Latest Updates
-
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..!
Spicy Masala Peanuts: మసాలా పల్లీలు టైంపాస్ కి మాత్రమే కాదు..ఆరోగ్యానికి...అంతకు మించి.
మసాలా పల్లీలు అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ఇవి కమ్మగా రుచిగా ఉంటాయి. కాస్త కారం పెట్టి తింటే ఆహా అనాల్సిందే. ముఖ్యంగా వర్షాకాలంలో టీ టైంలో ఇలాంటి మసాలా పల్లీలని చాలా మంది ఇష్టపడతారు. ఇవి రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంది. ముఖ్యంగా మసాలా వేరుశెనగలు నూనె లేనివి, ఆరోగ్యకరమైన స్నాక్స్. వీటిని టీ టైంలో ఒక కప్పు టీ తో తింటే మనస్సు ఉల్లాసంగా ఉంటుంది
ఈ మసాలా పల్లీలను తయారుచేయడం చాలా సులభం, కాస్త టైం తీసుకుంటుంది కానీ తయారుచేయడం సులభం మరియు రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవికొంచెం స్పైసీగా తయారుచేసుకుంటే రుచితో క్రిస్సీగా నోరూరిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో వంటగదిలో పల్లీలుంటే చాలు మసాలా పల్లీలను తయారుచేసుకుని ఆనందించండి.

కావలసిన పదార్థాలు
2 కప్పులు వేరుశెనగ లేదా జీడిపప్పు
2 స్పూన్ ఎర్ర మిరప పొడి (మీ రుచికి అనుగుణంగా మార్చుకోండి)
1/4 టీస్పూన్ మామిడికాయ పొడి లేదా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం (మీ
రుచికి సరిపడా)
1/4 టీస్పూన్ పసుపు పొడి
ఒక పెద్ద చిటికెడు ఇంగువ
రుచికి ఉప్పు
తయారు చేయ విధానం:
1. ఒక మందపాటి పాన్లో, వేరుశెనగ లేదా పల్లీలను వేసి బ్రౌన్
రంగులోకి వచ్చే వరకు మీడియం మంట మీద వేయించాలి.
2. వేయించిన వేరుశెనగలను ఒక గిన్నెలో వేయండి.
3. తర్వాత ఒక చిన్న గిన్నెలో ఎర్ర మిరప పొడి,మామిడికాయ పొడి (లేదా
నిమ్మరసం), పసుపు, ఇంగువ మరియు ఉప్పు వేయండి.
4. 1-2 టేబుల్ స్పూన్ల నీరు వేసి చిక్కటి మసాలా చేయండి.
5. వేయించిన వేరుశెనగ కొద్దిగా వేడెక్కిన తర్వాత, మసాలా దినుసులు వేసి
బాగా కదిలించు.
6. మళ్లీ స్టవ్ తిప్పి వేరుశెనగలు పొడిగా అయ్యే వరకు
వేయించాలి.
7. స్టవ్ ఆఫ్ చేసి గాలి చొరబడని డబ్బాలో ఉంచండి. సాయంత్రం టీ లేదా
కాఫీతో ఆనందించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications