Latest Updates
-
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే.. -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే! -
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం!
బోరోదేవి దేవాలయంలో ఆసక్తికర విషయాలు: మానవుని రక్తాన్ని సమర్పణ!
దేవాలయాలను భూమిపై అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా భావిస్తారు. కానీ ప్రజలు కొన్ని మూఢనమ్మకాలను పాటించడం వలన చాలా వింతగా ఉంటాయి.
ఇంటి పైకప్పు నుండి పిల్లలను విసరడం నుండి కాళ్ళకి ఏమి లేకుండా (బేర్ఫుట్ వాకింగ్ ) నడవడం వరకు, వివిధ ఆచారాల పేర్లతో ప్రజలు దేవుళ్లను సంతోషపెట్టడానికి చేసే అనేక రకాల వింత పద్ధతులున్నాయి.
మానవ రక్తాన్ని దేవుళ్ళకి ప్రసాదంగా అందించే ఆచారం ఇప్పటికీ కొన్ని పురాతన ఆలయాలలో పాటిస్తున్నారని మీకు తెలుసా? ఇది శతాబ్దాలుగా ఇక్కడ అనుసరించ బడుతున్న వింత ఆచారం మరియు దీన్ని ఇప్పటికీ నిషేధించకుండా ఉండటం, ప్రజలు ఇంకా దానిని అనుసరించడం నిజంగా ఆశ్చర్యకరం!
మానవ రక్తాన్ని సమర్పణ చేస్తున్న బోరోదేవి ఆలయం యొక్క వింత ఆచారం వెనుకగల చరిత్రను చూడండి.

ఇక్కడ జంతువులకు బదులుగా మనుషులను త్యాగం చేసేవాళ్ళు.....
ఇతర ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయం కొంచం భిన్నం గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు దేవుళ్ళని సంతోషపరచడానికి మానవుల రక్తాన్ని బలి ఇచ్చేవాళ్ళు. ఈ మానవుల త్యాగ సాధన సుమారు 250 సంవత్సరాలకు ముందే నిషేధించబడింది. దానిని నిషేధించడానికి ముందువరకు మానవులను త్యాగం చేసేవాళ్ళు.

మానవ రక్తాన్ని త్యాగం చేస్తున్న దాని గురించి మరికొన్నివిషయాలు......
ప్రతి అష్టమి రోజు రాత్రి, మూసిన తలుపుల వెనుక ఈ పూజను నిర్వహిస్తారు, దీనిలో మానవ రక్తపు సమర్పణ యొక్క వింత సంప్రదాయం 52 ఏళ్ల షిబెద్ర నాథ్ రే ద్వారా చేయబడుతుంది.ఇక్కడి భక్తులు మానవ రక్తం సమర్పించకుండా పూజ పూర్తవదని విశ్వసిస్తారు.

ఈ మూఢ నమ్మకానికి విముక్తి కలిగింది.
రాజ్యంలోని అన్ని మతపరమైన కార్యకలాపాలను చూసుకునేందుకు భక్షి అనే వ్యక్తి రాజుచేత నియమింపబడ్డాడు. మానవ బలి యొక్క దృశ్యాలు చాలా గోరంగా ఉండటం వలన అతడు ఈ వింత ఆచారాన్ని నిషేధించమని రాజును బ్రతిమాలాడాడు.

ప్రస్తుతం, ఇది 3 చుక్కల రక్తంతో కొనసాగించబడుతోంది
మానవులను బలి ఇవ్వడం నిషేధించిన తరువాత, ప్రజలు శిరచ్ఛేద శిలలపై 3 రక్తపు చుక్కలని అందించడం ప్రారంభించారు. మానవ రక్తం ఇవ్వకపోతే పూజ అసంపూర్తి అవుతుందని ఇక్కడి పండితులు నమ్ముతారు.
మీరూ ఈ ప్లేస్ ని చూడాలనుకుంటున్నారా? దిగువ వ్యాఖ్య విభాగంలో దీని మీద గల మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.



Click it and Unblock the Notifications