Latest Updates
-
ఘుమఘుమలాడే దోసకాయ మటన్..వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే ఆహా స్వర్గమే! -
రోజూ 10 వేల అడుగులు పూర్తి చేయాలంటే ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఎన్ని కేలరీలు కరుగుతాయి? -
వేడి వేడి అన్నంలోకి అమృతం లాంటి ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నెలు గిన్నెలు తాగేస్తారు! -
స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇంట్లోనే..ఎలాంటి సాస్ లు లేకుండానే అదిరిపోయే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్.. -
పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కేవలం 15 నిమిషాల్లో రెడీ! -
ఎప్పుడూ అలసిపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ విటమిన్ తగ్గినట్లే..డాక్టర్ చెప్పిన సంచలన నిజం! -
కరకరలాడే కాకరకాయ కాజు ఫ్రై..ఒక్కసారి వండితే రుచి మర్చిపోలేరు..అన్నం, పప్పు, రసంలోకి కేక! -
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే..
వైసీపీలోకి జేసీ వారసుడు - సీమలో మారుతున్న లెక్కలు..!?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2029 ఎన్నికలు లక్ష్యంగా పార్టీ లు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కొందరు ముఖ్య నేతలు వచ్చే ఎన్నికల్లో సీట్ల పైన ఆశ పెట్టుకున్నారు. ఇక.. 2024 ఎన్నికల్లో అనూహ్య ఓటమి చవి చూసిన జగన్.. ఇప్పుడు తన రూటు మార్చారు. ప్రతీ సీటు పైన ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో భాగంగా టీడీపీకి బలమైన నేతలుగా ఉన్న వారి పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో జేసీ వారసుడు వైసీపీలోకి ఎంట్రీ పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది.
అనంతపురం జిల్లాలో కొత్త రాజకీయాలు కనిపిస్తున్నాయి. జేసీ దివాక్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో పవన్ రెడ్డి టీడీపీ నుంచి అనంతపురం ఎంపీగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి తలారి రంగయ్య చేతిలో పవన్ ఓడిపోయారు. ఇక, 2024 ఎన్నికల్లో టీడీపీ జేసీ కుటుంబానికి ఒక సీటు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. ఫలితంగా జేసీ ప్రభాక్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి సీటు కేటాయించారు. కాగా, అస్మిత్ గెలుపొందారు. ఇక.. పవన్ పూర్తిగా వ్యాపారాలకే పరిమితం అయ్యారు. పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని తాను కోరుకుంటున్నట్లు జేసీ కుటుంబం పదే పదే చెబుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ జేసీ కుటుంబానికి టీడీపీలో ఒక సీటు మాత్రమే దక్కే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

ఈ సమయంలో పవన్ రెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. జగన్ తో చిన్నప్పటి నుంచి పవన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా విభేదించినా.. ఇప్పుడు మాత్రం జేసీ కుటుంబం నుంచి జగన్ పైన విమర్శల జోరు తగ్గింది. కొంత కాలం క్రితమే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా పని చేసిన శైలజానాధ్ వైసీపీలో చేరే సమయంలో పవన్ రెడ్డిని కలిసారు. తాను వైసీపీలో చేరుతున్న అంశాన్ని చర్చించారు.

ఆ సమయంలోనే పవన్ వైసీపీలో చేరుతున్నారనే చర్చ జరిగినా.. ఆయన ఖండించారు. కాగా.. ఇప్పుడు తిరిగి అదే చర్చ మొదలైంది. పవన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు నిజంగానే సిద్దమయ్యారా... జేసీ కుటుంబంతో రాజకీయంగా పోరాటం చేస్తున్న వైసీపీ నేతలు ఇందుకు మద్దతిస్తారా అనేది కీలకంగా మారుతోంది. అయితే, ప్రచారం సాగుతున్నట్లుగా పవన్ వైసీపీలోకి వచ్చేందుకు ముందుకు వస్తే.. జగన్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. చివరకు జేసీ పవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
Credit: Oneindia



Click it and Unblock the Notifications











