Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
బోరోదేవి దేవాలయంలో ఆసక్తికర విషయాలు: మానవుని రక్తాన్ని సమర్పణ!
దేవాలయాలను భూమిపై అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా భావిస్తారు. కానీ ప్రజలు కొన్ని మూఢనమ్మకాలను పాటించడం వలన చాలా వింతగా ఉంటాయి.
ఇంటి పైకప్పు నుండి పిల్లలను విసరడం నుండి కాళ్ళకి ఏమి లేకుండా (బేర్ఫుట్ వాకింగ్ ) నడవడం వరకు, వివిధ ఆచారాల పేర్లతో ప్రజలు దేవుళ్లను సంతోషపెట్టడానికి చేసే అనేక రకాల వింత పద్ధతులున్నాయి.
మానవ రక్తాన్ని దేవుళ్ళకి ప్రసాదంగా అందించే ఆచారం ఇప్పటికీ కొన్ని పురాతన ఆలయాలలో పాటిస్తున్నారని మీకు తెలుసా? ఇది శతాబ్దాలుగా ఇక్కడ అనుసరించ బడుతున్న వింత ఆచారం మరియు దీన్ని ఇప్పటికీ నిషేధించకుండా ఉండటం, ప్రజలు ఇంకా దానిని అనుసరించడం నిజంగా ఆశ్చర్యకరం!
మానవ రక్తాన్ని సమర్పణ చేస్తున్న బోరోదేవి ఆలయం యొక్క వింత ఆచారం వెనుకగల చరిత్రను చూడండి.

ఇక్కడ జంతువులకు బదులుగా మనుషులను త్యాగం చేసేవాళ్ళు.....
ఇతర ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయం కొంచం భిన్నం గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు దేవుళ్ళని సంతోషపరచడానికి మానవుల రక్తాన్ని బలి ఇచ్చేవాళ్ళు. ఈ మానవుల త్యాగ సాధన సుమారు 250 సంవత్సరాలకు ముందే నిషేధించబడింది. దానిని నిషేధించడానికి ముందువరకు మానవులను త్యాగం చేసేవాళ్ళు.

మానవ రక్తాన్ని త్యాగం చేస్తున్న దాని గురించి మరికొన్నివిషయాలు......
ప్రతి అష్టమి రోజు రాత్రి, మూసిన తలుపుల వెనుక ఈ పూజను నిర్వహిస్తారు, దీనిలో మానవ రక్తపు సమర్పణ యొక్క వింత సంప్రదాయం 52 ఏళ్ల షిబెద్ర నాథ్ రే ద్వారా చేయబడుతుంది.ఇక్కడి భక్తులు మానవ రక్తం సమర్పించకుండా పూజ పూర్తవదని విశ్వసిస్తారు.

ఈ మూఢ నమ్మకానికి విముక్తి కలిగింది.
రాజ్యంలోని అన్ని మతపరమైన కార్యకలాపాలను చూసుకునేందుకు భక్షి అనే వ్యక్తి రాజుచేత నియమింపబడ్డాడు. మానవ బలి యొక్క దృశ్యాలు చాలా గోరంగా ఉండటం వలన అతడు ఈ వింత ఆచారాన్ని నిషేధించమని రాజును బ్రతిమాలాడాడు.

ప్రస్తుతం, ఇది 3 చుక్కల రక్తంతో కొనసాగించబడుతోంది
మానవులను బలి ఇవ్వడం నిషేధించిన తరువాత, ప్రజలు శిరచ్ఛేద శిలలపై 3 రక్తపు చుక్కలని అందించడం ప్రారంభించారు. మానవ రక్తం ఇవ్వకపోతే పూజ అసంపూర్తి అవుతుందని ఇక్కడి పండితులు నమ్ముతారు.
మీరూ ఈ ప్లేస్ ని చూడాలనుకుంటున్నారా? దిగువ వ్యాఖ్య విభాగంలో దీని మీద గల మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.



Click it and Unblock the Notifications