For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ganesh Chaturthi Special:వినాయక ప్రతిమలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా...

గణేష్ నిమజ్జనం సంప్రదాయ కథ మనకు ఏమి చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో తెలిసిందే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకల్లో యువత హడావుడి.. కుర్రకారు జోరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

What is the story behind the tradition of Ganesh visarjan in Telugu

ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలన్నీ ఒక ఎత్తు అయితే.. నిమజ్జనోత్సవం మరో ఎత్తు. ఇలా వినాయకుని ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి.

What is the story behind the tradition of Ganesh visarjan in Telugu

ఈ సందర్భంగా వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక ఉన్న కథేంటి? ఎందుకని నీటిలోనే గణేశుడిని నిమజ్జనం చేస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Ganesh Visarjan 2021:గణేష్ నిమజ్జనం ఎప్పుడు చేస్తారు?Ganesh Visarjan 2021:గణేష్ నిమజ్జనం ఎప్పుడు చేస్తారు?

వర్షాకాలంలో..

వర్షాకాలంలో..

ప్రకృతి పరంగా చూస్తే.. వినాయక చవితి వర్షాకాలంలో ప్రారంభంలో వస్తుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి.. ఆ మట్టితో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులలో, నదులలో, ప్రవహించే నీటిలో నిమజ్జనం చేస్తారు.

అలా మట్టి తీస్తే..

అలా మట్టి తీస్తే..

చెరువులలో విగ్రహాల కోసం మట్టిని తీయడం వల్ల.. చెరువుల్లో లోతు పెరుగుతుంది. ఆ తర్వాత ఆయుర్వేద గుణాలున్న పత్రితో కలిపి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు సులువుగా పారే అవకాశం ఉంటంది. అదే సమయంలో అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి.

ఆరోగ్య సమస్యలు రాకుండా..

ఆరోగ్య సమస్యలు రాకుండా..

ఇలాంటి నీటిని తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చాలా మంది నమ్మకం. ఎందుకంటే విగ్రహాలను తయారు చేసేందుకు ఉపయోగించిన మట్టి, పత్రి, గరిక ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే క్రిమికీటకాలన్నీ చనిపోతాయి. దీని వల్ల నీరు శుద్ధి అవుతుంది.

ఈ 3 రాశుల వారికి వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి...ఈ 3 రాశుల వారికి వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి...

పౌరాణిక కథల ప్రకారం..

పౌరాణిక కథల ప్రకారం..

వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక పౌరాణిక కారణాలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం.. వినాయకుడు కైలాసం నుండి భూలోకానికి వచ్చి కేవలం పది రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్లిపోతాడు.

కైలాసానికి దూరంగా..

కైలాసానికి దూరంగా..

భూలోకానికి వచ్చిన వినాయకుడు పది రోజుల పాటు కైలాసానికి దూరంగా ఉంటాడని.. పదిరోజుల పాటు నిత్యం పూజలందుకుని.. తిరిగి కైలాసానికి రమ్మని పార్వతీదేవి పంపినట్లు పెద్దలు చెబుతుంటారు. అయితే అందులో ఎంత వాస్తవం ఉందన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. దీనికి మరో కారణం కూడా ఉందంటారు.

దైవత్వం పోతుందని..

దైవత్వం పోతుందని..

ఏ దేవుని విగ్రహం అయినా మట్టితో చేస్తే అది కేవలం తొమ్మిది రోజులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని.. ఆ తర్వాత అందులో దైవత్వం పోతుందని.. అందుకే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయాలని కూడా కొందరు చెబుతుంటారు. వినాయక నిమజ్జనంతో పాటు దుర్గామాత విగ్రహాలను కూడా నవరాత్రులు పూర్తయ్యాక నిమజ్జనం చేసే విషయం గురించి మనకు తెలిసిందే.

English summary

What is the story behind the tradition of Ganesh visarjan in Telugu

Here we are taking about the what is the story behind the tradition of ganesh visarjan in Telugu. Read on
Story first published:Monday, September 13, 2021, 15:26 [IST]
Desktop Bottom Promotion