శరీరంలోని ముఖ్య భాగాలకు కావాల్సిన ఆహార పదార్థాలేంటి ?

By Nutheti

మీకు ఆకలేస్తోందని.. ఏది పడితే అది లాగించేస్తున్నారు. అయితే బీ కేర్ ఫుల్. ఇటీవల జరిగిన ఓ రీసెర్చ్ అలా తింటున్న ఆహారం మంచిది కాదని తేల్చింది. 90 శాతం కంటే ఎక్కువ మంది.. సరైన ఆహారం తీసుకోవడం లేదట. వాళ్లు తింటున్న ఆహారం శరీరంపై దుష్ర్పభావం చూపుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

తీసుకునే ఆహారం ఏదైనా.. శరీరానికి హాని చేయనిదైతే మంచిది. మనం తీసుకునే ఆహారం బాగుంటే.. మన శరీరంలోని అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎరుపు రంగు ఉన్న ఆహార పదార్థాలు తింటే.. గుండె, రక్తానికి మంచిది. అలాగే ఆకుకూరలైతే కంటికి మంచిది. ఇలా రోజూ తీసుకునే ఆహారాన్ని శరీరంలోని అన్ని భాగాలకు ఉపయోగపడేలా చూసుకుంటే.. మీ జీవితం పదికాలాలపాటు చల్లగా ఉంటుంది. శరీరంలోని ఏ భాగానికి ఎలాంటి ఆహారం మంచిదో చూద్దాం..

మెదడు

మెదడు

మెదడు పనితీరు సరిగా ఉండాలంటే.. సార్డీన్ చేపలు, సాల్మాన్ చేపలు, ట్యూనా చేపలతో పాటు వాల్ నట్స్ బాగా తీసుకోండి. వీటి వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరగడంతో పాటు.. ఏకాగ్రత పెరుగడానికి సహకరిస్తాయి.

కండరాలు

కండరాలు

అరటిపండ్లు, మాంసం, కోడిగుడ్లు, చేపలు.. ఈ నాలుగింటిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. మీ కండరాలు బలపడతాయి. వీటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. కండరాలతో పాటు ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది.

ఊపిరితిత్తులు

ఊపిరితిత్తులు

ఆకుపచ్చ రంగులో ఉండే ఎలాంటి ఆహారమైనా.. అంటే ఆకుకూరలు, కూరగాయలు.. ఊపిరితిత్తులకు మంచిది. బ్రొకోలి, మొలకెత్తిన గింజలు, క్యాబేజీ వంటి కూరగాయల్లో.. విటమిన్ కే ఉంటుంది. ఇలాంటివి వారానికి రెండుసార్లైనా తీసుకుంటే మంచిది.

చర్మం

చర్మం

చర్మ సంరక్షణకు.. యాంటీయాక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. బ్లూబెర్రీస్, సాల్మాన్ చేపలు, గ్రీన్ టీ తీసుకోండం వల్ల చర్మంపై ఉండే మృతకణాలను తొలగింగి... చర్మ కాంతిని పెంచుతాయి.

కళ్లు

కళ్లు

క్యారెట్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ తో పాటు పోషకాలు మెండుగా ఉండే కోడిగుడ్లు, మొక్కజొన్న తీసుకుంటే మంచిది.

గుండె

గుండె

గుండె ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవాలంటే.. ఎరుపు రంగు ఉండే పండ్లు రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవాలి. గుండెకు రక్తప్రసరణ సరైన క్రమంలో జరగడానికి పండ్లు సహాయపడతాయి. ఎండు ద్రాక్ష రసం, టమోటాలు, ఆలూ కూడా గుండె ఆరోగ్యానికి మంచిది.

బోవెల్స్

బోవెల్స్

పేగుల పనితీరు గాడిలో ఉండాలంటే.. అరటిపండ్లు, ఓట్స్, ఎండు ద్రాక్ష రసం.. వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలి. పెరుగు నిత్యం తీసుకోవడం వల్ల మూత్రాశయ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

ఎముకలు

ఎముకలు

ఎముకలు పుష్టిగా, బలంగా ఉండాలంటే.. పాలు, ఆకుకూరలు, విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లు నారింజ వంటివి తీసుకోవాలి. చిన్నారులకు క్రమం తప్పకుండా.. ఇలాంటి ఆహారం ఇవ్వడం వల్ల వాళ్ల ఎముకలు బలంగా ఉంటాయి.

Story first published: Friday, September 25, 2015, 11:56 [IST]
Desktop Bottom Promotion