీసుకోవడం ఆరోగ్యానికి ఉత్తమ పరిష్కారం. నీరు ఎక్కువగా తాగడం వల్ల మన మూత్రనాళాల్లో ఉన్న అతి చిన్న రాళ్ళను విజవయంతంగా బయటకు విసర్జించపబడేలా చేస్తుంది.
నిమ్మరసం లేదా లెమన్ జ్యూస్ మీ మూత్రపిండాల ఆరోగ్యానికి రక్షక కవచం
అవును నిమ్మరసం నిజంగా మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారికి రామ బాణం. నిమ్మకాయలోని "సిట్రేట్" కంటెంట్ మన శరీరంలో కాల్షియం ఖనిజ గట్టిపడటాన్ని సులభంగా నిరోధిస్తుంది. అందువల్ల మీరు అల్పాహారం ముందు ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నిమ్మరసం తాగడం ప్రాక్టీస్ చేస్తే మీరు కిడ్నీ స్టోన్స్ సమస్యను నివారించవచ్చు.
తులసీ దళాలు లేదా తులసి మొక్క నుండి సేకరించిన ఆకులు మీ మూత్రపిండాలకు మంచి స్నేహితుడు
తులసి ఆకులోని కొన్ని పదార్థాలు మన శరీరంలోని "యూరిక్ యాసిడ్" ను స్థిరీకరించడంలో విజయవంతమయ్యాయని కొన్నిపరిశోధనలలో కనుగొన్నారు. యూరిక్ యాసిడ్ స్థాయిలు స్థిరంగా ఉంటే మూత్రపిండాలలో రాళ్ల నిర్మాణం తగ్గుతుంది. విషపూరిత ఆకులోని కొన్ని అంశాలు మన శరీరం యొక్క "యూరిక్ యాసిడ్" స్థాయిలను స్థిరీకరించగలిగాయని భౌతిక పరిశోధనలో తేలింది. యూరిక్ యాసిడ్ స్థాయిలు స్థిరంగా ఉన్నప్పుడు, మూత్రపిండాలలో రాళ్ల నిర్మాణం తగ్గుతుంది. తులసి ఆకులలో "ఎసిటిక్ యాసిడ్" కంటెంట్ ఉన్నందున మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో ఇది గొప్ప పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ ఒక టీస్పూన్ తులసి రసం తినడం వల్ల మీ కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీ ఇంటిల్లిపాదికి డాక్టర్ ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ లోని "ఎసిటిక్ యాసిడ్" కంటెంట్ తులసి ఆకుతో సమానంగా ఉంటుంది. మీరు భోజనానికి ముందు ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటితో కలిపి సేవిస్తే మీకు కిడ్నీలో రాళ్ళు ఉంటే శరీరంలో చాలా త్వరగా కరిగిపోయేలా చేస్తుంది.
వీట్గ్రాస్ రసం లేదా గోధుమ గడ్డి రసం
గోధుమలు మనిషి ఆరోగ్యాన్ని కాపాడుటలో గతంలో నుండే తనదైన లక్షణాన్ని కొనసాగిస్తూ వస్తోంది. డయాబెటిస్ ఉన్నవారికి గోధుమ పిండి వాడటం వలె గోధుమ గడ్డి మూత్రపిండాల రాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. అటువంటి సమస్యకు పిల్ లేదా పౌడర్ బదులు గోధుమ గడ్డి రసం తీసుకుంటే, మూత్రంలో రాళ్ళు చాలా త్వరగా కరిగిపోతాయి. గోధుమ గడ్డిలో "యాంటీఆక్సిడెంట్లు" ఉండటం మూత్ర నాళంలో మూత్రపిండాల్లో రాళ్ళు పేరుకుపోవడాన్ని పూర్తిగా నిరోధిస్తుంది. చూశారుగా !!! మన ఇంట్లో మనకు అవసరమైన వెంటనే ఏఏ వైద్యులు ఉన్నారో. అందుకే పై సూచించిన ఆహారపదార్థాలన్నింటినీ తినండి మరియు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.