Latest Updates
-
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు!
ప్రాణాలను తీసే గుడి ఇది! రాత్రి అయిందంటే చాలు...
ఎవరైనా దేవాలయాలను ఎందుకు దర్శిస్తారు చెప్పండి? మంచి ఆరోగ్యమైన జీవితం గడపాలని ఇంకా ఇలా ఎన్నో కోరికలతో భక్తిగా గుళ్లకు వెళతారు. అయితే మీరు ఈ దేవాలయం గురించి విన్నారా? ఇక్కడ గడిపితే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంటారు. చాలా విచిత్రంగా ఉంది కదూ!
ఇప్పుడు చెప్పబోయే కథ మైహర దేవి ఆలయం గురించి. ఇక్కడ రాత్రిపూట గడిపితే ఇక ప్రాణాలు వదిలేసుకోవడమే అని నమ్ముతారు. మరి సాహసాలు చేసేవారు ఇలాంటి వాటి గురించి ఆసక్తిగా ఉందా? అయితే పదండి.. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.
అసలు అక్కడ దెయ్యాలేమైనా ఉన్నాయా? లేక ఉత్తి అపోహనేనా .. దీని వెనక కథ ఏమిటి తెలుసుకుందాం...

దేవాలయం గురించి..
ఇలాంటి కథనానికి ప్రఖ్యాతి గాంచిన ఈ దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సమీపంలో సాత్నా జిల్లాలో మైహర్ ఉంది. ఈ దేవాలయంలో శారద అమ్మవారు కొలువై ఉన్నారు. మైహర్ అంటే మా కా హార్ అని అర్థం. అంటే దేవత యోక్క హారం అని తెలుగులో అర్థం.

కొండల్లో ఉంది
ఈ గుడి త్రికూట్ అనే కొండల మధ్య ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడి శారద దేవిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తండోపతండాలుగా వస్తుంటారని చెబుతారు. అక్కడ అంత భయంకరమైన చరిత్ర ఉన్నా సరే లెక్కచేయకుండా వీరు అక్కడి వస్తారట.

అసలేం ఉంది అక్కడ..
దేవాలయం గురించి కథలు కథలుగా చెబుతారు. ఈ నమ్మకాలన్నీ నిజమని చాలా మంది నమ్ముతారు కూడా. ఇక రాత్రి పూట అక్కడ ఉండలేమని కూడా అంటారు. అలా ఉన్నవారు ఎవరూ ప్రాణాలతో బతికి బట్టకట్టలేరని కూడా చెబుతారు.

దానికి కారణముంది...
ఈ నమ్మకం వెనక ఒక కథ ఉంది. ఇప్పటికీ శారద మాతకు అతి పెద్ద భక్తులైన ఆలహ, ఉదమ్ అనే ఇద్దరు సోదరుల ఆత్మలు అక్కడ తిరుగుతాయట.
ఈ రెండు ఆత్మలు అప్పట్లో పృథ్వీ రాజ్ చౌహాన్తో వీరోచితంగా పోరాడారని చెబుతారు. అది కాకుండా వీళ్లిద్దరు మొదటిసారి మైహర్ దేవి ఆలయాన్ని గుట్టల్లో కనుగొన్నారు అని చెబుతారు.

రాత్రి వేళ్లలో మూసేస్తారు
రాత్రిపూట దేవాలయాన్ని మూసివేస్తారు. అక్కడి వారు నమ్మేదాని ప్రకారం ఈ ఇద్దరు సోదరులు అమ్మవారిని పూజిస్తారట. అదే కారణంగా చెప్పి గుడి లోపలికి రాత్రిపూట ఎవరినీ అనుమతించరు. ఎవరైనా సాహసం చేసి రాత్రంతా గడిపితే ఇక మరునాడు ప్రాణాలతో ఉండరని అంటారు.
దీనిపై మీరేమంటారు? ఇది ఒట్టి కల్పితమే లేదా నిజమా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలపండి.



Click it and Unblock the Notifications











