Latest Updates
-
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
నవరాత్రి స్పెషల్-బాదూషా తయారీ విధానం (వీడియోతో)
నవరాత్రులంటే మనందరికీ ఇష్టమే, ఈపాటికే ఏర్పాట్లు మొదలయిపోయుంటాయి కదా.నవరాత్రుల ఏర్పాట్లంటే మన ఇల్లు శుభ్రం చేసుకోవడం, దుర్గా మాత విగ్రహాల తయారీ మాత్రమే కాదు, రక రకాల పిండివంటల తయారీ కూడా.అందుకే సులభంగా మీరు ఈ నవరాత్రుల్లో తయారు చేసుకోవడానికి బాదూషా తయారీ ఇచ్చాము.బాదూషా తయారీ అంటే చాలా కష్టమని మనలో చాలామంది భావిస్తారు, కానీ చాలా సులభం తెలుసా??
క్రింద మేము ఇచ్చిన వీడియో లో బాదూషా ఎలా చెయ్యాలో వివరంగా వివరించబడింది.ఇంక ఆలశ్యమెందుకు, నోరూరించే బాదూషా చేసేయ్యండి మరి.
బాదూషా తయారీకి ముందు అన్నీ సిద్ధం చేసుకోవడానికి పట్టే సమయం:20 నిమిషాలు
బాదూషా తయారీకి పట్టే సమయం:30 నిమిషాలు
ఎంత మందికి సరిపోతుంది:4
కావాల్సిన పదార్ధాలు:
- మైదా-ఒక కప్పు
- నెయ్యి-రెండు టీస్పూన్లు
- బేకింగ్ సోడా-చిటికెడు
- పెరుగు/యోగర్ట్-అర కప్పు
- పంచదార- ఒక కప్పు
- నీళ్ళు-ఒక కప్పు
- ఏలకుల పొడి-చిటికెడు
- నూనె-వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
1.ఒక బౌల్ తీసుకుని దానిలో పెరుగు/యోగర్ట్,నెయ్యి, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.

2.ఒక వెడల్పాటి గిన్నెలో మైదా వేసి దానిలో మెల్లిగా పెరుగు వేస్తూ చపాతీ పిండిలా కలపాలి.

3.ఈ కలిపిన పిండిని పది నిమిషాలు నాననివ్వాలి.

4.గిన్నెలో నీళ్ళు తీసుకుని దానిలో పంచదార వేసి పంచదార పాకం వచ్చేంతవరకూ మరిగించాలి.పాకం తయారీలో స్టౌ మంట సన్నగా ఉండాలి.పల్చటి సిరప్ లా అయ్యేవరకూ నీళ్ళూ పంచదార మీశ్రమాన్ని స్టౌ మీద ఉంచాలి.


6.పాకం వచ్చాకా స్టౌ కట్టేసి ఏలకుల పొడి కలపాలి.

7.కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ప్యాటీస్ లాగ చెయ్యాలి.కావాలనుకుంటే ప్యాటీల చివర్లు లోపలకి మడిచి అందంగా కూడా తయారుచేసుకోవచ్చు.

8.మూకుడులో నూనె వేడి చేసి,ఈ ప్యాటీలని మెల్లిగా నూనెలో వెయ్యాలి.

9.సన్నని సెగ మీద బాదూషా పూర్తిగా వేగేవరకూ వేయించుకోవాలి.

10.బ్రౌన్ కలర్ వచ్చాకా బాదూషా ని నూనెలో నుండి తీసి 2-3 నిమిషాలు పక్కన ఉంచాలి.

11.పక్కన పెట్టుకున్న బాదుషాలని పంచదార పాకంలో వేసి రాత్రంతా నాననివ్వాలి.

12.మరునాడు డ్రై ఫ్రూట్స్ తో అలకరించుకుని ఈ నవరాత్రుల్లో నోరూరించే బాదుషాని ఆస్వాదించండి.




Click it and Unblock the Notifications











