Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క మహిళను కూడా చూడలేదు
ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క మహిళను కూడా చూడలేదు.నమ్మశక్యం గా లేకపోయినా ఇది నిజం.
ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క మహిళను కూడా చూడలేదు. నమ్మశక్యం గా లేకపోయినా ఇది నిజం.
82 యేళ్ళ వయసుకలిగిన మిహైలో తొలోట్టి అనే ఈ వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క మహిళను కూడా చూడలేదని, అసలు మహిళ ఈ గ్రహంమీద ఉన్నదన్న విషయమే తనకు తెలీదు అని అంటారు.

నమ్మశక్యంగా లేకపోయినా కూడా, అతని జీవితంలో జరిగిన పరిణామాలు తెలిస్తే విస్మయానికి గురవడం మనవంతు అవుతుంది.
మిహైలో తొలోట్టి., ఈ వ్యక్తి ప్రపంచానికి ఎంత దూరమో, ప్రపంచానికి కూడా ఈ వ్యక్తి అంతే దూరం. ఈ వ్యక్తి గురించిన ఆశ్చర్యకరమైన కథను తెలుసుకుందాం.

ఇతను ఒక గ్రీకు సనాతన సన్యాసి:
మిహైలో తొలోట్టి, ఒక గ్రీకు సనాతన సన్యాసి, తన 82 యేళ్ళ వయసులో 1938 లో మరణించాడు. మరియు ఇతని జీవితకాలంలో మహిళ ఎలాఉంటుందో కూడా తెలీకుండా బ్రతికాడు. ఊహకి కూడా అందని ఈ వింత నిజం.

చరిత్ర ప్రకారం:
చరిత్ర ప్రకారం ఇతను తన నాలుగేళ్ల వయసులోనే 1856 లోనే తల్లిని కోల్పోయాడు. ఎవ్వరూ దరికి చేరనీయని పక్షంలో ఇతను అథోస్ పర్వతం మీద ఉన్న ఆశ్రమం కడకు చేరుకున్నాడు.

ఆశ్రమం ఇతన్ని దత్తత తీసుకుంది :
ఆశ్రమంలోని, మైకేల్ టోలొటోస్ అనే సన్యాసి ఇతన్ని దత్తత తీసుకుని ఆదరించాడు. ఆ తర్వాత అతని జీవితకాలంలో ఆ ఆశ్రమం ద్వారాలు దాటి అతను బయటకి వెళ్లలేదు.

ఒక చట్టం కూడా కారణం :
Image Source: Flickr
నిజానికి 1060 లొ మహిళలు, పిల్లలు కొండ ఎక్కరాదన్న చట్టం చేయబడింది. ఇప్పటికీ ఆ చట్టాన్ని పాటిస్తున్నారంటే ఎంతగా ప్రభావితం చేసిందో తెలుస్తూనే ఉంది. ఆ చట్టం కారణంగా ఏ ఇతరమహిళా ఆ కొండను ఎక్కే ప్రయత్నం కూడా చేయలేదు. తద్వారా ఇతను మహిళను చూసే అవకాశమే లేకుండా పోయింది.

మగవారికి మాత్రమే అనుమతి:
Image Source: Flickr
ఈ అథోస్ పర్వతం నందు కేవలం మగవారికి మాత్రమే అనుమతి ఉంటుంది, ఆఖరికి పర్యాటకులు కూడా మగవారు మాత్రమే ప్రవేశించే విధంగా చట్టం ఉంటుంది. మరియు ఇక్కడ సన్యాసులు షేవింగ్, స్నానం, యుద్దాలకు కూడా అనుమతించబడరు. కనీసం వీరిని ఆ ఆశ్రమం గురించిన వివరాలు కూడా అడగకూడదన్న నిషేదాజ్ఞలు ఉంటాయి.
తద్వారా మిహైలో తొలోట్టి కి మహిళల గురించిన విషయాలే తెలీకుండా అతని జీవితకాలం గడిచిపోయింది.



Click it and Unblock the Notifications











