Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
కురుక్షేత్ర యుద్ధం: మహాభారతంలోని కీలక ఘట్టాలు, అర్జునుడు, కర్ణుడి కథలు వెల్లడి -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి!
సంవత్సరమైనా పాడవకుండా ఉండే బియ్యం వడియాలు.. సింపుల్గా ఎలా చేసుకోవాలంటే?
మన తెలుగు ప్రజలకు పచ్చళ్ళు, అప్పడాలు, రోటి పచ్చలు, వడియాలు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అందుకే నెలల ముందే పచ్చళ్ళు పెట్టుకొని నిలువ ఉంచుకొని తింటుంటారు. వాటిలో ముఖ్యమైనది వడియాలు. వీటిని చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాగే దీనిని చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక రెండు రోజులు జోరుగా ఎండ కాసిందంటే చాలు వడియాలు వేసేసి ఇంటి మేడపైన ఆరబెట్టేస్తారు. ఒకసారి చేసుకుంటే ఏడాదిపాటు వచ్చే ఈ వడియాలు ఎన్ని రోజులైనా పాడవకుండా, రుచికరంగా ఉండేలా ఎలా చేసుకోవాలో మేము ఇక్కడ వివరించాము. మేము చెప్పిన విధంగా ఓసారి ట్రై చేసి.. మీ ఫ్రెండ్స్, అండ్ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి.
ముందుగా బియ్యం వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం
- మూడు కప్పుల బియ్యం
- తొమ్మిది కప్పుల నీళ్లు
- ఒక స్పూన్ వాము
- రెండు స్పూన్ల జీలకర్ర
- పావు కప్పు నువ్వులు
- రుచికి సరిపడా ఉప్పు
బియ్యం వడియాలు తయారీ విధానం
ఈ బియ్యం వడియాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు వేసి ఉడికించాలి. మనం మూడు కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి.. తొమ్మిది కప్పుల నీళ్లు గిన్నెలో పోసుకోవాలి. ఆ నీటిని సలసలా మరిగే వరకు మరిగించుకోవాలి. నీళ్లు బాగా మారిగాకా అందులో మూడు కప్పుల బియ్యం వేసుకోవాలి. అలాగే అదే నీళ్లలో రుచికి సరిపడా ఉప్పును కూడా జత చేసుకోవాలి.
ఇప్పుడు అందులో వాము, జీలకర్ర, నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకొని గిన్నెపైన మూత పెట్టుకోవాలి. బియ్యం, నీళ్లు అన్ని చిక్కగా, గట్టిగా, మందంగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి బియ్యంను చల్లారేవరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చీరను బాగా ఎండ తగిలే ప్రాంతంలో పరుచుకొని.. బియ్యం మిశ్రమాన్ని వడియాల మాదిరిగా పరుచుకోవాలి. అలాగే జంతికల యంత్రంలో ఉంచుకొని జంతికల మాదిరిగా వచ్చే విధంగా కూడా ఈ వడియాలు వేసుకోవచ్చు.
ఇంకొందరు తెల్లని వస్త్రంపై అప్పడాల మాదిరిగా ఉంచుకొని ఎండబెట్టుకుంటారు. ఈ విధంగా కూడా వడియాలు రుచికరంగా ఉంటాయి. అలా వివిధమైన వస్త్రాలపై ఈ వడియాలు రెండు రోజుల పాటు ఎర్రటి ఎండలో ఎండబెడితే వడియాలు సిద్ధమైనట్లే. ఎండిన వడియాలు గిన్నెలో వేసుకున్నప్పుడు గలగలామని శబ్దం వినిపిస్తుంది. అప్పుడే వడియాలు ఎండినట్లు అర్ధం చేసుకోవాలి. వీటిని గాలి దూరని డబ్బాలో ఉంచుకొని నిలువ చేసుకుంటే ఎన్ని నెలలైనా పాడవకుండా అలానే ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












