Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
Spicy Masala Peanuts: మసాలా పల్లీలు టైంపాస్ కి మాత్రమే కాదు..ఆరోగ్యానికి...అంతకు మించి.
మసాలా పల్లీలు అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ఇవి కమ్మగా రుచిగా ఉంటాయి. కాస్త కారం పెట్టి తింటే ఆహా అనాల్సిందే. ముఖ్యంగా వర్షాకాలంలో టీ టైంలో ఇలాంటి మసాలా పల్లీలని చాలా మంది ఇష్టపడతారు. ఇవి రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంది. ముఖ్యంగా మసాలా వేరుశెనగలు నూనె లేనివి, ఆరోగ్యకరమైన స్నాక్స్. వీటిని టీ టైంలో ఒక కప్పు టీ తో తింటే మనస్సు ఉల్లాసంగా ఉంటుంది
ఈ మసాలా పల్లీలను తయారుచేయడం చాలా సులభం, కాస్త టైం తీసుకుంటుంది కానీ తయారుచేయడం సులభం మరియు రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవికొంచెం స్పైసీగా తయారుచేసుకుంటే రుచితో క్రిస్సీగా నోరూరిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో వంటగదిలో పల్లీలుంటే చాలు మసాలా పల్లీలను తయారుచేసుకుని ఆనందించండి.
కావలసిన పదార్థాలు
2 కప్పులు వేరుశెనగ లేదా జీడిపప్పు
2 స్పూన్ ఎర్ర మిరప పొడి (మీ రుచికి అనుగుణంగా మార్చుకోండి)
1/4 టీస్పూన్ మామిడికాయ పొడి లేదా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం (మీ
రుచికి సరిపడా)
1/4 టీస్పూన్ పసుపు పొడి
ఒక పెద్ద చిటికెడు ఇంగువ
రుచికి ఉప్పు
తయారు చేయ విధానం:
1. ఒక మందపాటి పాన్లో, వేరుశెనగ లేదా పల్లీలను వేసి బ్రౌన్ రంగులోకి
వచ్చే వరకు మీడియం మంట మీద వేయించాలి.
2. వేయించిన వేరుశెనగలను ఒక గిన్నెలో వేయండి.
3. తర్వాత ఒక చిన్న గిన్నెలో ఎర్ర మిరప పొడి,మామిడికాయ పొడి (లేదా
నిమ్మరసం), పసుపు, ఇంగువ మరియు ఉప్పు వేయండి.
4. 1-2 టేబుల్ స్పూన్ల నీరు వేసి చిక్కటి మసాలా చేయండి.
5. వేయించిన వేరుశెనగ కొద్దిగా వేడెక్కిన తర్వాత, మసాలా దినుసులు వేసి
బాగా కదిలించు.
6. మళ్లీ స్టవ్ తిప్పి వేరుశెనగలు పొడిగా అయ్యే వరకు వేయించాలి.
7. స్టవ్ ఆఫ్ చేసి గాలి చొరబడని డబ్బాలో ఉంచండి. సాయంత్రం టీ లేదా
కాఫీతో ఆనందించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












