Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
కుకుంబర్ మింట్ స్మూతీ
వేసవిలో వాతావరణం వేడి, ఎండ వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. డీహైడ్రేషన్ నుండి మన శరీరానికి ఉపశమనం కలిగించడానికి పుదీనా మరియు కీరదోసకాయ బాగా సహాయపడుతాయి. అంతే కాదు కీరదోసకాయలో ఫైబర్ అధికంగా ఉండి, శరీరాన్ని చల్లబరచడంతో పాటు, కీరదోసకాలో వాటర్ కంటెంట్ మరియు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది.
అలాగే పుదీనా శరీరానికి చల్లదనాన్ని చేకూర్చుతుంది. మరియు చర్మాన్ని చల్లగా ఉంచుతుంది అంతే కాదు జీర్ణ సమస్యలను, చర్మ సమస్యలను నివారించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్ లో పెరుగు కూడా చేర్చి చిక్కటి స్మూతీ తయారుచేసుకోవడంతో వేసవి వేడిని బీట్ చేయడంతో పాటు, శరీర రుగ్మతలను నివారించుకోవచ్చు. మరి కీరదోస పుదీనాతో స్మూతీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
కీర దోసకాయ ముక్కలు - అర కప్పు (దోసకాయ చెక్కు తీసి చిన్న ముక్కలు గా తరగాలి);
పుదీనా ఆకులు - 5;
ఐస్ క్యూబ్స్ - కొన్ని;
గట్టి పెరుగు - రెండు కప్పులు;
నీళ్లు - కొద్దిగా;
చాట్ మసాలా - చిటికెడు;
నల్ల ఉప్పు - కొద్దిగా
తయారు చేయు విధానం:
1. ముందుగా కీరదోసకాయ ముక్కలు, పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
2. తర్వాత ఒక పాత్రలో పెరుగు, నల్ల ఉప్పు, చాట్ మసాలా, టేబుల్ స్పూను నీళ్లు వేసి గిలక్కొట్టాలి.
3. తర్వాత కీరదోస + పుదీనాను మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసి పెరుగు మిశ్రమంతో జత చేసి మరోమారు గిలక్కొట్టాలి.
4. ఇలా తయారైన స్మూతీని గ్లాసులలో వేసి ఐస్ క్యూబ్స్ జత చేసి అందించాలి. అంతే కుకుంబర్ మింట్ స్మూతీ రెడీ



Click it and Unblock the Notifications