Latest Updates
-
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు!
బోరోదేవి దేవాలయంలో ఆసక్తికర విషయాలు: మానవుని రక్తాన్ని సమర్పణ!
దేవాలయాలను భూమిపై అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా భావిస్తారు. కానీ ప్రజలు కొన్ని మూఢనమ్మకాలను పాటించడం వలన చాలా వింతగా ఉంటాయి.
ఇంటి పైకప్పు నుండి పిల్లలను విసరడం నుండి కాళ్ళకి ఏమి లేకుండా (బేర్ఫుట్ వాకింగ్ ) నడవడం వరకు, వివిధ ఆచారాల పేర్లతో ప్రజలు దేవుళ్లను సంతోషపెట్టడానికి చేసే అనేక రకాల వింత పద్ధతులున్నాయి.
మానవ రక్తాన్ని దేవుళ్ళకి ప్రసాదంగా అందించే ఆచారం ఇప్పటికీ కొన్ని పురాతన ఆలయాలలో పాటిస్తున్నారని మీకు తెలుసా? ఇది శతాబ్దాలుగా ఇక్కడ అనుసరించ బడుతున్న వింత ఆచారం మరియు దీన్ని ఇప్పటికీ నిషేధించకుండా ఉండటం, ప్రజలు ఇంకా దానిని అనుసరించడం నిజంగా ఆశ్చర్యకరం!
మానవ రక్తాన్ని సమర్పణ చేస్తున్న బోరోదేవి ఆలయం యొక్క వింత ఆచారం వెనుకగల చరిత్రను చూడండి.

ఇక్కడ జంతువులకు బదులుగా మనుషులను త్యాగం చేసేవాళ్ళు.....
ఇతర ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయం కొంచం భిన్నం గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు దేవుళ్ళని సంతోషపరచడానికి మానవుల రక్తాన్ని బలి ఇచ్చేవాళ్ళు. ఈ మానవుల త్యాగ సాధన సుమారు 250 సంవత్సరాలకు ముందే నిషేధించబడింది. దానిని నిషేధించడానికి ముందువరకు మానవులను త్యాగం చేసేవాళ్ళు.

మానవ రక్తాన్ని త్యాగం చేస్తున్న దాని గురించి మరికొన్నివిషయాలు......
ప్రతి అష్టమి రోజు రాత్రి, మూసిన తలుపుల వెనుక ఈ పూజను నిర్వహిస్తారు, దీనిలో మానవ రక్తపు సమర్పణ యొక్క వింత సంప్రదాయం 52 ఏళ్ల షిబెద్ర నాథ్ రే ద్వారా చేయబడుతుంది.ఇక్కడి భక్తులు మానవ రక్తం సమర్పించకుండా పూజ పూర్తవదని విశ్వసిస్తారు.

ఈ మూఢ నమ్మకానికి విముక్తి కలిగింది.
రాజ్యంలోని అన్ని మతపరమైన కార్యకలాపాలను చూసుకునేందుకు భక్షి అనే వ్యక్తి రాజుచేత నియమింపబడ్డాడు. మానవ బలి యొక్క దృశ్యాలు చాలా గోరంగా ఉండటం వలన అతడు ఈ వింత ఆచారాన్ని నిషేధించమని రాజును బ్రతిమాలాడాడు.

ప్రస్తుతం, ఇది 3 చుక్కల రక్తంతో కొనసాగించబడుతోంది
మానవులను బలి ఇవ్వడం నిషేధించిన తరువాత, ప్రజలు శిరచ్ఛేద శిలలపై 3 రక్తపు చుక్కలని అందించడం ప్రారంభించారు. మానవ రక్తం ఇవ్వకపోతే పూజ అసంపూర్తి అవుతుందని ఇక్కడి పండితులు నమ్ముతారు.
మీరూ ఈ ప్లేస్ ని చూడాలనుకుంటున్నారా? దిగువ వ్యాఖ్య విభాగంలో దీని మీద గల మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.



Click it and Unblock the Notifications











