Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
అమ్మాయిల వివాహ వయసు 18 నుండి 21 ఏళ్లకు ఎందుకు పెంచారో తెలుసా...
అమ్మాయిల వివాహ వయసు 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో మహిళల వివాహ కనీస వయసును 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకుంది.

అంతేకాదు ఈ బిల్లును కూడా ఈ పార్లమెంటులోనే ప్రవేశపెట్టి ఆమోదించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కేంద్ర కేబినేట్ బుధవారం నాడు డిసెంబర్ 16వ తేదీన ఆమోదముద్ర లభించినట్లు ప్రకటించింది.

దీంతో మహిళల కనీస వయసు 18 నుండి 21 సంవత్సరాలకు పెరిగింది. ఇప్పటివరకు మన దేశంలో మహిళలు వివాహం చేసుకోవాలంటే కనీస వివాహ వయసు 18 సంవత్సరాలుగా ఉండేది. అయితే ఈ వయసు పరిమితి పెంపును అమలు చేసేందుకు.. బాల్య వివాహాల నియంత్రణ చట్టం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్టులలో సవరణలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం జయా జైట్లీ సారథ్యంలో నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ ను కమిటీని కూడా నియమించింది. ఇదిలా ఉండగా కేంద్రం అకస్మాత్తుగా అమ్మాయిల పెళ్లి వయసుకు సంబంధించి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది.. దీనికి గల కారణాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

చిన్న వయసులో..
మన దేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకు 18 ఏళ్లు నిండి నిండక ముందే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. అయితే అమ్మాయిలు చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల వారికి పుట్టే పిల్లలు అనారోగ్యంగా ఉంటున్నారని, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాస్క్ ఫోర్స్ టీమ్ లోని ప్రభుత్వ నిపుణులు వీకే పాల్, వైద్య ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, న్యాయశాఖాధికారులు అభిప్రాయపడ్డారు.

కుటుంబ పరిస్థితులు..
అమ్మాయిలు 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకుంటే కుటుంబ పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతాయని.. అదే 21 సంవత్సరాల తర్వాత చేసుకుంటే.. కుటుంబం, ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయని ఆ టాస్క్ ఫోర్స్ టీమ్ అభిప్రాయపడింది.

అమ్మాయిలూ ఓకే అన్నారట..!
అమ్మాయిల వివాహ వయసు పెంపు గురించి కొన్ని కళాశాలల్లో, ఇతర చోట్ల సర్వేలు నిర్వహించగా.. మెజార్టీ శాతం అమ్మాయిలు వివాహ వయసు కనీసం 21 సంవత్సరాలు ఉండాలని సమాధానం ఇచ్చారట. వీటన్నింటిని ద్రుష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మహిళల వివాహ కనీస వయసు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వయసు తేడా..
ఇటీవలి కాలంలో పెళ్లికొడుకు, పెళ్లి కుమారుల మధ్య వయసు తేడా పెద్దగా కనిపించడం లేదు. ఇందుకు కారణం ఏంటంటే.. వివాహం చేసుకోబోయే వ్యక్తి వయసు గురించి ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు పూర్తి క్లారిటీ ఉండటమే. కొందరికి ఏజ్ గ్యాప్ పెద్దగా ఇబ్బందిగా అనిపించదట.

ఆలోచనల్లో తేడాలు..
కొందరు అమ్మాయిలు వివాహ వయసు గురించి తమ అభిప్రాయాన్ని ఇలా చెప్పారు. ‘నేను నా ప్రియుడితో డేటింగ్ చేసే సమయానికి నా ఏజ్ 23 సంవత్సరాలు, తన వయసు 28 సంవత్సరాలు. ఇప్పటికీ మా ఇద్దరి ఆలోచనలు, ఆశయాలు వేర్వేరుగానే ఉంటాయి. అయితే నేనేమో వయసులో చిన్నదాన్ని. తనేమో ఏ విషయమైనా సీరియస్ గా తీసుకునే దశలో ఉన్నాడు. చిన్న చిన్న గొడవలు వచ్చినా పరిష్కరించుకునేవాళ్లం. కాబట్టి మాకు వయసు గురించి ఎలాంటి ఇబ్బందీ లేదు' అని ఓ మహిళ స్పష్టం చేసింది.

కొందరు వ్యతిరేకించారు..
అమ్మాయిల వివాహ వయసు పెంపుదలను కొందరు మహిళలు వ్యతిరేకించారు. ఎందుకంటే ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలపై ఎక్కువ ప్రభావం పడుతోందట. అక్కడ మగవారితో పోలిస్తే.. ఆడవారి చదువుకు, వారితో ఉద్యోగాలు చేయించడానికి తక్కువ ప్రియారిటీ ఇస్తారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. వారికి పోషకాహారం కూడా తక్కువగానే అందుతుంది. ఆరోగ్య సంబంధిత విషయాల్లో సర్వీసు కష్టమే. అందుకే అమ్మాయిలకు త్వరగానే పెళ్లిళ్లు చేసేస్తుంటారు. అందుకే రూరల్ ఏరియాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతుంటాయని చెబుతున్నారు.
మన దేశంలో మహిళల వివాహ కనీస వయసును 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ బిల్లును కూడా ఈ పార్లమెంటులోనే ప్రవేశపెట్టి ఆమోదించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కేంద్ర కేబినేట్ బుధవారం నాడు డిసెంబర్ 16వ తేదీన ఆమోదముద్ర లభించినట్లు ప్రకటించింది. దీంతో మహిళల వివాహ కనీస వయసు 18 నుండి 21 సంవత్సరాలకు పెరిగింది.
మన దేశంలో 2021 సంవత్సరానికి ముందు వరకు మహిళలు వివాహం చేసుకోవాలంటే కనీస వివాహ వయసు 18 సంవత్సరాలుగా ఉండేది. అయితే ఈ వయసు పరిమితి పెంపును అమలు చేసేందుకు.. బాల్య వివాహాల నియంత్రణ చట్టం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్టులలో సవరణలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం జయా జైట్లీ సారథ్యంలో నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ ను కమిటీని కూడా నియమించింది.



Click it and Unblock the Notifications