Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
దీపావళిని దీపాల పండగ అని ఎందుకు అంటారు?
దీపావళిని ప్రముఖంగా దీపాల పండగ అనికూడా పిలుస్తారు ; హిందువులకి ఎంతో ముఖ్యమైనది ఈ పండగ; దీన్ని దేశవ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దీవాలి అని కూడా పిలిచే ఈ పండగ రెండు పదాలు 'దీప్’ మరియు 'ఆవళి’ అంటే దీపాల వరుసతో పేరుపొందింది.
దీపావళిని ఎప్పుడు జరుపుకుంటారు?
దీపావళిని అశ్విని నెలలో జరుపుకుని కార్తీక మాసంలో కూడా చాంద్రమానం ప్రకారం కొనసాగిస్తారు. నాలుగు రోజులు సాగే ఈ పండగలో ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. పండగ ముఖ్యమైన దేవత లక్ష్మీదేవి మరియు లక్ష్మీపూజ పండగ ఉత్సవంలో ముఖ్యమైనది. ఆమె సంపదకి అధినేత్రి కావటంతో, పూజ జరిపి ఏడాదిపొడుగునా ఐశ్వర్యం వరంగా పొందాలని భావిస్తారు.

దీపావళి విశిష్టత
ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండగని దేశమంతా కలిసి జరుపుకుంటారు. పంటలు పండే రుతువు అయిపోయిందనటానికి గుర్తుగా మరియు చలికాలం ప్రారంభాన్ని ఈ పండగ సూచిస్తుంది. ఈ పండగ ముఖ్యసారం చెడుపై మంచి గెలవటం.
దీపావళి ఎందుకు జరుపుకుంటారు?
దీపావళి ఉత్సవాలకి వెనుక అనేక కథలున్నాయి. అందులో ప్రసిద్ధమైనది భగవాన్ శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్యకి తిరిగొచ్చాడన్న కథ. లంక రాజైన రావణుడు శ్రీరాముడి ప్రియమైన భార్య సీతను వారు వనవాసంలో ఉన్నప్పుడు అపహరించాడు.
సీతను రక్షించటానికి రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధం పదిరోజులు సాగి చివరన రాముడు రావణుడిని ఓడించాడు.పద్నాలుగేళ్ల వనవాసం తర్వాత అయోధ్యకి తిరిగిరావటం, రావణుడిని ఓడించటం సందర్భంగా దీపావళి పండగను చేసుకుంటారు. అందుకని ఈ పండగ చెడుపై మంచి గెలవటానికి ప్రతీక.

దీపావళి రోజు మిఠాయిలు బహుమతిగా ఇచ్చే సంప్రదాయం
దీపావళి వైశిష్ట్యం
మరో కథనం ప్రకారం, దీపావళిని లక్ష్మీదేవి, విష్ణుమూర్తి వివాహ సందర్భంగా జరుపుకుంటారు.
శక్తికి రూపమైన కాళి అమ్మవారిని ఈ రోజున బెంగాల్ లో చాలా ప్రాంతాల్లో పూజిస్తారు. శుభప్రదంగా పూజించే వినాయకుడిని కూడా ఈ రోజున పూజిస్తారు.
దీపాల పండగ, దీపావళి
ప్రమిదలతో దీపాలను, ఎలక్ట్రిక్ లైట్లతో అలంకరించటం పండగలో ముఖ్యభాగం. ప్రతిచోటును దీపాలతో అలంకరిస్తారు. రంగురంగుల ముగ్గులు మరియు పువ్వులతో అన్నిచోట్లు మీకు రంగులతో కన్పిస్తాయి. ప్రతి మూలా, ఇల్లైనా, షాపులైనా బాగా కడిగి అలంకరిస్తారు. తోరణాలు, మండపాలను అన్నిచోట్లా చూస్తారు.

దీపావళి విశిష్టత
ఆకాశం బాణసంచా వెలుగుల్లో, వాటి శబ్దాలతో మెరిసిపోతూ మనకు పండగ సందోహాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. ఈ సంప్రదాయాలన్నిటికీ వెనుక చాలా కారణాలున్నాయి. దీపాలు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆకర్షిస్తుందని అంటారు. అదేకాక దీపాలు చీకటిని ఓడించి, తరిమేసి ఎప్పుడూ విజయం సాధిస్తుందని సూచిస్తుంది.
బాణసంచా శబ్దాలు పైలోకాల్లో ఉన్న దేవతలకి మన ఆనందోల్లాసాలను సందేశంగా పంపిస్తాయి. అది కూడా మంచి, చెడుపై విజయం సాధిస్తుందని సూచన. తాజా పూలు మరియు రంగురంగుల ముగ్గులను దేవతలను మెప్పించటానికి, మన ఇంటికి ఆహ్వానించటానికి చేస్తారు. అయోధ్య ప్రజలు నగరం మొత్తాన్ని దీపాలతో అలంకరించి శ్రీరాముడు తిరిగొచ్చాడన్న విషయాన్ని సాంప్రదాయ ఉత్సవంగా జరుపుకుంటారు.
మరో సంప్రదాయం ఏంటంటే దీపావళి నాడు పేకాడటం. దీపావళినాడు ఎవరైతే డబ్బుతో జూదం ఆడితే, వారికి ఏడాది పొడుగునా డబ్బు ఎక్కువగా లభిస్తుందని అంటారు. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు కూడా విష్ణుమూర్తితో పేక ఆడిందని అంటారు.



Click it and Unblock the Notifications