Just In
- 1 hr ago
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- 4 hrs ago
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- 5 hrs ago
Taurus Horoscope 2021 : వృషభరాశి వారు సంపద పెంచుకుంటారు.. అది ఎప్పుడంటే...?
- 5 hrs ago
తరచూ మూత్ర విసర్జన చేయాలనిపిస్తోందా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
Don't Miss
- News
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
- Movies
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Makar Sankranti 2021: సంక్రాంతి పండుగ వెనుక ఆసక్తికరమైన కథల గురించి తెలుసా...!
హిందూ పంచాంగం ప్రకారం, 2021 సంవత్సరంలో సంక్రాంతి పండుగ జనవరి 14వ తేదీ అంటే గురువారం నాడు వచ్చింది. పుష్య మాసంలో సూర్యుడు.. ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడే ఈ పండుగ ప్రారంభమవుతుంది.
ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన చాలా మంది హిందువులు ఉదయాన్నే నిద్ర లేచి గంగా నదిలో పారే నీటిలో స్నానాలు చేసి, ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తారు.
ఇదేరోజున పేదలకు ధానధర్మాలు చేస్తే ఎంతో మంచి ఫలితం వస్తుందని పండితులు చెబుతుంటాయి. ఈసారి సూర్యుడు మకరంలోకి ఆగమనం చేసినప్పుడు బుధుడు, గురుడు, చంద్రుడు, శనితో పాటు ఐదు గ్రహాల సంయోగం ఉంటుంది. ఈ పండుగను మరింత పవిత్రంగా మారుస్తున్న ఈ సంక్రాంతి పండుగ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం రండి...

శని కదలిక..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు ధనస్సు నుండి మకరంలోకి ప్రవేశించే పవిత్రమైన సమయాన్ని సంక్రాంతి లేదా సంక్రమణం అంటారు. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం..దీనినే సంక్రాంతి అంటారు. ఈ సారి మకరరాశిలో శని కదలిక కారణంగా చాలా శుభ ఫలితాలుంటాయి.

ఉత్తరాయణంలో మార్పు..
మకర సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణ యానం నుండి ఉత్తరయాణంలోకి మార్పు చెందుతాడు. పురాణాల ప్రకారం ఉత్తరాయణ దేవతలు పగలు అని, దక్షిణాది దేవతలు రాత్రి అవుతుంది. సూర్యుడు ఎప్పుడైతే ఉత్తరయాణంలో ప్రారంభమైతే.. అప్పటి నుండే వేసవి కాలం ప్రారంభమవుతుంది.

దానం చేస్తే..
ఈ పవిత్రమైన సమయంలో పేదలకు దానధర్మాలు చేస్తే, పునరుత్పాదక ధర్మం సాధించడానికి దారి తీస్తుంది. అంతేకాకుండా అది అనేక జన్మలకు దారి తీస్తుందని పండితులు చెబుతుంటారు.
Happy Makar Sankranti 2021 : సంక్రాంతి సంబరాల వేళ మీ బంధుమిత్రులను హత్తుకునేలా విషెస్ చెప్పండి...!

ఆసక్తికరమైన కథ..
సంక్రాంతి గురించి పురాణాల్లో చాలా కథలే ఉన్నాయి. తొలి కథలో.. శ్రీమద్భాగవత దేవి పురాణంలో దీని గురించి ప్రస్తావించారు. శని తన తండ్రి అయిన సూర్యుడిపై ద్వేషం పెంచుకుంటాడు. ఎందుకంటే తన తల్లి అయిన ఛాయ దేవి సూర్యుడికి రెండో భార్య. మొదటి భార్య కొడుకు అయిన యమరాజుతో శని వివక్ష చూపిస్తాడు. ఈ కారణంగా సూర్యభగవానుడు ఛాయదేవిని, శనిని దూరంగా ఉంచుతాడు. శని సూర్యుడిని కుష్టు వ్యాధి కలిగేలా శపిస్తాడు.

కఠిన తపస్సు..
సూర్యుడి కుష్టు వ్యాధి చూసి యమరాజు తీవ్ర ఆవేదన చెందుతాడు. ఈ వ్యాధి నుండి తన తండ్రిని బయటపడేసేందుకు గాను కఠినమైన తపస్సు చేస్తాడు. ఇదిలా ఉండగా.. శనిపై కోపంతో సూర్యుడు తన ఆధీనంలోని కుంభరాశిని జ్వలిస్తాడు. దీంతో ఛాయదేవి, శని దేవుడు బాధపెడతారు. ఇది చూసిన యముడు శనిని కరుణించాలని సూర్యుడికి విన్నవిస్తాడు.

నల్ల నువ్వులు అప్పుడే..
యమరాజు సూర్యుడిని ఒప్పించి కుంభంలోకి శనిని చేర్చుకునేలోపే అక్కడ అంతా అగ్నికి ఆహుతై ఉంటుంద. ఆ సమయంలో అక్కడ నల్లనువ్వులు తప్ప మరేమీ ఉండవు. ఈ కారణంగా శనిదేవుడు సూర్యుడిని నల్లనువ్వులతో పూజిస్తాడు. దీంతో సూర్యుడు సంతోషించి శనిదేవుడికి మకర రాశిని బహుమతిగా అందజేస్తాడు.
Makar Sankranti 2021 : కోడి పందేలు.. గాల్లో పతంగులు.. కొత్త అల్లుళ్ల రాకతో సంక్రాంతి సంబురాలు...!

అలా సంక్రాంతి ప్రారంభం..
అప్పుడే మకర రాశిలో సంపద, ఐశ్వర్యం ఉండేలా ఆ ఇంటిని నింపుతాడు. నల్ల నువ్వుల కారణంగా శని తన ప్రతిష్ట పెంచినందుకు గాను ఆయనకు అవంటే చాలా ఇష్టం. ఈ కారణంగా సూర్యుడు, తన శని ఆరాధన మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది.

మరో కథలో..
మరో కథలో మకర సంక్రాంతి రోజునే భగీరథుడు ఆకాశ గంగను భూమిపై స్వాగతిస్తాడు. గంగముని ఆశ్రమాన్ని అనుసరించి సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఈరోజు గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈరోజున గంగానదిలో స్నానం చేస్తే పుణ్యఫలాలను పొందుతారని విశ్వసిస్తారు. పిత్రు దేవతలకు తర్పణం సమర్పించేందుకు గాను గంగను భూమిపై ఆహ్వానిస్తాడు భగీరథ మహర్షి. ఈ ప్రతిపాదనను గంగాదేవి అంగీకరించి మకర సంక్రాంతి రోజున ప్రుథ్వీపైకి వస్తుంది. అందుకే ఈరోజున ప్రత్యేక ఉత్సవం జరుపుతారు.