Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
దుర్గా పూజలోని 5 రోజుల ప్రాముఖ్యత(మహా షష్ఠి, సప్తమి, అష్ఠమి,నవమి, దశమి)
బెంగాలీ ల ముఖ్య పండుగైన దుర్గా పూజని దేశమంతా భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు.దుర్గా పూజనే కొన్ని ప్రాంతాల్లో దేవీ నవరాత్రులనీ, దసరా అనీ పిలుస్తారు.దుర్గా పూజ 5 రోజులు జరుగుతుంది, ఒక్కోరోజు దుర్గా దేవిని ఒక్కో పేరుతో పిలుస్తారు.
దుర్గాపూజలో దుర్గా మాతని జగన్మాతగా కొలుస్తారు.కేవలం హిందూ మతంలో మాత్రమే తల్లికీ, దేవుడితో సమానమైన హోదా ఇచ్చారు.ప్రపంచంలో మిగతా బంధాల కంటే అమ్మతో ఉన్న బంధం ప్రత్యేకమైనది.అందుకే దేవుడిని కూడా అమ్మతో పోల్చి దుర్గా మాత అని పిలుస్తాము.
జగన్మాత అయిన ఆ దుర్గా మాతకి వందనాలు.మానవులందరిలో దయ,బుద్ధి,అందం తదితర రూపాలలో కొలువయ్యుండే మాత లయకారుడైన పరమశివుని ఇల్లాలు.ఈ ఆర్టికిల్ ద్వారా దుర్గా పూజ జరిగే 5 రోజుల ప్రాశస్త్యాన్ని వివరించాము.ఒక్కోరోజు పూజలో ఏమేమి చేస్తారు, చేసే పద్దతి తదితర వివరాలు పొందుపరిచాము చూడండి.

మహా షష్ఠి:
తన పిల్లలయిన సరస్వతి,లక్ష్మి గణేశుడు,కార్తికేయునితో కలిసి సీంహ వాహనం మీద అమ్మ భూలోకనికి దిగి వచ్చే రోజిది.షష్ఠి పూజ రోజున అమ్మ ఒక్క దర్శనాన్ని భక్తులకి కల్పిస్తారు.దానికి ముందు ముఖ్య పూజలయిన ఆమంత్రణ్,బోధన్,అదిబష్ పూజలు చేస్తారు బెంగాలీలు.ఢాక్ అనే ఒక రకమైన వాయిద్యాన్ని వాయించడం ద్వారా అమ్మ రాకని తెలియచేస్తారు.

మహా సప్తమి:
మహా సప్తమి రోజున మహా పూజ మొదలవుతుంది.సూర్యోదయానికి ముందే ఒక అరటి చెట్టుని పవిత్ర జలాల్లో ముంచి తీసి దానికి కొత్త పెళ్ళి కూతురిలాగ చీర కడతారు.దీనినే "కోలా బౌ" అనీ "నబ పత్రిక" అనీ పిలుస్తారు.ఈ పూజని పీఠం మీద గణేశుని ప్రతిమ పక్కన చేస్తారు.ఈ పూజలో అదృష్టాన్ని ప్రసాదించమని దుర్గా మాతని వేడుకుంటారు.ఇదే రోజు 9 రకాల మొక్కలని కూడా దుర్గా అవతారాలుగా భావించి పూజిస్తారు.

మహా అష్ఠమి:
శాస్త్రాల ప్రకారం మహిషాసురుడిని అమ్మ సంహరించిన రోజిది.చెడుని రూపు మాపబడిందనే సంకేతం ఇవ్వడానికి పూర్వకాలంలో గేదెని మహారాజుకి ఇచ్చేవారు.సంస్కృతంలో ఉన్న "అంజలి" అని పిలువబడే శ్లోకాలని చదువుతూ అమ్మని ప్రస్తుతిస్తారు.ఇదే రోజున కుమారీ పూజ కూడా చేస్తారు. కుమారీ పూజ అంటే 9 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న అమ్మాయిలని దుర్గా మాతగా భావించి పూజ చేస్తారు.మహా అష్టమి, మహా నవమిల కలయిక అయిన సాయాంకాలం సంధి పూజ చేస్తారు.

మహా నవమి:
సంధి పూజ అవ్వగానే మహా నవమి పూజ మొదలయ్యి మహా ఆరతితో ముగుస్తుంది.దుర్గా పూజ నిర్వహించే వివిధ కమిటీలన్నీ కలిసి భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

మహా దశమి:
దుర్గా పూజ చివరి రోజు "మహా దశమి".ఈరోజున దుర్గా మాత విగ్రహాన్ని పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేస్తారు.దేనినే "దుర్గా మాత విసర్జన్" అంటారు.నిమజ్జనం రోజున దుర్గా మాత విగ్రహాన్ని ఉత్సవంలాగా ఊరెరిగిస్తూ తీసుకెళ్తారు. ఈ ఉత్సవంలో భక్తితో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.వివాహమిన స్త్రీలందరూ ఒకరిమీద ఒకరు సింధూరాన్ని చల్లుకుంటారు. దీనినే "సింధూర్ ఖేలా" అంటారు.దుర్గా మాతని నిమజ్జనం చేసాక ఇండ్లకి తిరిగి వచ్చి స్నేహితులు, బంధువుల ఇళ్ళకి వెళ్ళి "విజయ దశమి" శుభాకాంక్షలు తెలియచేస్తారు.విజయదశమి రోజు బంధు మిత్రులతో కలిసి అనేక పిండి వంటలు చేసుకుని కలిసి భోజనం చేస్తారు.



Click it and Unblock the Notifications











