బంగారం, వెండి ధరలు భారీగా పతనం.. బడ్జెట్ ముందు సామాన్యులకు పండగే పండగ..

By Borra Hazarathaiah

ఫిబ్రవరి 1 ఆదివారం నిర్వహించిన ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌లో భారత బులియన్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. బడ్జెట్ 2026కు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామంలో MCX బంగారం, వెండి ఫ్యూచర్స్ రెండూ 9 శాతం కంటే ఎక్కువగా పతనమయ్యాయి. ఈ పతనంతో బంగారం ధర 10 గ్రాములకు రూ.1.40 లక్షల కీలక స్థాయికి దిగువకు జారింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ స్పాట్ గోల్డ్ తీవ్ర ఒత్తిడికి లోనై 8 శాతానికి పైగా పడిపోయి 5 వేల డాలర్ల మార్కును కోల్పోయి 4,880 డాలర్ల మధ్య ట్రేడైంది.

ఈ అకస్మాత్తు పతనానికి ప్రధాన కారణంగా భారీ లాభాల బుకింగ్ ను విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇటీవల నెలలుగా Gold, వెండి ధరలు రికార్డు స్థాయిలకు చేరడంతో పెట్టుబడిదారులు లాభాలను సాకారం చేసుకునేందుకు అమ్మకాలకు దిగారు. దేశీయంగా Gold రూ.1.7 లక్షల స్థాయికి, వెండి రూ.4.4 లక్షల మార్క్‌కు చేరుకోవడంతో మార్కెట్ ఓవర్‌బాట్ పరిస్థితుల్లోకి వెళ్లిందన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ పతనం ఒక ఆరోగ్యకరమైన దిద్దుబాటేనని.. దీర్ఘకాలిక ధోరణి ఇప్పటికీ బుల్లిష్‌గానే ఉందని నిపుణులు చెబుతున్నారు.


Gold price today Silver price today Gold silver rates crash MCX gold fall MCX silver fall Gold silver prices February 1 Gold silver crash 9 percent Budget 2026 gold silver Customs duty cut gold GST cut on gold silver Bullion market today Precious metals crash Gold silver MCX news Budget impact on gold prices India gold silver rates Gold silver market volatility MCX MCX 1 2026

గత ఒక సంవత్సరాన్ని పరిశీలిస్తే.. బంగారం ధరలు భారత్‌లో 90 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ సుమారు 75 శాతం, వెండి అయితే ఏకంగా 170 శాతం పైగా రాబడిని ఇచ్చాయి. ఈ భారీ ర్యాలీ తర్వాత వచ్చిన అమ్మకాల ఒత్తిడి మార్కెట్‌ను కొంత చల్లబరచిందని భావిస్తున్నారు.

దేశీయంగా ఫిబ్రవరి గడువు ముగిసే MCX గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఈ కథనం రాసే సమయానికి రూ.9,600కు పైగా తగ్గి రూ.1.40 లక్షల సమీపంలో ట్రేడవుతోంది. ఇంట్రాడేలో ఇది రూ.1,36,000 స్థాయికి దగ్గరగా పడిపోయింది. ఏప్రిల్ గడువు ముగిసే గోల్డ్ కాంట్రాక్ట్ కూడా ఇదే తరహాలో 9 శాతం పతనమై రూ.1,38,000 స్థాయికి చేరుకుంది.

ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ అభిప్రాయం ప్రకారం.. MCX గోల్డ్ రూ.1.80 లక్షల మధ్య నుంచి వేగంగా కిందికి జారింది. ఇది ఇటీవలి పారబాలిక్ ర్యాలీ తర్వాత వచ్చిన ట్రెండ్ అలసటను సూచిస్తుందని ఆయన తెలిపారు. దీర్ఘకాలిక దృష్టిలో బంగారం బలంగానే ఉన్నప్పటికీ, సమీపకాలంలో అస్థిరత కొనసాగవచ్చని హెచ్చరించారు.

బంగారం, వెండి ధరలు మెగా క్రాష్.. ర్యాలీ కథ కంచికి.. కొనుగోలుపై కీలక సూచన చేస్తున్న ఆర్థిక నిపుణులు..

వెండి విషయానికి వస్తే పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. మార్చి గడువు ముగిసే MCX వెండి ధర ఒకే రోజులో సుమారు రూ.26,000 తగ్గి కిలోకు రూ.2.65 లక్షల స్థాయికి పడిపోయింది. మే కాంట్రాక్ట్ కూడా ఇదే తరహాలో 9 శాతం నష్టపోయింది. ఇటీవల రూ.4.20 లక్షల రికార్డు స్థాయిని తాకిన వెండి, ఆ తర్వాత తీవ్రమైన తిరోగమనాన్ని ఎదుర్కొంటోందని నిపుణులు చెబుతున్నారు.

మీ ఏరియాలో బంగారం ధరలు ఈ లింక్ ద్వారా తెలుసుకోండి

ఇక ముందున్న కీలక అంశం కేంద్ర బడ్జెట్ 2026. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ తగ్గింపుపై మార్కెట్ పెద్ద అంచనాలు పెట్టుకుంది. జీఎస్టీని 3 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గించాలని ఆభరణాల పరిశ్రమ ప్రతిపాదిస్తోంది. గతంలోనూ ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించిన ఉదాహరణలు ఉండటంతో, ఈసారి కూడా అలాంటి నిర్ణయాలు రావచ్చన్న ఆశలు ఉన్నాయి.

క్లుప్తంగా చెప్పాలంటే.. ప్రస్తుత పతనం తాత్కాలిక దిద్దుబాటుగా కనిపిస్తున్నప్పటికీ, బడ్జెట్ నిర్ణయాలపై ఆధారపడి బంగారం, వెండి ధరల దిశ మరోసారి మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Credit: Goodreturns

Desktop Bottom Promotion