Latest Updates
-
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఇంట్లో ఉండే వాటితోనే.. మడత కాజాని మించిన రుచితో సూపర్ స్వీట్!
ఎప్పుడూ ఓకే రకమైన స్వీట్లు తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే మీ ఇంట్లో కప్పు గోధుమ పిండి ఉంటే ఓ అద్భుతమైన స్వీట్ రెడీ చేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది.
దీని తయారీకి ఎక్కువ సమయం పట్టదు. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీ జ్యూసీగా టేస్ట్ భలే ఉంటాయి. ఈ స్వీట్ ని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-గోధుమ పిండి
-మైదా పిండి
-చక్కెర
-నూనె
-యాలకల పొడి
-నెయ్యి
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో అర కప్పు మైదా పిండి, అర కప్పు గోధుమ పిండి వేసి ఇందులోనే చిటికెడు ఉప్పు వేసి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్నాక గిన్నెపై మూతపెట్టి దీనిని పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1కప్పు చక్కెర, 1కప్పు నీళ్లు పోసి చక్కెర పూర్తిగా కరిగేదాకా మరిగించాక ఇందులో అర టీస్పూన్ యాలకల పొడి వేసి కలిపి గులాబ్ జామ్ కి పాకం ఎలా చేసుకుంటామో అలా అయ్యాక స్టవ్ ఆపేసి గిన్నెపై మూతపెట్టి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ముందుగా కలుపుకున్న మరొకసారి చేత్తో కలుపుకున్నాక పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. తర్వాత ఒక్కో పిండి ముద్దను తీసుకొని మరీ పల్చగా కాకుండా,మరీ మందంగా కాకుండా పల్చగా, చిన్న చపాతీలా రెడీ చేసుకోవాలి.
-తర్వాత వత్తుకున్న ఒక్కో చపాతీని పీట మీద పెట్టి 3 చుక్కల నెయ్యిని ఆ చపాతీ మీద వేసుకొని దాన్ని చేత్తో మొత్తం పరుచుకున్నట్లు చేశాక, దీని మీద పొడి మైదా పిండి చల్లుకొని దీని మీద వేరొక చపాతీ పర్చుకోవాలి.
-ఇలా ప్రతి ఒక్క చపాతీపై 3 చుక్కల నెయ్యి వేసుకొని తర్వాత పొడి మైదా పిండి చల్లుకొని దానీ మీద మరో చపాతీ పెట్టడం చేసుకోవాలి. ఒకదానిపై ఒకటి ఇలా వేసుకున్న తర్వాత దీనిని గొట్టంలా మడుచుకోవాలి.
-సన్నగా రోల్ లాగా చేసుకున్న తర్వాత చాకుతో దానిని అర ఇంచు వదులుతూ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఆ తర్వాత కట్ చేసిన ముక్కలను చేతితో రౌండ్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
-రౌండ్ గా చేసుకున్న తర్వాత దానిపై పొడి పిండి చల్లుకుంటూ పల్చని పూరీలా కర్రతో వత్తుకోవాలి. మరీ గట్టిగా వత్తుకోకూడదు..అలా చేస్తే లేయర్స్ పోతాయి.
-అన్నీంటినీ వత్తుకొని ఓ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేశాక అందులో వత్తుకున్న ఒక్కో పూరీని అందులో వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా లేత బంగారు రంగు వచ్చేదాకా వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేయాలి.
-ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్ చక్కెర పాకంలో రెడీ చేసుకున్న ఒక్కో పూరీని వేసి రెండు వైపులా అర నిమిషం డిప్ చేసి ఓ ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి.
-ప్లేట్ లో రెడీ అయి ఉన్న పూరీలపై కొంచెం చక్కెర చల్లుకోండి. అంతే క్రిస్పీ, జ్యూసీ గోధుమ పిండి స్వీట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













