Just In
- 2 hrs ago Lazy Husband Signs: 4 సోమరిపోతు రాశులు, వీరిని పెళ్ళి చేసుకుంటే సంకనాకిపోతారు..అంతే..ఒక్కపనికి పనికిరారు
- 4 hrs ago పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- 6 hrs ago ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- 7 hrs ago మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
కరోనాపై పోరుకు మూడేళ్ల చిన్నారి ఔదార్యం... ముంబైకి చెందిన మూడేళ్ల చిన్నారి రూ.50 వేళ విరాళం...
ముంబై పోలీసులకు 50 వేల రూపాయలను విరాళంగా ఇచ్చాడు.. అయితే ఆ డబ్బులు ఎలా జమ చేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
మందు లేని మాయ రోగం.. ఆధునిక లాక్ డౌన్ పద్మవ్యూహం.. కనబడని కరోనా భూతం.. ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలో పడేసిన సంగతి తెలిసిందే. మన దేశంలో లాక్ డౌన్ విధించినప్పటికీ తాజాగా కరోనా కేసులు లక్ష మార్కును దాటేశాయి. వేలాది మంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోయారు. అయితే లాక్ డౌన్ కారణంగా వలస కూలీలతో పాటు ప్రతి ఒక్కరూ కష్టాల కడలిని ఎదురీదుతున్నారు. నిలువ నీడ లేక, తినడానికి తిండి లేక, స్వర్ణ చతుర్భుజి రోడ్లపై రక్త మాంసాలతో నడుస్తూ.. అష్టకష్టాలు పడుతూ సొంతూళ్లకు చేరుకుంటున్నారు.
ఇలాంటి వాటిని చూసి ప్రతి ఒక్కరూ సానుభూతి చూపుతున్నారు తప్ప.. సహాయం చేయలేకపోతున్నారు.. కానీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు మరికొందరు.. అయితే ఇలాంటి సంఘటనలను చూసిన మూడేళ్ల కుర్రాడు చలించిపోయాడు. అయితే అందరిలా తను ఊరికే ఉండలేదు. తన వంతుగా 50 వేల రూపాయల విరాళాన్ని ముంబై పోలీసులకు అందజేశాడు. అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. అయితే ఆ పిల్లాడు ఆ డబ్బును ఎలా జమ చేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ముంబైలో తీవ్రంగా...
మన దేశంలో కరోనా వైరస్ కేసులు తాజాగా లక్ష మార్కును దాటగా.. అందులో అత్యధిక కేసులు మహారాష్ట్రలోని ముంబై ప్రాంతంలోనివే. రోజురోజుకు COVID-19 రోగులు పెరుగుతూ ఉండటంతో చాలా మంది ఇంట్లో ఉండటం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది.
కరోనా రోగులకు అండగా..
ఇలాంటి సమయంలో దిగాలుగా ఉన్న కరోనా రోగులకు అండగా.. కరోనా వైరస్ కు పోరాడుతున్న వారి కోసం.. వలసకూలీలు మరియు ఇతరుల సహాయం కోసం ఓ మూడేళ్ల పసిబిడ్డ ఔదార్యం చూపాడు.
రూ.50 వేల విరాళం..
ముంబైకి చెందిన మూడేళ్ల కబీర్ జైన్ ముంబై పోలీసులకు 50 వేల రూపాయలను విరాళం ఇచ్చాడు. ఈ బాలుడు తన తల్లి కరిష్మా, తండ్రి కేశవ్ కలిసి వెళ్లాడు. అయితే ఇంత చిన్న వయసులో అంత డబ్బు ఎలా సంపాదించాడంటే..
స్నేహితుడి సలహా
కబీర్ తన తల్లి నుండి బుట్ట కేకులు మరియు మఫిన్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. అప్పటికే ఆమెకు ఒక తల్లితో ఎన్జీఓతో సంబంధం కలిగి ఉంది. లండన్ లో ఉన్న ఒక స్నేహితుడి సలహాను పాటించారు.
ఇరుగు పొరుగు వారికి..
బుట్టకేకులు మరియు మఫిన్లు సిద్ధమైన తర్వాత, వాటిని ఇరుగుపొరుగు వారికి మరియు ప్రియమైన వారికి పంపించారు. కబీర్ ద్వారా నిధులను సేకరించే లక్ష్యం గురించి వారికి వివరించారు. ఈ బుట్టకేకులు మరియు మఫిన్లకు ధరనకు కూడా నిర్ణయించలేదు. వారికి తోచినంత ఇవ్వమని మాత్రమే కోరారు.
లక్ష వారి లక్ష్యంగా..
అయితే వారు మొదట్లో పది వేల రూపాయలు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వారు దానిని 35 వేల రూపాయల వరకు పెంచగలిగారు. అయితే వారి పిల్లాడు పొదుపు చేసిన మొత్తం సొమ్మును కలిపితే 50 వేల రూపాయల వరకు పోగయ్యింది. దాన్ని లక్ష రూపాయలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అంతలోపు 50 వేల రూపాయలను పోలీసులకు తమ పిల్లాడితో విరాళాంగా అందజేశారు.
మన తెలుగు పిల్లాడు కూడా..
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హేమంత్ అనే ఓ బాలుడు సైకిల్ కొనుక్కొనేందుకు దాచుకున్న డబ్బును మంత్రి పేర్ని నానికి విరాళంగా ఇచ్చాడు. తను హుండీలో దాచుకున్న 971 రూపాయల సొమ్మును ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నాడు.