Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
అనగనగా ఓ మంచి దొంగ... తాను దొంగిలించిన బైక్ పార్సిల్ ద్వారా ఓనర్ కు అప్పగింత...
కరోనా లాక్ డౌన్ కారణంగా తన ఊరికి వెళ్లడానికి బైక్ దొంగిలించిన దొంగ, తిరిగి బైక్ ఓనర్ పార్సిల్ చేశాడు.
నేటి తరం దొంగలు బాగా అప్ డేట్ అయ్యారు. ఇంతకుముందు మాదిరిగా రాత్రి వేళల్లో కాకుండా ఇప్పుడు పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. అది కూడా నిత్యం రద్దీగా ఉండే జనసాంద్రత వంటి ప్రాంతంలో అని మనం నిత్యం ఏదో ఒక న్యూస్ ఛానెల్ లో లేదా న్యూస్ పేపర్లలో వార్తలను చూస్తుంటాం.

అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దొంగలకు పని లేకుండా పోయింది. కోవిద్-19 దెబ్బకు దొంగతనాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఈ కరోనా మహమ్మారి దొంగలను కూడా బాగా కట్టడి చేసింది. ఇదిలా ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే.

దొంగలా మారిన వలస కూలీ..
ముఖ్యంగా వలస కూలీలు తమ సొంత ఊళ్లకు చేరేందుకు పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు. వారి బాధలు వర్ణనాతీతం. అయితే ఇటీవలే తన సొంతూరిని వెళ్లేందు ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సునే దొంగిలించాడు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అనంతపురం జిల్లాలోనే కొన్ని గంటల వ్యవధిలోనే దొరికిపోయాడు. అయితే తాజాగా మరో తన సొంతూరికి వెళ్లేందుకు బైక్ దొంగగా మారిపోయాడు.

సొంతూరికి వెళ్లేందుకు
ఓ వ్యక్తి కరోనా లాక్ డౌన్ కారణంగా తన సొంత ఊరికి వెళ్లేందుకు ఓ బైక్ ను దొంగిలించాడు. అదే బైక్ లో తన భార్య, పిల్లలతో కిలిసి 200 కిలోమీటర్లు ప్రయాణించి సొంత ఊరికి చేరుకున్నాడు.

తమిళనాడులో
ఆ తర్వాత ఎంచక్కా ఆ బైక్ ను వాడుకోకుండా ఆ దొంగ ఆ బైక్ ను పార్సిల్ ఆఫీసుకు వెళ్లి తను ఎక్కడి నుండి దాన్ని తీసుకొచ్చాడో అక్కడికే పంపాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అంటే ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపుల వల్ల అన్ని కార్యాలయాలు, ఆఫీసులు ఓపెన్ కావడంతో, ఓ పార్సిల్ ఆఫీసులో ఆ బైక్ ను బుక్ చేశాడు. ఎట్టకేలకు ఆ బైక్ ను తన ఓనర్ కు అందేలా చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసింది.

దొంగను అభినందించిన ఓనర్..
అంతకుముందు కోయంబత్తూరు నగరంలోని పల్లపాలాయం ప్రాంతంలో మే నెల 18వ తేదీన తన షాపు ముందు పార్క్ చేసిన బైక్ ను ఎవరో దొంగిలించారని సురేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అకస్మాత్తుగా 15 రోజుల తర్వాత సురేష్ కు ఓ పార్సిల్ ఏజెన్సీ నుండి పార్సిల్ వచ్చిందంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ పార్సిల్ లో దొంగిలించబడిన బైక్ ను చూసి సురేష్ ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే 1400 రూపాయలు ఆ పార్సిల్ ఏజెంటుకు చెల్లించి తన బైక్ ను తీసుకున్నాడు. ఎవరో వలస కార్మికుడు ఈ బైక్ ను చోరీ చేసి ఉంటాడని, తన సొంతూరికి వెళ్లాక, దాన్ని తిరిగి పార్సిల్ ద్వారా పంపించాడని సురేష్ చెప్పారు.
ఇదిలా ఉండగా ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు. బైక్ చోరీ చేసి తిరిగి ఇచ్చిన మంచి దొంగను సురేష్ అభినందించడం విశేషం.



Click it and Unblock the Notifications











