Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
Maternal Mortality Ratio Drops: దేశంలో 130 నుండి 97కు తగ్గిన మాతాశిశు మరణాల నిష్పత్తి
భారత దేశంలో మాతాశిశు మరణాల నిష్పత్తి తగ్గింది. ఈ మరణాల నిష్పత్తి 130 నుండి 97కు పడిపోయింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ 2018-2020లో మాతాశిశు మరణాల నిష్పత్తి 97కు పడిపోయింది.
Maternal Mortality Ratio Drops: భారత దేశంలో మాతాశిశు మరణాల నిష్పత్తి తగ్గింది. ఈ మరణాల నిష్పత్తి 130 నుండి 97కు పడిపోయింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ 2018-2020లో మాతాశిశు మరణాల నిష్పత్తి 97కు పడిపోయింది. ఈ నిష్పత్తి 2014-2016 లో లక్షకు 130 ఉండగా.. అది ఇప్పుడు 97కు తగ్గడం విశేషం. 2018-2020 మధ్య కాలంలో దేశంలోని ప్రసూతి మరణాల స్థాయిని పేర్కొంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల వల్లే మాతా శిశు మరణాలు తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
ఒక ప్రాంతంలో మాతా శిశు మరణాలు ఆ ప్రాంతంలోని స్త్రీల పునరుత్పత్తి ఆరోగ్యానికి కొలమానంగా భావిస్తారు. పునరుత్పత్తి వయస్సు గల చాలా మంది మహిళలు గర్భం, ప్రసవం లేదా అబార్షన్ సమయంలో అలాగే తర్వాత సమస్యల కారణంగా మరణాలు సంభవిస్తాయి. ప్రసూతి మరణం అనేది గర్భవతిగా ఉన్నప్పుడు లేదా ప్రసవం అయినా 42 రోజుల్లోపు, గర్భం, దాని నిర్వహణలో లోపాల వల్ల జరిగే మరణాన్ని ప్రసూతి మరణంగా నమోదు చేస్తారు. అయితే ప్రమాదవశాత్తు లేదా యాదృచ్ఛిక కారణాల వల్ల సంభవించే మరణాన్ని ప్రసూతి మరణంగా పేర్కొనడం లేదు.

ఐక్యరాజ్య సమితి నిర్దేశించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 3.1 ప్రపంచ ప్రసూతి మరణాల నిష్పత్తిని లక్షా సజీవ జననాలకు 70 కంటే తక్కువకు తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం, జనాభా గణనను నిర్వహించడం, దేశంలో జనన మరణాల నమోదు చట్టం అములును పర్యవేక్షించడంతో పాటు, నమూనా నమోదు వ్యవస్థను ఉపయోగించి సంతానోత్పత్తి మరియు మరణాలపై అంచనాలను అందిస్తోంది.



Click it and Unblock the Notifications











