Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
వినాయక నిమజ్జనం సమయంలో కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...!
కరోనా సమయంలో గణేష్ నిమజ్జనంలో పాల్గొనేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది కరోనా కారణంగా చాలా సింపుల్ గా ప్రారంభమయ్యాయి. అంతేకాదు గణేష్ నిమజ్జన వేడుకలు కూడా ఈసారి చాలా జాగ్రత్తగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎందుకంటే వేడుకల కన్నా ప్రాణాలు అనేవి చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇంతకుముందులా గణేష్ నిమజ్జనం అంటే సామూహికంగా డ్యాన్సులు చేయడం.. డీజే పాటలు పెట్టడం, భారీ స్పీకర్లు పెట్టడం, డ్రమ్స్ వంటి వాటికి అనుమతి లేదు. అయితే ఇప్పటికే కొంతమంది గణేష్ నిమజ్జనాన్ని కూడా పూర్తి చేస్తారు. వారి వారి ప్రాంతాలను బట్టి మూడు రోజులకు, ఐదు రోజులకు, కొంతమంది తొమ్మిది రోజులకు, ఇంకొందరు 11 రోజుల తర్వాత నిమజ్జన వేడుకలను నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా హిందువులతో పాటు ఇతరులు కూడా ఈ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించే అవకాశమే లేదు. ఎందుకంటే కరోనా మహమ్మారి రోజురోజుకు విలయతాండం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిమజ్జనం సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనాలను ప్రభుత్వాలు విడుదల చేశాయి. ఈ సందర్భంగా వినాయక నిమజ్జన వేడుకలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మాస్క్, శానిటైజర్ తప్పనిసరి..
ఈసారి గణేష్ నిమజ్జనం ఉత్సవంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కును తప్పనిసరిగా ధరించాలి. అలాగే శానిటైజర్ ను ప్రతి రెండు లేదా మూడు గంటలకోసారి చేతులకు రాసుకోవాలి.

భౌతిక దూరం మరవొద్దు..
గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో అసలైన విషయం ఇదే. ఈ ఉత్సవాల సందర్భంగా డీజే పాటలు లేదా డ్రమ్స్ పెట్టి ప్రతి ఒక్కరూ సామూహికంగా కలిసి డ్యాన్సులు వేస్తూ.. ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కానీ ఈసారి ఇలాంటి వాటిని జరుపుకోవాల్సిన పరిస్థితి కనబడటం లేదు. అలాగే మీరు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి.

నలుగురు మాత్రమే..
సాధారణంగా గణేష్ నిమజ్జనం సమయంలో జరిపే ఊరేగింపులో పదుల సంఖ్యలో లేదా వందలాది మంది ప్రజలు రోడ్లపై గుమిగూడి ఉంటారు. అలాగే వాహనాలలో కూడా పదుల సంఖ్యలో వ్యక్తులు ఉంటారు. కానీ ఈసారి మాత్రం గణేశుని ఊరేగింపు సమయంలో కేవలం నలుగురు లేదా ఐదుగురు కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.

టపాసులు కాల్చకండి..
ప్రతి ఏడాది గణేష్ నిమజ్జనం సందర్భంగా, టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది దీనికి అవకాశం లేదు. పోలీసులు కూడా బాణసంచా కాల్చడానికి అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ముందుగానే బాణసంచా కొనడం వంటివి చేయకండి. ఒకవేళ వాటిని కొంటే ఇతర సమయాల్లో ఉపయోగించుకోండి.

నీటిలో దిగే సమయంలో..
వినాయక విగ్రహాలను తీసుకునే నీటిలోకి దిగే సమయంలో కాలువలు, చెరువులు, నదులు, సముద్రాల వద్ద కేవలం ఈత వచ్చినవారే వెళ్లండి. ఈత వచ్చిన వారు కూడా ఎక్కువ లోతు మరియు దూరం వెళ్లకండి. ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి కాలువల్లో, నదుల్లో నీటి ప్రవాహం వేగంగా ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి. డ్యాములన్నీ నిండిపోయాయి. అన్ని కాలువలకు నీటిని విడుదల చేశారు.

సాయంత్రం లోపు..
సాధారణంగా వినాయక నిమజ్జనం అంటే కొందరు రాత్రి వేళలో లేదా సాయంకాలం పూట ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. కానీ ఇప్పుడు కరోనా వంటి మహమ్మారి ఉంది కాబట్టి.. లాక్ డౌన్ కూడా ఉన్నందున వినాయక ఊరేగింపును సాధ్యమైనంత మేరకు చీకటి పడేలోపు ముగించుకోవాలి.



Click it and Unblock the Notifications