Just In
- 1 hr ago అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- 3 hrs ago Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- 4 hrs ago ఏప్రిల్ నెలలో లక్ష్మీ నారాయణ మరియు బుధాదిత్య రాజయోగంతో, ఈ రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు లభిస్తాయి..!
- 7 hrs ago Today Horoscope 29 March 2024 :ఈరోజు ఈ రాశుల ఆర్థిక స్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది...
Ganga Dussehra 2021 : ఈ మంత్రాలతో గంగామాతను పూజిస్తే.. విశేష ఫలితాలొస్తాయి...!
తల్లి గంగ దివి నుండి భువికి దిగి వచ్చినప్పుడు, ఇది జ్యేష్ఠ మాసంలో ప్రకాశవంతమైన పక్షం యొక్క పదో రోజు.
హిందూ సంప్రదాయం ప్రకారం, గంగా దసరా పండుగను ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో ప్రకాశవంతమై పక్షం యొక్క పదో రోజున జరుపుకుంటారు. ఈ పవిత్రమైన పండుగ రోజున తల్లి గంగాదేవి దివి నుండి భువికి దిగి వచ్చిందని హిందువులు నమ్ముతారు. ఈ సందర్భంగా గంగా నదిలో స్నానం చేస్తే, తాము చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుందని కూడా చాలా మంది విశ్వసిస్తారు.
ఈ నేపథ్యంలో 2021 సంవత్సరంలో జూన్ 20వ తేదీన అంటే ఆదివారం నాడు ఈ పండుగ వచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా విశ్వవ్యాప్తంగా పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. మన దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ సందర్భంగా గంగా మాతను మీరు ఇంట్లోనే ఉండి ఎలా పూజించాలో.. అసలు గంగాదేవి ఆకాశం నుండి భూమి మీదకు ఎలా వచ్చిందనే అంశాలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భగీరథుని తపస్సును మెచ్చి..
పురాణాల ప్రకారం భగీరథుడు గంగానదిని స్వర్గం నుండి భూమికి తీసుకొచ్చాడు. ఇందుకోసం ఆయన కఠోర తపసు చేశాడు. తన తపస్సుకు మెచ్చిన గంగాతల్లి భగీరథుని కోరికలను తీర్చింది.
మరో కథ ప్రకారం..
మరో కథలో.. భగీరథుడు తల్లి గంగ కోసం... శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. భగీరథుడు తపస్సు పట్ల సంతోషించి శివుడు తన జడలో ఉన్న గంగాదేవిని భూమికి పంపించడానికి అంగీకరిస్తాడు. అప్పుడు నేలపై ఉన్న బంజరు భూములన్నీ సారవంతమైనవిగా మారిపోతాయి. అంతేకాదు ప్రతి ఒక్క చోట పచ్చదనం రావడం ప్రారంభమవుతుంది. అప్పటి నుండి గంగా దసరా ప్రారంభమైంది. దీంతో ఈ పండుగను ఎంతో ప్రత్యేకమనదిగా హిందువులు భావిస్తారు. ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
గంగా దసరా తేదీ
హిందూ క్యాలెండర్ ప్రకారం, 2020 జూన్ 1 న, జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం పదవ రోజున వస్తుంది. అందువల్ల ఈ సంవత్సరం జూన్ 1 సోమవారం గంగా దసరా జరుపుకుంటారు.
గంగా దసరా ముహూర్తం..
జ్యేష్ఠ మాసంలో దశమి తేదీ ప్రారంభమవుతుంది. 31వతేదీ మే 2020 న సాయంత్రం 5.36 నుండి 1 జూన్ 2020 వరకు 2.57 మధ్యాహ్నం వరకు ఉంటుంది.
ఈ మంత్రాలతో ఆరాధన..
‘ఓం నమో భగవతి హిల్లి హిల్లి మిలి మిలి గంగే మా పావయే పవాయే స్వాహా' అనే మంత్రాన్ని జపిస్తూ గంగాదేవిని ఆరాధించండి.
గంగా దసరా యొక్క ప్రాముఖ్యత..
తల్లి గంగా భూమిపైకి దిగిన రోజున, చాలా ప్రత్యేకమైన మరియు అదృష్టవంతుడైన ముహూర్తం సమయం అని పండితులు చెబుతారు.హిందువుల విశ్వాసాల ప్రకారం, గంగా మాతను ఆరాధించడం వల్ల ఒక వ్యక్తికి పది రకాల పాపాల నుండి విముక్తి కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. గంగా దసరా రోజున, ఆ తల్లిని ధ్యానించడం మరియు స్నానం చేయడం ద్వారా, కామ, కోపం, దురాశ, మోహం, అసూయ వంటి పాపాలు పోయి.. పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని పండితులు చెబుతారు. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా గంగా నదిలో స్నానం చేసే అవకాశం లేనందున, మీరంతా ఇంట్లోనే కొన్ని చుక్కల గంగా నీటిని తీసుకొని, మీరు స్నానం చేసే పాత్రలో వేసుకుని, గంగాదేవిని ఆరాధన చేయడంతో పాటు, కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తే మీకు అంతా మంచే జరుగుతుంది.