Just In
- 3 hrs ago Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- 4 hrs ago గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- 7 hrs ago ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- 9 hrs ago ఈ 4 రాశులకు శుక్రుడు, రాహువు కలయిక గొప్ప ఫలితాలిస్తాయి, ఏప్రిల్లో డబ్బు వర్షం కురుస్తుంది
ప్రాణాలను తీసే గుడి ఇది! రాత్రి అయిందంటే చాలు...
ఎవరైనా దేవాలయాలను ఎందుకు దర్శిస్తారు చెప్పండి? మంచి ఆరోగ్యమైన జీవితం గడపాలని ఇంకా ఇలా ఎన్నో కోరికలతో భక్తిగా గుళ్లకు వెళతారు. అయితే మీరు ఈ దేవాలయం గురించి విన్నారా? ఇక్కడ గడిపితే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంటారు. చాలా విచిత్రంగా ఉంది కదూ!
ఇప్పుడు చెప్పబోయే కథ మైహర దేవి ఆలయం గురించి. ఇక్కడ రాత్రిపూట గడిపితే ఇక ప్రాణాలు వదిలేసుకోవడమే అని నమ్ముతారు. మరి సాహసాలు చేసేవారు ఇలాంటి వాటి గురించి ఆసక్తిగా ఉందా? అయితే పదండి.. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.
భారతదేశంలో భయానికి గురిచేసే టాప్ 8 ప్రదేశాలు
అసలు అక్కడ దెయ్యాలేమైనా ఉన్నాయా? లేక ఉత్తి అపోహనేనా .. దీని వెనక కథ ఏమిటి తెలుసుకుందాం...
దేవాలయం గురించి..
ఇలాంటి కథనానికి ప్రఖ్యాతి గాంచిన ఈ దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సమీపంలో సాత్నా జిల్లాలో మైహర్ ఉంది. ఈ దేవాలయంలో శారద అమ్మవారు కొలువై ఉన్నారు. మైహర్ అంటే మా కా హార్ అని అర్థం. అంటే దేవత యోక్క హారం అని తెలుగులో అర్థం.
కొండల్లో ఉంది
ఈ గుడి త్రికూట్ అనే కొండల మధ్య ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడి శారద దేవిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తండోపతండాలుగా వస్తుంటారని చెబుతారు. అక్కడ అంత భయంకరమైన చరిత్ర ఉన్నా సరే లెక్కచేయకుండా వీరు అక్కడి వస్తారట.
అసలేం ఉంది అక్కడ..
దేవాలయం గురించి కథలు కథలుగా చెబుతారు. ఈ నమ్మకాలన్నీ నిజమని చాలా మంది నమ్ముతారు కూడా. ఇక రాత్రి పూట అక్కడ ఉండలేమని కూడా అంటారు. అలా ఉన్నవారు ఎవరూ ప్రాణాలతో బతికి బట్టకట్టలేరని కూడా చెబుతారు.
దెయ్యాలు మరియు ఆత్మల గురించి 10 తమాషా నిజాలు
దానికి కారణముంది...
ఈ నమ్మకం వెనక ఒక కథ ఉంది. ఇప్పటికీ శారద మాతకు అతి పెద్ద భక్తులైన ఆలహ, ఉదమ్ అనే ఇద్దరు సోదరుల ఆత్మలు అక్కడ తిరుగుతాయట.
ఈ రెండు ఆత్మలు అప్పట్లో పృథ్వీ రాజ్ చౌహాన్తో వీరోచితంగా పోరాడారని చెబుతారు. అది కాకుండా వీళ్లిద్దరు మొదటిసారి మైహర్ దేవి ఆలయాన్ని గుట్టల్లో కనుగొన్నారు అని చెబుతారు.
రాత్రి వేళ్లలో మూసేస్తారు
రాత్రిపూట దేవాలయాన్ని మూసివేస్తారు. అక్కడి వారు నమ్మేదాని ప్రకారం ఈ ఇద్దరు సోదరులు అమ్మవారిని పూజిస్తారట. అదే కారణంగా చెప్పి గుడి లోపలికి రాత్రిపూట ఎవరినీ అనుమతించరు. ఎవరైనా సాహసం చేసి రాత్రంతా గడిపితే ఇక మరునాడు ప్రాణాలతో ఉండరని అంటారు.
దీనిపై మీరేమంటారు? ఇది ఒట్టి కల్పితమే లేదా నిజమా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలపండి.