Latest Updates
-
కార్మిక లోకానికి పాదాభివందనం..మే డే విషెస్ ను ఇలా అందంగా చెప్పుకోండి! -
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు?
జాతీయ నేత్ర దాన దినోత్సవం 2019: చరిత్ర మరియు ప్రాముఖ్యత
ఇందుకు అనేక కారణాలున్నట్లు మనకు తెలుస్తోంది. పోషకాహార లోపం లేదా జననేంద్రియ సమస్యలు కావచ్చు. కానీ వీటన్నిటికంటే నేత్ర దాతల సంఖ్య చాలా పరిమితంగా ఉంటోంది.
కళ్లు.. అవి లేకపోతే ఈ అందమైన భూ ప్రపంచాన్ని ఎవ్వరూ చూడలేరు. ఆ కళ్లు తెరిస్తేనే మనకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనేది తెలుస్తుంది. అదే కళ్లే లేకపోతే అంతా చీకటి. పగలైనా, ఉదయమైనా మనది మొత్తం చీకటి ప్రపంచమే. అంతటి ప్రాధాన్యమున్న కంటి దినోత్సవ వేడుకలు ఈ ఆగస్టు 25వ తేదీ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. నేత్ర దానం చేసే చర్యను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
నేత్ర దానంపై మనలో చాలా మందికి అవగాహన లేదు. మనం మరణించాక మన కళ్లను దానం చేస్తే అది వేరొకరి జీవితానికి వెలుగు ఇస్తుంది. అంతేకాదు మీరు చనిపోయిన కూడా మీ కళ్లతో ఈ అందమైన ప్రపంచాన్ని మళ్లీ చూసే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి విషయాలను ప్రజలలో అవగాహన కల్పించేందుకు, ఈ పదిహేను రోజులు భారతదేశంలో వివిధ ప్రదేశాలలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి.

ప్రజలు నేత్రదానం చేయాలనే ఆలోచనను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వమే ఈ డ్రైవ్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ చేసింది. "దానం చేసిన మానవ కళ్లు కార్నియల్ మార్పిడి ద్వారా చూపును కాపాడటానికి, పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ఇందుకు చేయూత నివ్వండి" అని కోరింది.
భారతదేశంలో నాలుగు మిలియన్ల మందికి పైగా ప్రజలు కంటికి సంబంధించిన రుగ్మతులు, కంటిచూపు లేకుండా బాధపడుతున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు, నేత్రదానం చాలా తక్కువగా ఉంటోంది. కంటిచూపు లేని వారిలో వంద మందిలో ఒకరు మాత్రమే నేత్ర దానం ద్వారా చూపును పొందుతున్నారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ గ్యాప్ ను తగ్గించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం మన దేశంలోని ఆసుపత్రులలో 20 వేల అంధత్వ కేసులు నమోదవుతున్నాయి.
ఇందుకు అనేక కారణాలున్నట్లు మనకు తెలుస్తోంది. పోషకాహార లోపం లేదా జననేంద్రియ సమస్యలు కావచ్చు. కానీ వీటన్నిటికంటే నేత్ర దాతల సంఖ్య చాలా పరిమితంగా ఉంటోంది. ఇది కూడా దేశంలో అంధత్వాన్ని నియంత్రించేందుకు చాలా కష్టమవుతోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications