Just In
సీతాఫలం పండును తినడం వల్ల జలుబు చెయ్యదు! మీరు హ్యాపీగా తినవచ్చు
సీతాఫలం తింటే జలుబు చెయ్యదు, భయపడకుండా పొట్ట నిండా తినండి
శరీరంలో ఎక్కువ వేడిని (లేదా) చల్లదనాన్ని పెంచే పండ్లను తినేటప్పుడు, మన తల్లిదండ్రులు మనకు ఎన్ని సార్లు అడ్డుపడ్డారు ? దానికి సమాధానం, దాదాపు అన్ని సమయాల్లోనూ మనకు అడ్డుపడ్డారు !
పండ్లు
అనేవి
చాలా
ఆరోగ్యకరమైనవి
&
రుచికరమైనవి,
ఇవి
ప్రతి
ఒక్కరి
ఆహారంలో
తప్పనిసరి
భాగంగా
ఉంటాయి.
మనము
అన్ని
రకాల
పండ్లను
తినడం
చాలా
ముఖ్యం
ఎందుకంటే,
ప్రతి
విభిన్నమైన
పండ్లలో
వివిధ
రకాల
పోషకాలను
కలిగి
ఉంటాయి.
అలా
అవి
వాటి
ప్రత్యేకతను
కలిగి
ఉంటాయి.
కానీ
కొన్ని
సమయాల్లో
మనము
కొన్ని
పండ్లను
తినడానికి
అనుమతించబడదు,
ఎందుకంటే
అవి
చలిజ్వరాన్ని
కలుగచేసేందుకు
కారణమవుతాయి.
మామిడి, బొప్పాయి వంటి పండ్లు శరీరానికి వెచ్చదనాన్ని (లేదా) శరీర ఉష్ణాన్ని పెంచే పండ్లుగా పిలుస్తారు. అరటి & సీతాఫలం వంటి ఇతర పండ్లు శీతల లక్షణాలను కలిగి ఉండటం చేత మీకు జలుబును కలుగజేసేవిగా ఉంటాయి. ఇలాంటి పండ్ల వినియోగంపై మనము తరచుగా పరిమితులను కలిగి ఉండటంవల్ల, మనము శాస్త్రీయపరమైన లబ్ధిని కలిగివుంటాము.
పండ్లు, శరీరానికి వేడిని / చల్లదనాన్ని కలుగజేసే వాటిగా ఎలా వర్గీకరించబడ్డాయి ?
ఆయుర్వేదం ప్రకారం, దాదాపు అన్ని పండ్లు వేడిని & చల్లదనాన్ని కలుగజేసే వాటిగా వర్గీకరించబడ్డాయి. మనము వినియోగించే పండ్ల అంతర్గత స్వభావాన్ని బట్టి, అవి మన శరీరంపై చూపే ప్రభావం ఆధారంగా దాని పనితనాన్ని సూచిస్తుంది. కొన్ని పండ్లు మన శరీరంలో అంతర్గతంగా వేడిని పెంచుతాయి, మరికొన్ని వేడిని తగ్గిస్తాయి. ఈ విధంగా వాటిని వేడి చేసేవిగా (లేదా) చల్లబరిచేవిగా వర్గీకరించవచ్చు.
సీతాఫలము మన శరీరాన్ని చల్లబరుస్తుందా ?
సాధారణంగా మనదేశంలో సీతాఫలము (లేదా) కస్టర్డ్-ఆపిల్గా పిలవబడే ఈ పండు మందపాటి ఉపరితల చర్మాన్ని కలిగి, లోపలివైపు మృదువుగా ఉన్న క్రీము తీపి రుచిని కలిగి ఉంటుంది. ఈ పండు లోపల ఉన్న తెల్లని గుజ్జు విత్తనాలను కలిగి చాలా తీయగా ఉంటుంది. ఈ పండు మన శరీర ఉష్ణోగ్రతను / వేడిని శాంతపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఇది మన శరీర అంతర్గత ఉష్ణోగ్రతను శాంతపరిచేదిగా ఉంటుంది.
అందువల్లేనా సీతాఫలం మీకు జలుబు కలగజేస్తుంది ?
ససేమిరా కాదు!, పండ్లు మీకు జలుబును కలగజేస్తాయని చాలామంది అపార్ధం చేసుకుంటారు. సాధారణంగా జలుబు అనేది వైరస్ల ద్వారా మాత్రమే సంభవిస్తుంది కానీ, కొన్ని రకాల పండ్లను తినడం వల్ల మాత్రం కాదు. ఈ వ్యాఖ్య, గత కొన్ని శతాబ్దాల నుంచి ప్రచారంలో ఉన్న అబద్ధాన్ని అంతం చేయడంలో సహాయపడుతుంది.
ఆ పురాణ నమ్మకం పూర్తిగా అసత్యమైతే ?
శరీర ఉష్ణాన్ని తగ్గించే స్వభావంగల పదార్థాలను తినడం వల్ల మీకు జలుబు వ్యాపిస్తుందన్న నమ్మకం, ప్రజలలో యుగాలనాటి నుండి ప్రబలంగా ఉంది. ఇది పూర్తిగా తొలగించబడుతుందన్న నమ్మకం మాకు లేదు.
శీతల స్వభావాన్ని కలిగిన ఆహారాల వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గినట్లయితే, వాటిని ఎక్కువ మోతాదులో తినడం వల్ల అలా మాత్రమే సంభవిస్తాయి. (ఇది సాధారణ వ్యక్తికి సాధ్యం కాదు)
ఇలాంటి చలువ పండ్లను అధికంగా తినడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరమైన స్థాయిలోకి తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితి వల్ల మన శరీరంలో ఉన్న రోగనిరోధకశక్తి బలహీనపడి, సాధారణ జలుబు వంటి అంటువ్యాధులు సంభవించే అవకాశాలను ఎక్కువ చేస్తుంది.
1. ఇవి క్యాన్సర్ వ్యతిరేకిగా ఉంటాయి :-
సీతాఫలం వల్ల కలిగే సాధారణమైన ప్రయోజనాల గూర్చి మాత్రమే ప్రజలకి తెలుసు. కానీ కొన్ని పరిశోధనల తర్వాత అవి క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉన్నదని వాస్తవం వెలుగులోనికి వచ్చింది.
2. ఇది ఐరన్కు గొప్ప మూలము :-
రక్త హీనతను కలిగిన రోగులు, ఐరన్ ను ఎక్కువగా కలిగి ఉండే ఈ సీతాఫలాన్ని తరచుగా తినాల్సిందేనని డాక్టర్ల చేత ప్రత్యేకంగా సిఫార్సు చేయబడింది. ఎందుకంటే ఈ పండ్లను తినడం వల్ల, రక్తంలో హిమోగ్లోబిన్ వాహక సామర్ధ్యాన్ని పెంచి - మీలో అలసటను దూరం చేస్తుంది.
3. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది :-
ఈ పండులో విటమిన్-బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండటం వల్ల అవి మెదడులోని ఒత్తిడి స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది పార్కిన్సన్స్ వ్యాధి అనే ప్రమాదకరమైన మెదడు రుగ్మత నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
4. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి :-
ఈ పండులో ఉన్న ఫైబర్ శరీరం నుంచి విషపదార్ధాలను సులభంగా బయటకు నెట్టడంలో సహాయపడుతుంది. అసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి కడప సంబంధిత సమస్యలకు మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.
5. శరీర బరువును పెంపొందిస్తుంది :-
ఈ పండులో అధికంగా గ్యాలరీలో ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా ప్రభావవంతమైన ఫలితాలను కలుగజేస్తుంది. అలాగే ఇది మీ జీవక్రియ రేటు పెంచి తద్వారా మీ ఆకలిని పెంపొందిస్తుంది.
6. మీ చర్మం యవ్వనంగా, కాంతివంతంగా ఉండేటట్లుగా చేస్తుంది :-
ఈ ఫలాన్ని మీరు తరచుగా వినియోగించడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది చర్మ స్థితిస్థాపకతను నిలిపివేసి, వృద్యాప సంకేతాలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.